ఇప్పుడు భారతీయ ప్రేక్షకులను అమితంగా ఆకర్షిస్తున్న చిత్రాల్లో యానిమల్ ఒకటి. అర్జున్ రెడ్డి, దాని హిందీ వెర్షన్ కబీర్ సింగ్ చిత్రాలతో బ్లాక్ బస్టర్లు కొట్టిన సందీప్ రెడ్డి వంగ రూపొందిస్తున్న చిత్రమిది. బాలీవుడ్ స్టార్లలో ఒకడైన రణబీర్ కపూర్ లీడ్ రోల్ చేస్తుండటం.. ఈ సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన ప్రతి ప్రోమో ఎంతో ఆకర్షణీయంగా ఉండటం సినిమా మీద అంచనాలను పెంచింది.
తాజాగా విడుదలైన యానిమల్ ప్రి టీజర్ కూడా సినిమాపై అంచనాలను పెంచింది. కొరియన్ కల్ట్ మూవీ ఓల్డ్ బాయ్లో ఒక యాక్షన్ ఎపిసోడ్ స్ఫూర్తితో తీసినట్లుగా కనిపించిన ఈ ప్రి టీజర్ యునీక్గా అనిపించింది. సినిమా చాలా వయొలెంట్గా ఉండబోతోందన్న సంకేతాలను ఈ వీడియో గ్లింప్స్ ఇచ్చింది. కాగా ఈ వీడియోలో తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న ఒక విషయం ఉంది.
యానిమల్ను అందరూ బేసిగ్గా హిందీ సినిమాగానే భావిస్తున్నారు. ఈ సినిమాలో హీరో బాలీవుడ్ స్టార్. చాలా వరకు ముఖ్య పాత్రలను బాలీవుడ్ వాళ్లే పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది కూడా బాలీవుడ్ నిర్మాణ సంస్థే. ఐతే సందీప్ మాత్రం తాను తెలుగువాడిని కావడం, తనకు బ్రేక్ ఇచ్చింది కూడా తెలుగు సినీ పరిశ్రమే కావడంతో ఈ సినిమా ప్రోమోల్లో తెలుగుకే ప్రయారిటీ ఇస్తున్నాడు.
పాన్ ఇండియా స్థాయిలో అయిదు భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుండగా.. ప్రోమోల్లో హిందీ కంటే ముందు తెలుగు పేరు ముందు ఉండేలా చూసుకుంటున్నాడు సందీప్. తద్వారా తన ప్రాధాన్యం ముందు తెలుగుకే అని చెప్పకనే చెబుతున్నాడు. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ మీదా సందీప్ ప్రత్యేక శ్రద్ధ పెడతాడనడంలో సందేహం లేదు. ఇదిలా ఉండగా యానిమల్ సినిమా వాయిదా పడొచ్చన్న ప్రచారానికి సందీప్ తెరదించాడు. ఆగస్టు 11నే సినిమా రిలీజవుతుందని ప్రి టీజర్లో ప్రకటించారు.
This post was last modified on June 11, 2023 11:39 pm
పశ్చిమ బెంగాల్లో సుదీర్ఘకాలం పాటు పాలన సాగించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం…
ఎయిర్పోర్టులంటే పెద్ద సిటీల్లోనే ఉండాలనే నియమాలేమీ లేవిప్పుడు. టైర్-2 సిటీలు, పట్టణాలకు కూడా విమానాశ్రయాలు విస్తరిస్తున్నాయి. ఐతే మరో తెలుగు…
‘పుష్ప’, ‘పుష్ప-2’ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. దీని తర్వాత అతను ఏ…
టాలీవుడ్ యువ నటుడు సుహాస్ నటించిన తమిళ చిత్రం మండాడి బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో గురువారం చెన్నైలో నిర్వహించిన…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. సుదీర్ఘ విరామం తర్వాత.. ఏపీకి చేరుకున్నారు. గత నెల…
మహిళలు యుక్త వయసుకు వచ్చిన దగ్గర్నుంచి వారిని పీరియడ్స్ ఎంతగా ఇబ్బంది పెడతాయో ఆ బాధను అనుభవించే వారికి మాత్రమే…