గత ఏడాది రోడ్డు ప్రమాదం తర్వాత సాయిధరమ్ తేజ్ పరిస్థితి ఏమవుతుందో ఏమో అని అంతా కంగారు పడ్డారు. ఓవైపు ‘రిపబ్లిక్’ సినిమా ఫ్లాప్ అయింది. మరోవైపు నెలల తరబడి తేజు ఆసుపత్రికి పరిమితం అయ్యాడు. కోలుకున్నాక కూడా అంత హుషారుగా కనిపించలేదు. దీంతో తేజు కెరీర్ మీద నీలి నీడలు కమ్ముకున్న సంకేతాలు కనిపించాయి. కానీ ‘విరూపాక్ష’ సినిమా ఆ సందేహాలన్నింటినీ పటాపంచలు చేసింది.
లో బజ్తో రిలీజైన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ అయింది. ఈ వేసవిలో ఇదే టాలీవుడ్కు బిగ్గెస్ట్ హిట్ కావడం విశేషం. దీని తర్వాత తేజ.. తన మావయ్య పవన్ కళ్యాణ్తో కలిసి నటిస్తున్న ‘బ్రో’ సినిమాకు మంచి హైపే ఉంది. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉండగానే.. తన తర్వాతి చిత్రానికి రంగం సిద్ధం చేసుకున్నాడతను. మాస్ డైరెక్టర్ సంపత్ నందితో తేజు సినిమా ఖరారైన సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు ఆల్రెడీ టైటిల్ కూడా ఖరారైనట్లు సమాచారం. ‘గోలీ శంకర్’ అనే మాస్ టైటిల్ పెడుతున్నారట ఈ చిత్రానికి. ‘గంజా శంకర్’ అనే టైటిల్ కూడా పరిశీలనలోకి వచ్చినప్పటికీ.. ‘గంజా’ అని పెడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతికూల సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతో ‘గోలీ శంకర్’ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారు.
అదే రోజు టైటిల్ కూడా ప్రకటిస్తారు. ప్రస్తుతం వరుస చిత్రాలతో ఊపుమీదున్న సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ.. ఈ సినిమాను నిర్మించబోతోంది. ఆల్రెడీ తేజు తమ్ముడు వైష్ణవ్ తేజ్తో ‘ఆదికేశవ’ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్న సితార వాళ్లు.. ఇప్పుడు తేజుతో జట్టు కడుతున్నారు. సంపత్.. చివరగా గోపీచంద్తో తీసిన ‘సీటీమార్’ ఓ మోస్తరుగా ఆడింది. అతను గతంలో రామ్ చరణ్తో తీసిన ‘రచ్చ’ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తేజు చాన్నాళ్ల తర్వాత చేయనున్న పక్కా మాస్ మూవీ ఇదే.
This post was last modified on June 16, 2023 6:44 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…