పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రాల్లో ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రం ‘ఓజీ’. పవన్కు పెద్ద ఫ్యాన్ అయిన టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ సుజీత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. రెండు నెలల కిందటే సెట్స్ మీదికి వెళ్లిన ఈ చిత్రం.. వరుస షెడ్యూళ్లతో చకచకా షూటింగ్ జరుపుకుంది. కానీ ఇప్పుడు పవన్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి దిగాలని నిర్ణయించుకోవడంతో మిగతా చిత్రాల్లాగే ‘ఓజీ’కి బ్రేక్ పడ్డట్లు వార్తలు వస్తున్నాయి.
కానీ చిత్ర బృందం మాత్రం ఆ ప్రచారానికి భిన్నంగా వ్యవహరిస్తోంది. సినిమా కాస్టింగ్కు సంబంధించి కొత్త అప్డేట్స్ ఇస్తూనే ఉంది. వారం కిందటే తమిళ నటుడు అర్జున్ దాస్ ‘ఓజీ’లో నటిస్తున్న విషయాన్ని ప్రకటించారు. తర్వాత ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు శ్రియారెడ్డి వెల్లడించింది. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కాస్టింగ్ అప్డేట్ బయటికొచ్చింది. ‘ఓజీ’లో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్ పాత్ర పోషించనున్నాడట. బాలీవుడ్ నటులు తెలుగులో విలన్ పాత్రలు చేయడం కొత్తేమీ కాదు.
ఈ మధ్య ఈ ట్రెండ్ ఊపందుకుంది. ఐతే బాలీవుడ్లో ముద్దుల హీరోగా పేరుపడ్డ ఇమ్రాన్ హష్మిని ఇప్పటి వరకు ఎవరూ తెలుగు చిత్రాల కోసం సంప్రదించింది లేదు. సుజీత్ వైవిధ్యంగా ఆలోచించి అతణ్ని విలన్ పాత్రకు సెలెక్ట్ చేసుకున్నాడు. హిందీలో కూడా అతను కొన్ని నెగెటివ్ రోల్స్ చేశాడు. మరి పవన్ ముందు అతను ఎంత బలంగా నిలబడతాడన్నది ఆసక్తికరం. మలయాళ నటి ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సీనియర్ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు.
This post was last modified on June 15, 2023 9:44 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…