గత ఏడాది రోడ్డు ప్రమాదం తర్వాత సాయిధరమ్ తేజ్ పరిస్థితి ఏమవుతుందో ఏమో అని అంతా కంగారు పడ్డారు. ఓవైపు ‘రిపబ్లిక్’ సినిమా ఫ్లాప్ అయింది. మరోవైపు నెలల తరబడి తేజు ఆసుపత్రికి పరిమితం అయ్యాడు. కోలుకున్నాక కూడా అంత హుషారుగా కనిపించలేదు. దీంతో తేజు కెరీర్ మీద నీలి నీడలు కమ్ముకున్న సంకేతాలు కనిపించాయి. కానీ ‘విరూపాక్ష’ సినిమా ఆ సందేహాలన్నింటినీ పటాపంచలు చేసింది.
లో బజ్తో రిలీజైన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ అయింది. ఈ వేసవిలో ఇదే టాలీవుడ్కు బిగ్గెస్ట్ హిట్ కావడం విశేషం. దీని తర్వాత తేజ.. తన మావయ్య పవన్ కళ్యాణ్తో కలిసి నటిస్తున్న ‘బ్రో’ సినిమాకు మంచి హైపే ఉంది. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉండగానే.. తన తర్వాతి చిత్రానికి రంగం సిద్ధం చేసుకున్నాడతను. మాస్ డైరెక్టర్ సంపత్ నందితో తేజు సినిమా ఖరారైన సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు ఆల్రెడీ టైటిల్ కూడా ఖరారైనట్లు సమాచారం. ‘గోలీ శంకర్’ అనే మాస్ టైటిల్ పెడుతున్నారట ఈ చిత్రానికి. ‘గంజా శంకర్’ అనే టైటిల్ కూడా పరిశీలనలోకి వచ్చినప్పటికీ.. ‘గంజా’ అని పెడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతికూల సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతో ‘గోలీ శంకర్’ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారు.
అదే రోజు టైటిల్ కూడా ప్రకటిస్తారు. ప్రస్తుతం వరుస చిత్రాలతో ఊపుమీదున్న సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ.. ఈ సినిమాను నిర్మించబోతోంది. ఆల్రెడీ తేజు తమ్ముడు వైష్ణవ్ తేజ్తో ‘ఆదికేశవ’ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్న సితార వాళ్లు.. ఇప్పుడు తేజుతో జట్టు కడుతున్నారు. సంపత్.. చివరగా గోపీచంద్తో తీసిన ‘సీటీమార్’ ఓ మోస్తరుగా ఆడింది. అతను గతంలో రామ్ చరణ్తో తీసిన ‘రచ్చ’ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తేజు చాన్నాళ్ల తర్వాత చేయనున్న పక్కా మాస్ మూవీ ఇదే.
This post was last modified on June 16, 2023 6:44 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…