టాలీవుడ్లో కామెడీ వేషాలతో మంచి పేరు సంపాదించాడు ప్రభాస్ శీను. కొన్ని సినిమాల్లో విలన్ వేషాలతో కూడా అతను మెప్పించాడు. ఇండస్ట్రీలో చాలామంది శీనులు ఉండటంతో.. ప్రభాస్కు ఆప్త మిత్రుడు కావడంతో ఆ పేరునే తన పేరు ముందు పెట్టుకుని అలాగే పాపులర్ అయ్యాడతను. ఈ కమెడియన్కి సీనియర్ నటి తులసితో ఉన్న అనుబంధం గురించి రకరకాల వార్తలు వచ్చాయి సోషల్ మీడియాలో.
వీళ్లిద్దరూ కలిసి ఇంటర్వ్యూలు ఇవ్వడం.. కలిసి కనిపించడంతో వీరి బంధం ఏంటో జనాలకు అర్థం కాలేదు. సోషల్ మీడియాలో, యూట్యూబ్లో వీళ్ల గురించి రకరకాలుగా మాట్లాడేశారు. ఇద్దరి మధ్య వయసు అంతరం చాలా ఉండటంతో వీళ్లు స్నేహితులు ఎలా అయ్యారో అన్న చర్చ కూడా నడిచింది. ఐతే తమ బంధం గురించి ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ శీను స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. తులసి తనకు తల్లితో సమానం అని అతను పేర్కొన్నాడు.
‘‘తులసి గారితో నేను ఎక్కువ సినిమాలు చేయలేదు. కానీ మా మీద మీడియా రకరకాలుగా వార్తలు రాసేసింది. ఆవిడ నాకు తల్లితో సమానం. ‘డార్లింగ్’ సినిమా సమయంలో ఆవిడతో పరిచయం జరిగింది. ఆ సమయంలో ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకున్నాం. తులసి గారు పెద్ద నటి. ఎన్నో చూసి ఈ స్థాయికి వచ్చారు. ఒకసారి ఏదో సరదాగా నన్ను డార్లింగ్ అని పిలిచిందని చాలా అపార్థం చేసుకున్నారు.
మాపై రూమర్లు వచ్చినపుడు ఆవిడే నాకు మెసేజ్ పెట్టారు. ‘‘ఇలా రాశారు. మీ ఆవిడకి చెప్పు. లేదంటే తను అపార్థం చేసుకుంటుంది’’ అని మెసేజ్ చేశారు. నా భార్య డాక్టర్. ఇలాంటి వార్తలను మేం నవ్వుకుని వదిలేస్తుంటాం. తులసి గారంటే నాకు ఎంతో గౌరవం. ఆమె ఎప్పుడూ పూజలు, పునస్కారాలకు సంబంధించిన మెసేజ్లే పెడుతుంటారు నాకు’’ అని ప్రభాస్ శీను క్లారిటీ ఇచ్చాడు.
This post was last modified on June 12, 2023 6:16 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…