బాగా ఆలస్యమైనా సరే ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆదిపురుష్ టికెట్ రేట్ల పెంపుకి సంబందించిన అనుమతులు వచ్చేశాయి. పది రోజుల దాకా ప్రతి టికెట్ మీద 50 రూపాయలు అదనంగా పెంచుకోవచ్చని జిఓ జారీ చేశారు. అంటే జూన్ 25 వరకు ఇవి అమలులో ఉంటాయి. ఒకరకంగా తెలంగాణతో పోల్చుకుంటే ఇక్కడ ఎక్కువ నిడివి ఇవ్వడం ఒక్కటే ఊరట. డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిన వెంటనే ఆన్ లైన్ లో అమ్మకాలు మొదలుపెట్టేశారు. టికెట్లు సెకండ్లలో అమ్ముడుపోతున్నాయి. తొంభై శాతం ప్రభాస్ బొమ్మే ఉండగా మిగిలినవాటిలో ఫ్లాష్ వేస్తున్నారు
ఇదంతా బాగానే ఉంది కానీ బెనిఫిట్ షోల గురించి జిఓలో ప్రస్తావన లేదు. అంటే గరిష్టంగా అయిదు షోల కంటే ఎక్కువ వేసుకోవటానికి లేదు. దాదాపు అన్ని జిల్లా కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి బుకింగ్స్ చూపిస్తున్నాయి. ఒకవేళ ఉదయం 4 లేదా 5 గంటలకు వేయాలంటే అది ఆరో షో అవుతుంది. మరి చివరి నిమిషంలో ఏమైనా స్పెషల్ కన్సెషన్ ఇచ్చి ఓకే అంటారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. హైదరాబాద్ అభిమానులు త్వరగా చూస్తూ ట్విట్టర్ లో వాటి తాలూకు అప్డేట్లు వీడియోలను పెడుతుంటే ఏపీ ఫ్యాన్స్ తట్టుకోగలరా. ఇప్పుడదే అసలు సమస్య.
కౌంట్ డౌన్ గంటల్లోకి మారిపోవడంతో టికెట్ల కోసం డిమాండ్ అంతకంతా పెరిగిపోతోంది. చాలా చోట్ల యాజమాన్యాలు కొంత శాతాన్ని ముందస్తుగా తమ వాళ్ళ కోసం బ్లాక్ చేసినా వస్తున్న ఒత్తిడికి అవి ఎంత మాత్రం సరిపోవడం లేదు. ఖచ్చితంగా మొదటి రోజే చూడాలన్న ఆత్రం వల్ల వచ్చిన తిప్పలివి. ఆదివారం దాకా ఇదే పరిస్థితి కొనసాగేలా ఉంది. ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం కనీసం మూడు వారాల పాటు ఆదిపురుష్ సునామి ఖచ్చితంగా ఉంటుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఖాళీగా రోజులు వెళ్లదీస్తున్న థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు పడబోతున్నాయి
This post was last modified on June 14, 2023 10:23 pm
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…
ఇప్పటి జనరేషన్ కు పరిచయం లేదు కానీ నవీన్ వడ్డే హీరోగా ఒకప్పుడు మంచి మార్కెట్ ఎంజాయ్ చేశాడు. పెళ్లి,…
కెరీర్ ఆరంభం చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ చేసిన విజయ్ సేతుపతి.. ఇప్పుడు ఎంత పెద్ద రేంజికి ఎదిగిపోయాడో తెలిసిందే.…
భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.…