భారీ అంచనాల మధ్య విడుదలైన ఆదిపురుష్ మూవీ ఎట్టకేలకు థియేటర్లలో సందడి చేస్తున్న వైనం తెలిసిందే. అయితే.. మూవీ విడుదల సందర్భంగా అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సినిమాను చూసొచ్చి థియేటర్ బయట యూట్యూబ్ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చే వారిలో ఎవరైనా సినిమా బాగోలేదన్నంతనే వారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం కనిపిస్తోంది. ఒకట్రెండు చోట్ల సినిమా బాగోలేదన్న మాట చెప్పిన వారిపై దాడి జరిగిన ఘటనలు ఇప్పటికే రిపోర్టు అయ్యాయి. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ లోని కూకట్ పల్లి లోని భ్రమరాంబ థియేటర్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.
ఆదిపురుష్ మూవీని ప్రదర్శిస్తున్న ప్రతి థియేటర్ లోనూ హనుమంతుల వారికి ఒక సీటును కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఈ సీటు పక్కనే కూర్చొని సినిమా చూసేందుకు ప్రముఖులు నుంచి సామాన్యుల వరకు ఆసక్తిని ప్రదర్శించటం తెలిసిందే. మరికొందరు రికమండేషన్లతో హనుమంతుల వారికి కేటాయించిన సీటు పక్కన కూర్చొని సినిమా చూసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. భ్రమరాంబ థియేటర్ లో ఆదిపురుష్ సినిమా చూసేందుకు వచ్చిన ఒక వ్యక్తి.. హనుమంతుల వారికి కేటాయించిన సీట్లో కూర్చున్నాడు. దీనిపై కొందరుఅభ్యంతరం వ్యక్తం చేసినా.. అతడు స్పందించలేదు.
దీంతో.. అతడిపై కొందరు దాడికి పాల్పడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో.. థియేటర్ సిబ్బంది జోక్యం చేసుకొని.. హనుమంతుల వారికి కేటాయించిన సీట్లోకూర్చున్న వ్యక్తిని.. వేరే సీట్లోకి పంపారు. అయితే.. హనుమంతుల వారి సీట్లో కూర్చున్న వ్యక్తి మద్యం సేవించి సినిమాకు వచ్చినట్లుగా చెబుతున్నారు. హనుమంతుల వారికి కేటాయించిన సీటును పరమ పవిత్రంగా భావిస్తూ.. సినిమాను చూస్తున్న ప్రేక్షకుల వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
This post was last modified on June 17, 2023 11:24 am
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…