గత ఏడాది రోడ్డు ప్రమాదం తర్వాత సాయిధరమ్ తేజ్ పరిస్థితి ఏమవుతుందో ఏమో అని అంతా కంగారు పడ్డారు. ఓవైపు ‘రిపబ్లిక్’ సినిమా ఫ్లాప్ అయింది. మరోవైపు నెలల తరబడి తేజు ఆసుపత్రికి పరిమితం అయ్యాడు. కోలుకున్నాక కూడా అంత హుషారుగా కనిపించలేదు. దీంతో తేజు కెరీర్ మీద నీలి నీడలు కమ్ముకున్న సంకేతాలు కనిపించాయి. కానీ ‘విరూపాక్ష’ సినిమా ఆ సందేహాలన్నింటినీ పటాపంచలు చేసింది.
లో బజ్తో రిలీజైన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ అయింది. ఈ వేసవిలో ఇదే టాలీవుడ్కు బిగ్గెస్ట్ హిట్ కావడం విశేషం. దీని తర్వాత తేజ.. తన మావయ్య పవన్ కళ్యాణ్తో కలిసి నటిస్తున్న ‘బ్రో’ సినిమాకు మంచి హైపే ఉంది. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉండగానే.. తన తర్వాతి చిత్రానికి రంగం సిద్ధం చేసుకున్నాడతను. మాస్ డైరెక్టర్ సంపత్ నందితో తేజు సినిమా ఖరారైన సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు ఆల్రెడీ టైటిల్ కూడా ఖరారైనట్లు సమాచారం. ‘గోలీ శంకర్’ అనే మాస్ టైటిల్ పెడుతున్నారట ఈ చిత్రానికి. ‘గంజా శంకర్’ అనే టైటిల్ కూడా పరిశీలనలోకి వచ్చినప్పటికీ.. ‘గంజా’ అని పెడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతికూల సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతో ‘గోలీ శంకర్’ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారు.
అదే రోజు టైటిల్ కూడా ప్రకటిస్తారు. ప్రస్తుతం వరుస చిత్రాలతో ఊపుమీదున్న సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ.. ఈ సినిమాను నిర్మించబోతోంది. ఆల్రెడీ తేజు తమ్ముడు వైష్ణవ్ తేజ్తో ‘ఆదికేశవ’ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్న సితార వాళ్లు.. ఇప్పుడు తేజుతో జట్టు కడుతున్నారు. సంపత్.. చివరగా గోపీచంద్తో తీసిన ‘సీటీమార్’ ఓ మోస్తరుగా ఆడింది. అతను గతంలో రామ్ చరణ్తో తీసిన ‘రచ్చ’ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తేజు చాన్నాళ్ల తర్వాత చేయనున్న పక్కా మాస్ మూవీ ఇదే.
This post was last modified on June 16, 2023 6:44 pm
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…