భారీ అంచనాల మధ్య విడుదలైన ఆదిపురుష్ మూవీ ఎట్టకేలకు థియేటర్లలో సందడి చేస్తున్న వైనం తెలిసిందే. అయితే.. మూవీ విడుదల సందర్భంగా అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సినిమాను చూసొచ్చి థియేటర్ బయట యూట్యూబ్ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చే వారిలో ఎవరైనా సినిమా బాగోలేదన్నంతనే వారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం కనిపిస్తోంది. ఒకట్రెండు చోట్ల సినిమా బాగోలేదన్న మాట చెప్పిన వారిపై దాడి జరిగిన ఘటనలు ఇప్పటికే రిపోర్టు అయ్యాయి. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ లోని కూకట్ పల్లి లోని భ్రమరాంబ థియేటర్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.
ఆదిపురుష్ మూవీని ప్రదర్శిస్తున్న ప్రతి థియేటర్ లోనూ హనుమంతుల వారికి ఒక సీటును కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఈ సీటు పక్కనే కూర్చొని సినిమా చూసేందుకు ప్రముఖులు నుంచి సామాన్యుల వరకు ఆసక్తిని ప్రదర్శించటం తెలిసిందే. మరికొందరు రికమండేషన్లతో హనుమంతుల వారికి కేటాయించిన సీటు పక్కన కూర్చొని సినిమా చూసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. భ్రమరాంబ థియేటర్ లో ఆదిపురుష్ సినిమా చూసేందుకు వచ్చిన ఒక వ్యక్తి.. హనుమంతుల వారికి కేటాయించిన సీట్లో కూర్చున్నాడు. దీనిపై కొందరుఅభ్యంతరం వ్యక్తం చేసినా.. అతడు స్పందించలేదు.
దీంతో.. అతడిపై కొందరు దాడికి పాల్పడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో.. థియేటర్ సిబ్బంది జోక్యం చేసుకొని.. హనుమంతుల వారికి కేటాయించిన సీట్లోకూర్చున్న వ్యక్తిని.. వేరే సీట్లోకి పంపారు. అయితే.. హనుమంతుల వారి సీట్లో కూర్చున్న వ్యక్తి మద్యం సేవించి సినిమాకు వచ్చినట్లుగా చెబుతున్నారు. హనుమంతుల వారికి కేటాయించిన సీటును పరమ పవిత్రంగా భావిస్తూ.. సినిమాను చూస్తున్న ప్రేక్షకుల వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
This post was last modified on June 17, 2023 11:24 am
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…