సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న గుంటూరు కారం షూటింగ్ తాలూకు ఆలస్యాల పర్వం ఎంతకీ తెగడం లేదు. సంవత్సరంలో ఇప్పటికే ఆరు నెలలు గడిచిపోతున్నాయి. ఇంకో నూటా ఎనభై రోజులు మాత్రమే టైం ఉంది. 2024 జనవరి 13 విడుదలని అఫీషియల్ గా టీజర్ తో పాటుగా అనౌన్స్ చేశారు కాబట్టి ఇక వెనుకడుగు వేయడానికి లేదు. టీమ్ ఎంత పట్టుదలగా ఉన్నా ఆర్టిస్టుల డేట్లను సమన్వయం చేసుకోవడం టీమ్ కి పెద్ద సవాల్ గా మారిందట. టాప్ రేటెడ్ క్యాస్టింగ్ ఉండటమే దీనికి కారణం.
హీరో ఎంత అందుబాటులో ఉన్నా ఇతరులతో కాంబో ఉన్న షెడ్యూల్స్ కి వాళ్ళను టైంకి ఉండేలా చూసుకోవడం చాలా అవసరం. జయరాం, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, సునీల్, జగపతి బాబు వీళ్లంతా మాములు బిజీగా లేరు. హఠాత్తుగా డేట్లు కావాలంటే దొరకరు. హీరోయిన్ పూజా హెగ్డేకూ కొత్త కమిట్ మెంట్స్ వస్తున్నాయి. ఇక శ్రీలీల సంగతి సరేసరి. ఒకేసారి దశావతారంలాగా గంప నిండా సినిమాలతో ఉక్కిరి బిక్కిరవుతోంది. వీళ్లందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి లొకేషన్లు సెట్ చేసుకోవడం, పాటలు ప్లాన్ చేయడం ఇవన్నీ అంత సులభంగా తేలే వ్యవహారాలు కాదు.
ఇదంతా చూస్తుంటే గుంటూరు కారం సంక్రాంతికి రావడం పట్ల అనుమానం ఉందంటూ పలు సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ప్రచారం మొదలయ్యింది. అయితే సితార సంస్థ మాత్రం ఈ విషయంలో పట్టుదల చూపిస్తోందట. బంగారం లాంటి సంక్రాంతి సీజన్ ని వదులుకోవడం ఇష్టం లేక ఎలాగైనా టార్గెట్ ని చేరుకోవాలని చూస్తోంది. ఒకవేళ ఏదైనా వాయిదా అంటూ జరిగితే మాత్రం ఫ్యాన్స్ కోపం కట్టలు తెంచేసుకుంటుంది. అలా జరగకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా అప్డేట్స్ ఇవ్వడంతో పాటు కారం వేగంగా దంచేసి వంటకు సిద్ధం చేయాలి. తమన్ పాటల కంపోజింగ్ ఇంకా కొలిక్కి రాలేదని టాక్
This post was last modified on June 17, 2023 4:50 pm
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…