బాగా ఆలస్యమైనా సరే ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆదిపురుష్ టికెట్ రేట్ల పెంపుకి సంబందించిన అనుమతులు వచ్చేశాయి. పది రోజుల దాకా ప్రతి టికెట్ మీద 50 రూపాయలు అదనంగా పెంచుకోవచ్చని జిఓ జారీ చేశారు. అంటే జూన్ 25 వరకు ఇవి అమలులో ఉంటాయి. ఒకరకంగా తెలంగాణతో పోల్చుకుంటే ఇక్కడ ఎక్కువ నిడివి ఇవ్వడం ఒక్కటే ఊరట. డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిన వెంటనే ఆన్ లైన్ లో అమ్మకాలు మొదలుపెట్టేశారు. టికెట్లు సెకండ్లలో అమ్ముడుపోతున్నాయి. తొంభై శాతం ప్రభాస్ బొమ్మే ఉండగా మిగిలినవాటిలో ఫ్లాష్ వేస్తున్నారు
ఇదంతా బాగానే ఉంది కానీ బెనిఫిట్ షోల గురించి జిఓలో ప్రస్తావన లేదు. అంటే గరిష్టంగా అయిదు షోల కంటే ఎక్కువ వేసుకోవటానికి లేదు. దాదాపు అన్ని జిల్లా కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి బుకింగ్స్ చూపిస్తున్నాయి. ఒకవేళ ఉదయం 4 లేదా 5 గంటలకు వేయాలంటే అది ఆరో షో అవుతుంది. మరి చివరి నిమిషంలో ఏమైనా స్పెషల్ కన్సెషన్ ఇచ్చి ఓకే అంటారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. హైదరాబాద్ అభిమానులు త్వరగా చూస్తూ ట్విట్టర్ లో వాటి తాలూకు అప్డేట్లు వీడియోలను పెడుతుంటే ఏపీ ఫ్యాన్స్ తట్టుకోగలరా. ఇప్పుడదే అసలు సమస్య.
కౌంట్ డౌన్ గంటల్లోకి మారిపోవడంతో టికెట్ల కోసం డిమాండ్ అంతకంతా పెరిగిపోతోంది. చాలా చోట్ల యాజమాన్యాలు కొంత శాతాన్ని ముందస్తుగా తమ వాళ్ళ కోసం బ్లాక్ చేసినా వస్తున్న ఒత్తిడికి అవి ఎంత మాత్రం సరిపోవడం లేదు. ఖచ్చితంగా మొదటి రోజే చూడాలన్న ఆత్రం వల్ల వచ్చిన తిప్పలివి. ఆదివారం దాకా ఇదే పరిస్థితి కొనసాగేలా ఉంది. ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం కనీసం మూడు వారాల పాటు ఆదిపురుష్ సునామి ఖచ్చితంగా ఉంటుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఖాళీగా రోజులు వెళ్లదీస్తున్న థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు పడబోతున్నాయి
This post was last modified on June 14, 2023 10:23 pm
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…