ఇప్పుడు ఇండియా అంతా ‘ఆదిపురుష్’ మేనియాతో ఊగిపోతోంది. ఒకప్పుడు సినిమా మీద అంతగా బజ్ లేదు కానీ.. రిలీజ్ ముంగిట మాత్రం హైప్ మామూలుగా లేదు. నార్త్ ఇండియాలో ‘ఆదిపురుష్’ హిందీ వెర్షన్కు సంబంధించి వారం ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా.. రెస్పాన్స్ అదిరిపోయింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ కొంచెం లేటుగా మొదలైనప్పటికీ.. అమ్మకాలు మామూలుగా లేవు.
బుక్ మై షో, పేటీఎం యాప్స్ స్ట్రక్ అయ్యే రేంజిలో జనాలు టికెట్ల కోసం ఎగబడ్డారు. ఇలా దేశవ్యాప్తంగా మెజారిటీ ప్రాంతాల్లో ‘ఆదిపురుష్’ కోసం జనం ఎగబడుతున్నారు. కానీ ఒక్క తమిళనాడులో మాత్రం దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. తమిళ ప్రేక్షకులు కానీ, ట్రేడ్ వర్గాలు కానీ ఈ సినిమాను పట్టించుకోవడం లేదు. ముందు నుంచే సినిమాకు అక్కడ హైప్ లేదు. రిలీజ్ ముంగిట కూడా పరిస్థితి మెరుగుపడలేదు.
తమిళంలో ఈ వారం సరైన సినిమాలు లేకున్నా సరే.. ‘ఆదిపురుష్’కు చెప్పుకోదగ్గ స్థాయిలో స్క్రీన్లు కేటాయించలేదు. అందుబాటులో ఉన్న షోలకు కూడా రెస్పాన్స్ ఆశించిన స్థాయిలో లేదు. ఓవైపు హిందీ, తెలుగు వెర్షన్లకు ఎటు చూసినా సోల్డ్ ఔట్ మెసేజ్లే కనిపిస్తుంటే.. తమిళ వెర్షన్ షోలన్నీ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి. 20 శాతం టికెట్లు కూడా అమ్ముడవని పరిస్థితి. తమిళుల్లో చాలామంది రాముడిని.. ‘రామాయణం’ను వ్యతిరేకిస్తుంటారు. ఇందులో కరుణానిధి లాంటి వాళ్ల పాత్ర చాలా ఉంది.
దీనికి తోడు ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాను తమిళేతర భాషల వాళ్లు పట్టించుకోలేదు. అలాంటపుడు తాము మాత్రం వేరే భాషల సినిమాలను ఎందుకు ఆదరించాలనుకున్నారో ఏమో తెలియదు. ‘బాహుబలి’ సినిమాను బ్లాక్ బస్టర్ చేసినందుకు తర్వాతి కాలంలో తమిళ జనాలు చాలా రిగ్రెట్ అవుతూ.. ఆ సినిమాను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం గమనార్హం. ‘ఆదిపురుష్’ను కూడా ఇదే మైండ్ సెట్తో నిరాదరిస్తున్నట్లు కనిపిస్తోంది.
This post was last modified on June 15, 2023 4:21 pm
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…