తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా కియారా అద్వానీకి మంచి ఫాలోయింగే ఉంది. మహేష్ బాబుతో భరత్ అనే నేనుతో డెబ్యూనే సూపర్ హిట్ కొట్టి ఆ తర్వాత రామ్ చరణ్ తో వినయ విధేయ రామతో డిజాస్టర్ అందుకున్నాక పూర్తిగా బాలీవుడ్ కే అంకితమైపోయింది. ఆమె తాజా మూవీ సత్యప్రేమ్ కి కథ ఈ నెల 29న విడుదల కాబోతోంది. ట్రైలర్ వచ్చాక దీని మీద పాజిటివ్ హైప్ పెరిగింది. టూ ఝూటి మై మక్కర్, జర హట్కె జర బచ్కె లాంటి యావరేజ్ రామ్ కామ్స్ సైతం బాలీవుడ్ లో బాగా ఆడుతున్న టైంలో ఇది కనక సరిగ్గా మెప్పిస్తే భారీ వసూళ్లు వస్తాయని నిర్మాతలు ఆశిస్తున్నారు
దీని ప్రమోషన్లో భాగంగా ఇటీవలే కియారా అద్వానీ ఈ చిత్రం హీరో కార్తీక్ ఆర్యన్ తో కలిసి పెళ్లి సీన్ తాలూకు పిక్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన నిజ జీవిత భర్త సిద్దార్థ్ మల్హోత్రాతో జరిగిన వివాహ వేడుకలోని ఒక ఐకానిక్ మూమెంట్ ని మళ్ళీ రీ క్రియేట్ చేసింది. దీన్ని ఫ్యాన్స్ పాజిటివ్ గా తీసుకోలేకపోయారు. జీవితంలో అరుదుగా వచ్చే కొన్ని క్షణాలను మన కుటుంబ సభ్యులకు మాత్రమే పరిమితం చేయాలని, కేవలం మూవీ పబ్లిసిటీ కోసం ఇలా చేయడం వల్ల బయటి వాళ్ళు ఇటు కార్తీక్ అటు సిద్దార్థ్ ఇద్దరూ హీరోలే తప్ప లైఫ్ పార్ట్ నర్ ఎవరో అర్థం చేసుకోలేరని అంటున్నారు
ఇందులో లాజిక్ ఉంది. దెబ్బకు కియారా ఆ పిక్ ని తీసేసి సైలెంట్ అయిపోయింది. అభిమానులు అన్నదాంట్లో న్యాయం ఉంది. ఓ పదేళ్ల తర్వాత రెండు ఫోటోలు పక్కనపెట్టి కియారా భర్త ఎవరో గుర్తు పట్టమంటే ఠక్కున సమాధానం చెప్పడం కష్టం కావొచ్చు. రెండు స్టిల్స్ ఒకేలా ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ రావడం సహజం. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ లో నటిస్తున్న కియారా దర్శకుడు శంకర్ ఇండియన్ 2లో బిజీగా ఉండటం వల్ల బ్రేక్ తీసుకుని హిందీ షూటింగ్స్ కి డేట్స్ ఇచ్చేసింది. తెలుగు నుంచి ఎన్ని ఆఫర్లు వెళ్తున్నా అమ్మడు మాత్రం అంత సులభంగా ఒప్పుకోవడం లేదు
This post was last modified on June 13, 2023 12:09 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…