భారీ అంచనాల మధ్య విడుదలైన ఆదిపురుష్ మూవీ ఎట్టకేలకు థియేటర్లలో సందడి చేస్తున్న వైనం తెలిసిందే. అయితే.. మూవీ విడుదల సందర్భంగా అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సినిమాను చూసొచ్చి థియేటర్ బయట యూట్యూబ్ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చే వారిలో ఎవరైనా సినిమా బాగోలేదన్నంతనే వారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం కనిపిస్తోంది. ఒకట్రెండు చోట్ల సినిమా బాగోలేదన్న మాట చెప్పిన వారిపై దాడి జరిగిన ఘటనలు ఇప్పటికే రిపోర్టు అయ్యాయి. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ లోని కూకట్ పల్లి లోని భ్రమరాంబ థియేటర్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.
ఆదిపురుష్ మూవీని ప్రదర్శిస్తున్న ప్రతి థియేటర్ లోనూ హనుమంతుల వారికి ఒక సీటును కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఈ సీటు పక్కనే కూర్చొని సినిమా చూసేందుకు ప్రముఖులు నుంచి సామాన్యుల వరకు ఆసక్తిని ప్రదర్శించటం తెలిసిందే. మరికొందరు రికమండేషన్లతో హనుమంతుల వారికి కేటాయించిన సీటు పక్కన కూర్చొని సినిమా చూసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. భ్రమరాంబ థియేటర్ లో ఆదిపురుష్ సినిమా చూసేందుకు వచ్చిన ఒక వ్యక్తి.. హనుమంతుల వారికి కేటాయించిన సీట్లో కూర్చున్నాడు. దీనిపై కొందరుఅభ్యంతరం వ్యక్తం చేసినా.. అతడు స్పందించలేదు.
దీంతో.. అతడిపై కొందరు దాడికి పాల్పడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో.. థియేటర్ సిబ్బంది జోక్యం చేసుకొని.. హనుమంతుల వారికి కేటాయించిన సీట్లోకూర్చున్న వ్యక్తిని.. వేరే సీట్లోకి పంపారు. అయితే.. హనుమంతుల వారి సీట్లో కూర్చున్న వ్యక్తి మద్యం సేవించి సినిమాకు వచ్చినట్లుగా చెబుతున్నారు. హనుమంతుల వారికి కేటాయించిన సీటును పరమ పవిత్రంగా భావిస్తూ.. సినిమాను చూస్తున్న ప్రేక్షకుల వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
సినిమాలను అడ్డుకోవడం లేదా బ్యాన్ చేయడం వల్ల వాటి క్రేజ్ తగ్గడం పక్కన పెడితే నెటిజన్లలో క్యూరియాసిటీ మరింత పెరుగుతుందని…
బాలీవుడ్లో ఒకప్పుడు కంగనా రనౌత్కు తిరుగులేని స్టార్ ఇమేజ్, మార్కెట్ ఉండేది. కానీ వరుస ఫ్లాపులకు తోడు ఆమె వ్యక్తిగత ప్రవర్తన కారణంగా…
రాఘవ లారెన్స్ అంటే మొదట స్టార్ కొరియోగ్రాఫర్. తర్వాత అతను నటుడిగా మారి కొన్ని సినిమాలు చేశాడు. అంత వరకు…
బాలీవుడ్ బిగ్గెస్ట్ విజువల్ గ్రాండియర్ గా ప్రచారంలో ఉన్న రామాయణ పార్ట్ 1 దీపావళి విడుదలకు రెడీ అవుతోంది. ఇంకా…
బాలీవుడ్లో దీపికా పదుకొనే, ఆలియా భట్ లాంటి హై ప్రొఫైల్ హీరోయిన్ల పోటీని తట్టుకుని చాలా ఏళ్లుగా టాప్లో కొనసాగుతున్న…
జింబాబ్వే పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లదే ఆధిపత్యం నడుస్తోంది. కుర్రాడు వైభవ్ సూర్యవంశీతో…