తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా కియారా అద్వానీకి మంచి ఫాలోయింగే ఉంది. మహేష్ బాబుతో భరత్ అనే నేనుతో డెబ్యూనే సూపర్ హిట్ కొట్టి ఆ తర్వాత రామ్ చరణ్ తో వినయ విధేయ రామతో డిజాస్టర్ అందుకున్నాక పూర్తిగా బాలీవుడ్ కే అంకితమైపోయింది. ఆమె తాజా మూవీ సత్యప్రేమ్ కి కథ ఈ నెల 29న విడుదల కాబోతోంది. ట్రైలర్ వచ్చాక దీని మీద పాజిటివ్ హైప్ పెరిగింది. టూ ఝూటి మై మక్కర్, జర హట్కె జర బచ్కె లాంటి యావరేజ్ రామ్ కామ్స్ సైతం బాలీవుడ్ లో బాగా ఆడుతున్న టైంలో ఇది కనక సరిగ్గా మెప్పిస్తే భారీ వసూళ్లు వస్తాయని నిర్మాతలు ఆశిస్తున్నారు
దీని ప్రమోషన్లో భాగంగా ఇటీవలే కియారా అద్వానీ ఈ చిత్రం హీరో కార్తీక్ ఆర్యన్ తో కలిసి పెళ్లి సీన్ తాలూకు పిక్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన నిజ జీవిత భర్త సిద్దార్థ్ మల్హోత్రాతో జరిగిన వివాహ వేడుకలోని ఒక ఐకానిక్ మూమెంట్ ని మళ్ళీ రీ క్రియేట్ చేసింది. దీన్ని ఫ్యాన్స్ పాజిటివ్ గా తీసుకోలేకపోయారు. జీవితంలో అరుదుగా వచ్చే కొన్ని క్షణాలను మన కుటుంబ సభ్యులకు మాత్రమే పరిమితం చేయాలని, కేవలం మూవీ పబ్లిసిటీ కోసం ఇలా చేయడం వల్ల బయటి వాళ్ళు ఇటు కార్తీక్ అటు సిద్దార్థ్ ఇద్దరూ హీరోలే తప్ప లైఫ్ పార్ట్ నర్ ఎవరో అర్థం చేసుకోలేరని అంటున్నారు
ఇందులో లాజిక్ ఉంది. దెబ్బకు కియారా ఆ పిక్ ని తీసేసి సైలెంట్ అయిపోయింది. అభిమానులు అన్నదాంట్లో న్యాయం ఉంది. ఓ పదేళ్ల తర్వాత రెండు ఫోటోలు పక్కనపెట్టి కియారా భర్త ఎవరో గుర్తు పట్టమంటే ఠక్కున సమాధానం చెప్పడం కష్టం కావొచ్చు. రెండు స్టిల్స్ ఒకేలా ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ రావడం సహజం. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ లో నటిస్తున్న కియారా దర్శకుడు శంకర్ ఇండియన్ 2లో బిజీగా ఉండటం వల్ల బ్రేక్ తీసుకుని హిందీ షూటింగ్స్ కి డేట్స్ ఇచ్చేసింది. తెలుగు నుంచి ఎన్ని ఆఫర్లు వెళ్తున్నా అమ్మడు మాత్రం అంత సులభంగా ఒప్పుకోవడం లేదు
This post was last modified on June 13, 2023 12:09 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…