గత ఏడాది రోడ్డు ప్రమాదం తర్వాత సాయిధరమ్ తేజ్ పరిస్థితి ఏమవుతుందో ఏమో అని అంతా కంగారు పడ్డారు. ఓవైపు ‘రిపబ్లిక్’ సినిమా ఫ్లాప్ అయింది. మరోవైపు నెలల తరబడి తేజు ఆసుపత్రికి పరిమితం అయ్యాడు. కోలుకున్నాక కూడా అంత హుషారుగా కనిపించలేదు. దీంతో తేజు కెరీర్ మీద నీలి నీడలు కమ్ముకున్న సంకేతాలు కనిపించాయి. కానీ ‘విరూపాక్ష’ సినిమా ఆ సందేహాలన్నింటినీ పటాపంచలు చేసింది.
లో బజ్తో రిలీజైన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ అయింది. ఈ వేసవిలో ఇదే టాలీవుడ్కు బిగ్గెస్ట్ హిట్ కావడం విశేషం. దీని తర్వాత తేజ.. తన మావయ్య పవన్ కళ్యాణ్తో కలిసి నటిస్తున్న ‘బ్రో’ సినిమాకు మంచి హైపే ఉంది. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉండగానే.. తన తర్వాతి చిత్రానికి రంగం సిద్ధం చేసుకున్నాడతను. మాస్ డైరెక్టర్ సంపత్ నందితో తేజు సినిమా ఖరారైన సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు ఆల్రెడీ టైటిల్ కూడా ఖరారైనట్లు సమాచారం. ‘గోలీ శంకర్’ అనే మాస్ టైటిల్ పెడుతున్నారట ఈ చిత్రానికి. ‘గంజా శంకర్’ అనే టైటిల్ కూడా పరిశీలనలోకి వచ్చినప్పటికీ.. ‘గంజా’ అని పెడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతికూల సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతో ‘గోలీ శంకర్’ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారు.
అదే రోజు టైటిల్ కూడా ప్రకటిస్తారు. ప్రస్తుతం వరుస చిత్రాలతో ఊపుమీదున్న సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ.. ఈ సినిమాను నిర్మించబోతోంది. ఆల్రెడీ తేజు తమ్ముడు వైష్ణవ్ తేజ్తో ‘ఆదికేశవ’ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్న సితార వాళ్లు.. ఇప్పుడు తేజుతో జట్టు కడుతున్నారు. సంపత్.. చివరగా గోపీచంద్తో తీసిన ‘సీటీమార్’ ఓ మోస్తరుగా ఆడింది. అతను గతంలో రామ్ చరణ్తో తీసిన ‘రచ్చ’ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తేజు చాన్నాళ్ల తర్వాత చేయనున్న పక్కా మాస్ మూవీ ఇదే.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…