భారీ అంచనాల మధ్య విడుదలైన ఆదిపురుష్ మూవీ ఎట్టకేలకు థియేటర్లలో సందడి చేస్తున్న వైనం తెలిసిందే. అయితే.. మూవీ విడుదల సందర్భంగా అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సినిమాను చూసొచ్చి థియేటర్ బయట యూట్యూబ్ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చే వారిలో ఎవరైనా సినిమా బాగోలేదన్నంతనే వారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం కనిపిస్తోంది. ఒకట్రెండు చోట్ల సినిమా బాగోలేదన్న మాట చెప్పిన వారిపై దాడి జరిగిన ఘటనలు ఇప్పటికే రిపోర్టు అయ్యాయి. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ లోని కూకట్ పల్లి లోని భ్రమరాంబ థియేటర్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.
ఆదిపురుష్ మూవీని ప్రదర్శిస్తున్న ప్రతి థియేటర్ లోనూ హనుమంతుల వారికి ఒక సీటును కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఈ సీటు పక్కనే కూర్చొని సినిమా చూసేందుకు ప్రముఖులు నుంచి సామాన్యుల వరకు ఆసక్తిని ప్రదర్శించటం తెలిసిందే. మరికొందరు రికమండేషన్లతో హనుమంతుల వారికి కేటాయించిన సీటు పక్కన కూర్చొని సినిమా చూసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. భ్రమరాంబ థియేటర్ లో ఆదిపురుష్ సినిమా చూసేందుకు వచ్చిన ఒక వ్యక్తి.. హనుమంతుల వారికి కేటాయించిన సీట్లో కూర్చున్నాడు. దీనిపై కొందరుఅభ్యంతరం వ్యక్తం చేసినా.. అతడు స్పందించలేదు.
దీంతో.. అతడిపై కొందరు దాడికి పాల్పడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో.. థియేటర్ సిబ్బంది జోక్యం చేసుకొని.. హనుమంతుల వారికి కేటాయించిన సీట్లోకూర్చున్న వ్యక్తిని.. వేరే సీట్లోకి పంపారు. అయితే.. హనుమంతుల వారి సీట్లో కూర్చున్న వ్యక్తి మద్యం సేవించి సినిమాకు వచ్చినట్లుగా చెబుతున్నారు. హనుమంతుల వారికి కేటాయించిన సీటును పరమ పవిత్రంగా భావిస్తూ.. సినిమాను చూస్తున్న ప్రేక్షకుల వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
This post was last modified on June 17, 2023 11:24 am
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…