సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న గుంటూరు కారం షూటింగ్ తాలూకు ఆలస్యాల పర్వం ఎంతకీ తెగడం లేదు. సంవత్సరంలో ఇప్పటికే ఆరు నెలలు గడిచిపోతున్నాయి. ఇంకో నూటా ఎనభై రోజులు మాత్రమే టైం ఉంది. 2024 జనవరి 13 విడుదలని అఫీషియల్ గా టీజర్ తో పాటుగా అనౌన్స్ చేశారు కాబట్టి ఇక వెనుకడుగు వేయడానికి లేదు. టీమ్ ఎంత పట్టుదలగా ఉన్నా ఆర్టిస్టుల డేట్లను సమన్వయం చేసుకోవడం టీమ్ కి పెద్ద సవాల్ గా మారిందట. టాప్ రేటెడ్ క్యాస్టింగ్ ఉండటమే దీనికి కారణం.
హీరో ఎంత అందుబాటులో ఉన్నా ఇతరులతో కాంబో ఉన్న షెడ్యూల్స్ కి వాళ్ళను టైంకి ఉండేలా చూసుకోవడం చాలా అవసరం. జయరాం, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, సునీల్, జగపతి బాబు వీళ్లంతా మాములు బిజీగా లేరు. హఠాత్తుగా డేట్లు కావాలంటే దొరకరు. హీరోయిన్ పూజా హెగ్డేకూ కొత్త కమిట్ మెంట్స్ వస్తున్నాయి. ఇక శ్రీలీల సంగతి సరేసరి. ఒకేసారి దశావతారంలాగా గంప నిండా సినిమాలతో ఉక్కిరి బిక్కిరవుతోంది. వీళ్లందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి లొకేషన్లు సెట్ చేసుకోవడం, పాటలు ప్లాన్ చేయడం ఇవన్నీ అంత సులభంగా తేలే వ్యవహారాలు కాదు.
ఇదంతా చూస్తుంటే గుంటూరు కారం సంక్రాంతికి రావడం పట్ల అనుమానం ఉందంటూ పలు సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ప్రచారం మొదలయ్యింది. అయితే సితార సంస్థ మాత్రం ఈ విషయంలో పట్టుదల చూపిస్తోందట. బంగారం లాంటి సంక్రాంతి సీజన్ ని వదులుకోవడం ఇష్టం లేక ఎలాగైనా టార్గెట్ ని చేరుకోవాలని చూస్తోంది. ఒకవేళ ఏదైనా వాయిదా అంటూ జరిగితే మాత్రం ఫ్యాన్స్ కోపం కట్టలు తెంచేసుకుంటుంది. అలా జరగకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా అప్డేట్స్ ఇవ్వడంతో పాటు కారం వేగంగా దంచేసి వంటకు సిద్ధం చేయాలి. తమన్ పాటల కంపోజింగ్ ఇంకా కొలిక్కి రాలేదని టాక్
This post was last modified on June 17, 2023 4:50 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…