నిన్న విడుదలైన ఆదిపురుష్ టాకులు ఫలితాలు కాసేపు పక్కనపెడితే ప్రభాస్ రియల్ స్టామినా ఏంటో మరోసారి బయట పడింది. తన ప్యాన్ ఇండియా ఇమేజ్ ఏ స్థాయిలో మేజిక్ చేయగలదో ఋజువు చేసింది. ఒకటి రెండు కాదు మొదటి రోజు ఏకంగా మూడు సినిమాలతో ఫస్ట్ డే హండ్రెడ్ క్రోర్ గ్రాసర్స్ సాధించడం సంచలన రికార్డు. గతంలో బాహుబలి 2, సాహోతో ఈ ఫీట్ సాధించిన ప్రభాస్ రాధే శ్యామ్ తో హ్యాట్రిక్ మిస్ అయ్యాడు. అది ప్రేమకథ కాకుండా ఏదైనా ఫాంటసీ లేదా విజువల్ ఎఫెక్ట్స్ జానర్ అయ్యుంటే ఇంకో మైలురాయి సులభంగా తోడయ్యేది
ఎలా చూసుకున్నా వచ్చిన టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ ర్యాంపేజ్ మాత్రం కొనసాగుతోంది. ఆదిపురుష్ సుమారు 138 కోట్ల నుంచి 150 కోట్ల మధ్యలో ఫిగర్స్ ని నమోదు చేసింది. ప్రొడక్షన్ హౌస్ నుంచి అఫీషియల్ లెక్కలు రాకపోవడంతో ప్రస్తుతానికి ట్రేడ్ నుంచి అందిన సమాచారం మేరకు ఇవి చెలామణిలోకి వచ్చాయి. వంద కోట్ల మార్క్ చేరుకోవడం మీద తొలుత కొన్ని అనుమానాలు వచ్చాయి. కానీ మార్నింగ్ షో రెస్పాన్స్ తో సంబంధం లేకుండా జనాలు థియేటర్లను నింపేయడంతో చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు తీయాల్సిన అవసరం పడలేదు
దీన్ని బట్టే ప్రభాస్ ప్యాన్ ఇండియా రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఇవాళ రేపు వీకెండ్ కాబట్టి కలెక్షన్ల పరంగా పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. పైగా ఏ సెంటర్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ లోనే సండే సెకండ్ షో వరకు ఫుల్ అయిపోయాయి. ఒకవేళ సోమవారం నుంచి కూడా స్టడీగా ఉంటే బయ్యర్లు నిశ్చింతగా ఉండొచ్చు. అది తేలాలంటే ఇంకో మూడు రోజులు ఎదురు చూడాల్సిందే. హిందీ వెర్షన్ తోనూ 40 కోట్లకు దగ్గరగా వెళ్లిన ప్రభాస్ బాలీవుడ్ ఖాన్ల ద్వయానికి రాబోయే రోజుల్లో భారీ సవాళ్లు విసరడం ఖాయమే .
This post was last modified on June 17, 2023 1:06 pm
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…