Movie News

అభిమానుల స్పందనకు షాక్ తిన్న కియారా

తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా కియారా అద్వానీకి మంచి ఫాలోయింగే ఉంది. మహేష్ బాబుతో భరత్ అనే నేనుతో డెబ్యూనే సూపర్ హిట్ కొట్టి ఆ తర్వాత రామ్ చరణ్ తో వినయ విధేయ రామతో డిజాస్టర్ అందుకున్నాక పూర్తిగా బాలీవుడ్ కే అంకితమైపోయింది. ఆమె తాజా మూవీ సత్యప్రేమ్ కి కథ ఈ నెల 29న విడుదల కాబోతోంది. ట్రైలర్ వచ్చాక దీని మీద పాజిటివ్ హైప్ పెరిగింది. టూ ఝూటి మై మక్కర్, జర హట్కె జర బచ్కె లాంటి యావరేజ్ రామ్ కామ్స్ సైతం బాలీవుడ్ లో బాగా ఆడుతున్న టైంలో ఇది కనక సరిగ్గా మెప్పిస్తే భారీ వసూళ్లు వస్తాయని నిర్మాతలు ఆశిస్తున్నారు

దీని ప్రమోషన్లో భాగంగా ఇటీవలే కియారా అద్వానీ ఈ చిత్రం హీరో కార్తీక్ ఆర్యన్ తో కలిసి పెళ్లి సీన్ తాలూకు పిక్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన నిజ జీవిత భర్త సిద్దార్థ్ మల్హోత్రాతో జరిగిన వివాహ వేడుకలోని ఒక ఐకానిక్ మూమెంట్ ని మళ్ళీ రీ క్రియేట్ చేసింది. దీన్ని ఫ్యాన్స్ పాజిటివ్ గా తీసుకోలేకపోయారు. జీవితంలో అరుదుగా వచ్చే కొన్ని క్షణాలను మన కుటుంబ సభ్యులకు మాత్రమే పరిమితం చేయాలని, కేవలం మూవీ పబ్లిసిటీ కోసం ఇలా చేయడం వల్ల బయటి వాళ్ళు ఇటు కార్తీక్ అటు సిద్దార్థ్ ఇద్దరూ హీరోలే తప్ప లైఫ్ పార్ట్ నర్ ఎవరో అర్థం చేసుకోలేరని అంటున్నారు

ఇందులో లాజిక్ ఉంది. దెబ్బకు కియారా ఆ పిక్ ని తీసేసి సైలెంట్ అయిపోయింది. అభిమానులు అన్నదాంట్లో న్యాయం ఉంది. ఓ పదేళ్ల తర్వాత రెండు ఫోటోలు పక్కనపెట్టి కియారా భర్త ఎవరో గుర్తు పట్టమంటే ఠక్కున సమాధానం చెప్పడం కష్టం కావొచ్చు. రెండు స్టిల్స్ ఒకేలా ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ రావడం సహజం.  ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ లో నటిస్తున్న కియారా దర్శకుడు శంకర్ ఇండియన్ 2లో బిజీగా ఉండటం వల్ల బ్రేక్ తీసుకుని హిందీ షూటింగ్స్ కి డేట్స్ ఇచ్చేసింది. తెలుగు నుంచి ఎన్ని ఆఫర్లు వెళ్తున్నా అమ్మడు మాత్రం అంత సులభంగా ఒప్పుకోవడం లేదు

This post was last modified on June 13, 2023 12:09 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

ప‌ల్నాడులో ఆ 4 నియోజ‌క‌వ‌ర్గాలు హాట్ హాట్‌!

కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారుల వ‌ర‌కు కూడా.. అనేక జాగ్ర‌త్త‌లు తీసుకున్నా రు. అధికారుల‌ను మార్చేశారు.…

2 hours ago

కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓట‌ర్ల బారులు…. సంకేతం ఏంటి?

రాష్ట్రంలో కీల‌క నాయ‌కులు పోటీ చేస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో అనూహ్య‌మైన ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఉద‌యం 6 గంట‌ల నుంచే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోని…

2 hours ago

చంద్ర‌బాబు మాస్ వార్నింగ్‌… ఎవ‌రిని ఉద్దేశించి?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఉండ‌వ‌ల్లిలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన త‌ర్వాత‌.. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..…

2 hours ago

సినీ తారల సందడితో పోలింగ్ కళకళ

స్టార్లు సెలబ్రిటీలు తెరమీద, బయట కనిపించినప్పుడు వేరే సంగతి కానీ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కుని వినియోగించుకోవడం కోసం పోలింగ్…

2 hours ago

క‌డ‌ప‌లో రికార్డు స్థాయి పోలింగ్‌.. అక్క చెల్లెళ్ల ఎఫెక్టేనా?

ఏపీలో జ‌రుగుతున్న పార్ల‌మెంటు, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఒక‌టి రెండు జిల్లాలు మిన‌హా.. మిగిలిన జిల్లాల్లో పోలింగ్ ప్ర‌క్రియ ఆశాజ‌న‌కంగానే సాగుతోంది.…

2 hours ago

ప‌వ‌న్ ఫ‌స్ట్ టైమ్‌.. స‌తీస‌మేతంగా ఓటేశారు..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. అయితే.. గ‌తానికి భిన్నంగా ఆయ‌న ఈ సారి భార్య‌తో…

3 hours ago