దర్శక ధీరుడు రాజమౌళితో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు అభిమానులు. పుష్కరం కిందటే ఉంటుందనుకున్న ఈ చిత్రం.. చాలా ఆలస్యంగా రెండేళ్ల కిందటే ఖరారైంది. కానీ ఈ సినిమా పట్టాలెక్కడానికి సమయం పట్టింది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ తర్వాత కూడా కొన్ని నెలల పాటు ఆ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే పనిలో బిజీగా ఉండి మహేష్ సినిమా పని మొదలుపెట్టలేదు జక్కన్న. కొన్ని నెలల కిందటే ఈ సినిమా స్క్రిప్టు పనులతో పాటు ప్రి ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి.
ప్రస్తుతం రాజమౌళి పూర్తిగా ఆ ప్రాజెక్టు మీదే తన దృష్టిని కేంద్రీకరించాడు. ఐతే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లడానికి ఇంకా చాలా సమయమే పట్టేలా ఉంది. కానీ ఈ చిత్రానికి ముహూర్త వేడుకను మాత్రం త్వరలోనే నిర్వహించబోతున్నట్లు సమాచారం.
రాబోయే ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు ప్రారంభోత్సవం నిర్వహించాలని చూస్తున్నారట. ఆ రోజు లాంఛనంగా సినిమాకు ముహూర్త వేడుక నిర్వహించి.. స్క్రిప్టు పక్కాగా ఎప్పుడు రెడీ అవుతుంది, ప్రి ప్రొడక్షన్ పనులంతా ఎప్పటికి పూర్తవుతాయి అన్నదాన్ని బట్టి వచ్చే ఏడాది షూట్ మొదలుపెడతారని సమాచారం.
ఐతే తన సినిమాల ముహూర్త వేడుకలకు మహేష్ హాజరై చాలా ఏళ్లయింది. అది అతడికి సెంటిమెంటుగా మారింది. మహేష్ లేకుండానే ఈ వేడుకలు పూర్తి చేస్తుంటారు. త్రివిక్రమ్తో తన కొత్త సినిమా గుంటూరు కారం విషయంలోనూ ఇదే ఒరవడిని కొనసాగించాడు. కానీ రాజమౌళి సినిమా అంటే చాలా స్పెషల్ కాబట్టి దీని వేడుకకు మహేస్ వస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటారనడంలో సందేహం లేదు. మరోవైపు తన పుట్టిన రోజులకు వెకేషన్కు వెళ్లే అలవాటు కూడా మహేష్కు ఉంది. మరి సెంటిమెంట్ బ్రేక్ చేసి రాజమౌళి సినిమా వేడుకలో మహేష్ పాల్గొంటాడా అన్నది ఆసక్తికరం.
This post was last modified on June 12, 2023 11:57 pm
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…
ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ పార్టీ…మ్యాజిక్…
పొట్లూరి వరప్రసాద్.. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గట్టిగా వినిపించిన పేరు. రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ ‘బలుపు’తో ఆయన…
టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాఠశాలలు, దేవాలయాల సమీపంలో…
రాత్రి వేళ గస్తీ కాసేందుకు దేశం కాని దేశం వస్తున్న నేపాలీలు ఇప్పుడు నేరాల్లో ఆరితేరిపోయారని చెప్పాలి. గుర్ఖాలుగా ఎంట్రీ…
చట్టం గెలిచిందనుకున్న ప్రతీసారి పైరసీ కొత్త అవతారం ఎత్తుతోంది. ఐబొమ్మ ఆపరేటర్ రవి అరెస్ట్, సైట్ క్లోజ్ అని పోలీసులు…