Movie News

పుష్ప-2లో ఆయన లేడు

ప్రస్తుతం ఇండియా అంతా ఆసక్తి ఎదురు చూస్తున్న చిత్రాల్లో ‘పుష్ప-2’ ఒకటి. ఫస్ట్ పార్ట్‌లో విలన్ పాత్ర చేసిన ఫాహద్ ఫాజిలే ఇందులోనూ మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఆయన కాకుండా జగపతిబాబు కొత్తగా సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. సునీల్, మిగతా నటీనటులు ఎలాగూ ఇందులోనూ కొనసాగుతారు. కాగా ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి కూడా నటిస్తున్నట్లుగా ఒక ప్రచారం నడుస్తోంది.

తాను ముఖ్య పాత్ర పోషించిన ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చి విలేకరులతో మాట్లాడిన మనోజ్.. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. తాను ఈ చిత్రంలో నటించట్లేదని మనోజ్ స్పష్టం చేశాడు. తెలుగులో ఏవైనా సినిమాలు చేస్తున్నారా.. ఎవరితో అయినా నటించాలని ఆశపడుతున్నారా అని అడిగితే.. తాను తెలుగులో అల్లు అర్జున్‌తో రెండు సినిమాలు (హ్యాపీ, వేదం), పవన్ కళ్యాణ్‌తో ఒక సినిమా (కొమరం పులి) చేశానని.. ఇక్కడి హీరోలందరూ మంచి నటులని.. వాళ్లెవ్వరితో నటించడానికి అయినా తాను సిద్ధమని మనోజ్ తెలిపాడు.

ఇక ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ చిత్రంలో తన బదులు ఏ తెలుగు నటుడు నటిస్తే బాగుంటుందనే ప్రశ్నకు మనోజ్ సమాధానం ఇస్తూ.. ‘‘సోలంకి పాత్రకు ఇక్కడ ఏ హీరో అయినా సూటవుతాడు. అందరూ మంచి ఆర్టిస్టులే. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ‘వకీల్ సాబ్’లో ఇలాంటి పాత్రే చేశాడు. అతను కాకుండా మహేష్ బాబు అయితే నా పాత్రకు బాగుంటుందని అనుకుంటున్నా. మహేష్ బాగా చేయగలడు. ఆ పాత్రకు కూడా సూటవుతాడు’’ అని చెప్పాడు.

ఇక ఓటీటీకి సెన్సార్ ఉండాలన్న ప్రతిపాదనను మనోజ్ తిరస్కరించాడు. అలా చేస్తే ఓటీటీ చచ్చిపోతుందని చెప్పాడు. ఇక్కడ ఎవరు ఏదైనా తీయగలిగే స్వేచ్ఛ ఉందని.. అదే సమయంలో ఇప్పుడు అందరూ స్వీయ నియంత్రణ పాటిస్తున్నారని.. ఇందులో ఏం చూడాలి అనే సెన్సార్ షిప్ జనాలే చేసుకోవాలని మనోజ్ అభిప్రాయపడ్డాడు.

This post was last modified on June 13, 2023 4:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తారక్ ఫ్యాన్స్‌కు ఆ రోజు నిద్ర ఉండదు

మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…

55 minutes ago

‘పోకిరి’లో ఆ ట్రాక్ పూరి తీసేద్దామనుకుంటే..

టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…

2 hours ago

ఇక రాంబాబు రానట్టే

సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్‌లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…

3 hours ago

వెంకీ మాట విన‌క‌పోవ‌డంతోనే ఆ ఫ్లాప్

తెలుగు సినీ చ‌రిత్ర‌లోనే అత్యంత హైప్ మ‌ధ్య విడుద‌లైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒక‌టి. 2001 సంక్రాంతికి మృగ‌రాజు, న‌ర‌సింహ‌నాయుడు లాంటి…

5 hours ago

మూకుమ్మడిగా మహేష్ సినిమాలను పిండుతున్నారు

రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…

7 hours ago

సోషల్ మీడియా వేరే ప్రపంచం కాదే

ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…

12 hours ago