నిన్న విడుదలైన ఆదిపురుష్ టాకులు ఫలితాలు కాసేపు పక్కనపెడితే ప్రభాస్ రియల్ స్టామినా ఏంటో మరోసారి బయట పడింది. తన ప్యాన్ ఇండియా ఇమేజ్ ఏ స్థాయిలో మేజిక్ చేయగలదో ఋజువు చేసింది. ఒకటి రెండు కాదు మొదటి రోజు ఏకంగా మూడు సినిమాలతో ఫస్ట్ డే హండ్రెడ్ క్రోర్ గ్రాసర్స్ సాధించడం సంచలన రికార్డు. గతంలో బాహుబలి 2, సాహోతో ఈ ఫీట్ సాధించిన ప్రభాస్ రాధే శ్యామ్ తో హ్యాట్రిక్ మిస్ అయ్యాడు. అది ప్రేమకథ కాకుండా ఏదైనా ఫాంటసీ లేదా విజువల్ ఎఫెక్ట్స్ జానర్ అయ్యుంటే ఇంకో మైలురాయి సులభంగా తోడయ్యేది
ఎలా చూసుకున్నా వచ్చిన టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ ర్యాంపేజ్ మాత్రం కొనసాగుతోంది. ఆదిపురుష్ సుమారు 138 కోట్ల నుంచి 150 కోట్ల మధ్యలో ఫిగర్స్ ని నమోదు చేసింది. ప్రొడక్షన్ హౌస్ నుంచి అఫీషియల్ లెక్కలు రాకపోవడంతో ప్రస్తుతానికి ట్రేడ్ నుంచి అందిన సమాచారం మేరకు ఇవి చెలామణిలోకి వచ్చాయి. వంద కోట్ల మార్క్ చేరుకోవడం మీద తొలుత కొన్ని అనుమానాలు వచ్చాయి. కానీ మార్నింగ్ షో రెస్పాన్స్ తో సంబంధం లేకుండా జనాలు థియేటర్లను నింపేయడంతో చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు తీయాల్సిన అవసరం పడలేదు
దీన్ని బట్టే ప్రభాస్ ప్యాన్ ఇండియా రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఇవాళ రేపు వీకెండ్ కాబట్టి కలెక్షన్ల పరంగా పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. పైగా ఏ సెంటర్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ లోనే సండే సెకండ్ షో వరకు ఫుల్ అయిపోయాయి. ఒకవేళ సోమవారం నుంచి కూడా స్టడీగా ఉంటే బయ్యర్లు నిశ్చింతగా ఉండొచ్చు. అది తేలాలంటే ఇంకో మూడు రోజులు ఎదురు చూడాల్సిందే. హిందీ వెర్షన్ తోనూ 40 కోట్లకు దగ్గరగా వెళ్లిన ప్రభాస్ బాలీవుడ్ ఖాన్ల ద్వయానికి రాబోయే రోజుల్లో భారీ సవాళ్లు విసరడం ఖాయమే .
This post was last modified on June 17, 2023 1:06 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…