భోళా శంకర్ తర్వాత చిరంజీవి చేయబోయే సినిమాల్లో ఒకటి బింబిసార దర్శకుడు వశిష్ట మల్లిడితో అన్న సంగతి చాలా రోజుల క్రితమే లీకయ్యింది. అఫీషియల్ గా ఆగస్ట్ 22 మెగాస్టార్ పుట్టినరోజున ప్రకటించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన లీక్స్ కొన్ని ఆసక్తికరంగా ఉన్నాయి. తన మొదటి సినిమా లాగే ఈసారి కూడా వశిష్ఠ ఫాంటసీ జానర్ నే ఎంచుకున్నారట. చిరు ఐకానిక్ మూవీ జగదేకవీరుడు అతిలోకసుందరి తరహాలో ఓ విజువల్ గ్రాండియర్ ని సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ముల్లోక వీరుడు టైటిల్ ని రిజిస్టర్ చేయించారని వినికిడి.
అసలు ట్విస్టు ఏంటంటే ఇందులో ఎనిమిది మంది హీరోయిన్లు కావాలట. ముల్లోకాల నుంచి వచ్చే అందాల భామలు హీరో కోసం సాగించే వేట కథలో కీలకమైన పాయింట్ గా ఉంటుందట. ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనేలా ఈ పాత్రలు ఉండకపోవడంతో ఇప్పుడు అంత మందిని సెట్ చేసుకోవడం పెద్ద సవాల్. అసలు సీనియర్ హీరోలకు ఒక్క జోడీని కుదర్చడమే పద్మవ్యూహంలా మారుతోంది. అలాంటిది ఒకేసారి ఇందరిని తీసుకురావడమంటే మాములు రిస్క్ కాదు. ప్రస్తుతం స్క్రిప్ట్ చివరి పనుల్లో ఉన్న వశిష్ట మరోవైపు క్యాస్టింగ్ సంబందించిన వ్యవహారాలు చూస్తున్నాడట
అసలే టాలీవుడ్ పరిశ్రమ హీరోయిన్ల కొరతతో కిందామీదా పడుతోంది. ఇప్పటితరం స్టార్లకే పెద్దగా ఆప్షన్లు ఉండటం లేదు. అలాంటిది ఏడు పదుల వయసుకు దగ్గరగా ఉన్న చిరు కోసం వెతికి పట్టుకోవడం భారీ టాస్క్. క్యాథరిన్ త్రెస్సా, రెజీనా, ఈషా రెబ్బ, మంజు వారియర్, అపర్ణబాలమురళి, సంయుక్త మీనన్, నిత్య మీనన్ లాంటివాళ్ళను సంప్రదించే ఆలోచనలో వశిష్ట ఉన్నట్టు తెలిసింది. పాతికేళ్ల క్రితం అశ్వినిదత్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో భూలోకవీరుడుని కొంత షూట్ చేసి ఆపేశారు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ముల్లోకవీరుడు కుదురుతోంది
This post was last modified on June 14, 2023 2:11 pm
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…