ఇప్పుడు ఇండియా అంతా ‘ఆదిపురుష్’ మేనియాతో ఊగిపోతోంది. ఒకప్పుడు సినిమా మీద అంతగా బజ్ లేదు కానీ.. రిలీజ్ ముంగిట మాత్రం హైప్ మామూలుగా లేదు. నార్త్ ఇండియాలో ‘ఆదిపురుష్’ హిందీ వెర్షన్కు సంబంధించి వారం ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా.. రెస్పాన్స్ అదిరిపోయింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ కొంచెం లేటుగా మొదలైనప్పటికీ.. అమ్మకాలు మామూలుగా లేవు.
బుక్ మై షో, పేటీఎం యాప్స్ స్ట్రక్ అయ్యే రేంజిలో జనాలు టికెట్ల కోసం ఎగబడ్డారు. ఇలా దేశవ్యాప్తంగా మెజారిటీ ప్రాంతాల్లో ‘ఆదిపురుష్’ కోసం జనం ఎగబడుతున్నారు. కానీ ఒక్క తమిళనాడులో మాత్రం దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. తమిళ ప్రేక్షకులు కానీ, ట్రేడ్ వర్గాలు కానీ ఈ సినిమాను పట్టించుకోవడం లేదు. ముందు నుంచే సినిమాకు అక్కడ హైప్ లేదు. రిలీజ్ ముంగిట కూడా పరిస్థితి మెరుగుపడలేదు.
తమిళంలో ఈ వారం సరైన సినిమాలు లేకున్నా సరే.. ‘ఆదిపురుష్’కు చెప్పుకోదగ్గ స్థాయిలో స్క్రీన్లు కేటాయించలేదు. అందుబాటులో ఉన్న షోలకు కూడా రెస్పాన్స్ ఆశించిన స్థాయిలో లేదు. ఓవైపు హిందీ, తెలుగు వెర్షన్లకు ఎటు చూసినా సోల్డ్ ఔట్ మెసేజ్లే కనిపిస్తుంటే.. తమిళ వెర్షన్ షోలన్నీ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి. 20 శాతం టికెట్లు కూడా అమ్ముడవని పరిస్థితి. తమిళుల్లో చాలామంది రాముడిని.. ‘రామాయణం’ను వ్యతిరేకిస్తుంటారు. ఇందులో కరుణానిధి లాంటి వాళ్ల పాత్ర చాలా ఉంది.
దీనికి తోడు ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాను తమిళేతర భాషల వాళ్లు పట్టించుకోలేదు. అలాంటపుడు తాము మాత్రం వేరే భాషల సినిమాలను ఎందుకు ఆదరించాలనుకున్నారో ఏమో తెలియదు. ‘బాహుబలి’ సినిమాను బ్లాక్ బస్టర్ చేసినందుకు తర్వాతి కాలంలో తమిళ జనాలు చాలా రిగ్రెట్ అవుతూ.. ఆ సినిమాను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం గమనార్హం. ‘ఆదిపురుష్’ను కూడా ఇదే మైండ్ సెట్తో నిరాదరిస్తున్నట్లు కనిపిస్తోంది.
This post was last modified on June 15, 2023 4:21 pm
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…