వరల్డ్ బెస్ట్ ఫిలిం మేకర్స్ లో టాప్ 3 లిస్టు తయారు చేస్తే అందులో ఖచ్చితంగా ఉండే పేరు జేమ్స్ క్యామరూన్. వయసు ఎంత మీద పడుతున్నా సరే అవతార్ ని అయిదు భాగాల్లో ప్రేక్షకులకు అందించడం కోసం ఆయన పడుతున్న తాపత్రయం ఎందరో దర్శకులకు స్ఫూర్తి పాఠం. ఒక పదేళ్ల కెరీర్ పూర్తవ్వగానే క్రియేటివిటీ అడుగంటిపోయి నాసిరకం కథలతో డిజాస్టర్లు ఇస్తున్న డైరెక్టర్లు ఆయన దగ్గర క్లాసులు తీసుకోవడం ఉత్తమం. అవతార్ ఇప్పటిదాకా రెండు భాగాలు వచ్చి వసూళ్లలో అగ్ర స్థానాల్లో నిలుచున్న సంగతి తెలిసిందే. టైటానిక్ కూడా ఈయన అద్భుత సృష్టే
బ్యాలన్స్ ఉన్న మూడు భాగాలూ వాస్తవానికి వచ్చే ఏడాది నుంచి రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ అవిప్పుడు వాయిదా పడ్డాయి. అవతార్ 3 డిసెంబర్ 2025, అవతార్ 4 అదే నెల 2029, అవతార్ 5 సేమ్ డేట్ 2031లో వస్తాయి. అంటే 2009 లో రిలీజైన ఫస్ట్ పార్ట్ నుంచి లెక్క బెట్టుకుంటే ఒకే కథను విస్తరిస్తూ జేమ్స్ క్యామరూన్ 22 సంవత్సరాలు ఖర్చు పెట్టేశారు. ఇతర దిగ్దర్శకులు ఎన్నో సీక్వెల్స్ వేరే సినిమాలకు తీశారు కానీ దేనికీ ఇంత క్రేజ్ రాలేదన్న మాట వాస్తవం. అవతార్ ఫైనల్ పార్ట్ వచ్చే నాటికి క్యామరూన్ వయసు 76 చేరుకుంటుంది.
అయినా సరే తగ్గేదేలే అంటున్నారు. ఆ మధ్య ఆర్ఆర్ఆర్ చూసి రాజమౌళిని ప్రత్యేకంగా ప్రశంసించిన క్యామరూన్ జక్కన్నకు హాలీవుడ్ వచ్చే ప్లాన్ ఉంటే కలిసి చేద్దామని కూడా హామీ ఇచ్చారు. నిజంగా ఇలాంటి క్రియేటివ్ జీనియస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పండోరా అనే ఊహకందని ప్రపంచాన్ని సృష్టించి ప్రేక్షక లోకం మొత్తం విభ్రాంతి చెందేలా విజువల్ ఎఫెక్ట్స్ ని చూపించిన తీరు గురించి పుస్తకాలు ఎన్ని రాసినా సరిపోయావు. టెర్మినేటర్ తోనే ఈ మాయాజాలాన్ని మొదలుపెట్టిన ఈ వెండితెర మాంత్రికుడు అవతార్ సిరీస్ తర్వాత రిటైర్ కాబోతున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పేశారు
This post was last modified on June 14, 2023 3:07 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…