బాగా ఆలస్యమైనా సరే ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆదిపురుష్ టికెట్ రేట్ల పెంపుకి సంబందించిన అనుమతులు వచ్చేశాయి. పది రోజుల దాకా ప్రతి టికెట్ మీద 50 రూపాయలు అదనంగా పెంచుకోవచ్చని జిఓ జారీ చేశారు. అంటే జూన్ 25 వరకు ఇవి అమలులో ఉంటాయి. ఒకరకంగా తెలంగాణతో పోల్చుకుంటే ఇక్కడ ఎక్కువ నిడివి ఇవ్వడం ఒక్కటే ఊరట. డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిన వెంటనే ఆన్ లైన్ లో అమ్మకాలు మొదలుపెట్టేశారు. టికెట్లు సెకండ్లలో అమ్ముడుపోతున్నాయి. తొంభై శాతం ప్రభాస్ బొమ్మే ఉండగా మిగిలినవాటిలో ఫ్లాష్ వేస్తున్నారు
ఇదంతా బాగానే ఉంది కానీ బెనిఫిట్ షోల గురించి జిఓలో ప్రస్తావన లేదు. అంటే గరిష్టంగా అయిదు షోల కంటే ఎక్కువ వేసుకోవటానికి లేదు. దాదాపు అన్ని జిల్లా కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి బుకింగ్స్ చూపిస్తున్నాయి. ఒకవేళ ఉదయం 4 లేదా 5 గంటలకు వేయాలంటే అది ఆరో షో అవుతుంది. మరి చివరి నిమిషంలో ఏమైనా స్పెషల్ కన్సెషన్ ఇచ్చి ఓకే అంటారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. హైదరాబాద్ అభిమానులు త్వరగా చూస్తూ ట్విట్టర్ లో వాటి తాలూకు అప్డేట్లు వీడియోలను పెడుతుంటే ఏపీ ఫ్యాన్స్ తట్టుకోగలరా. ఇప్పుడదే అసలు సమస్య.
కౌంట్ డౌన్ గంటల్లోకి మారిపోవడంతో టికెట్ల కోసం డిమాండ్ అంతకంతా పెరిగిపోతోంది. చాలా చోట్ల యాజమాన్యాలు కొంత శాతాన్ని ముందస్తుగా తమ వాళ్ళ కోసం బ్లాక్ చేసినా వస్తున్న ఒత్తిడికి అవి ఎంత మాత్రం సరిపోవడం లేదు. ఖచ్చితంగా మొదటి రోజే చూడాలన్న ఆత్రం వల్ల వచ్చిన తిప్పలివి. ఆదివారం దాకా ఇదే పరిస్థితి కొనసాగేలా ఉంది. ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం కనీసం మూడు వారాల పాటు ఆదిపురుష్ సునామి ఖచ్చితంగా ఉంటుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఖాళీగా రోజులు వెళ్లదీస్తున్న థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు పడబోతున్నాయి
This post was last modified on June 14, 2023 10:23 pm
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…