Movie News

అనుమతుల కోసం ఆదిపురుష్ ఎదురుచూపులు

తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఆదిపురుష్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుకాలేదు. ప్రభాస్ అభిమానులు , టాలీవుడ్ ప్రేమికులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్నారు. ఆదివారం నుంచి ఉంటాయని నిర్మాతలు ప్రకటించారు కానీ ఇంకా షురూ చేయలేదు. నార్త్ సైడ్ ముంబై, ఢిల్లీ, కోల్కతా లాంటి ప్రధాన నగరాల్లో ఆన్ లైన్ టికెట్లు అందుబాటులోకి వచ్చేశాయి. త్రీడి ప్రింట్ రెడీ కాలేదనే అనుమానాల నేపథ్యంలో  అనుమానాలకు  చెక్ పెడుతూ ఆ వెర్షన్ అమ్మకాలు కూడా స్టార్టయ్యాయి. కానీ ఏపీ తెలంగాణకు సంబంధించి థియేటర్లను లాక్ చేసుకున్నా ఇప్పటి దాకా పేటిఎం, బుక్ మై షోలో అప్డేట్స్ లేవు.

టికెట్ రేట్ల పెంపుకి సంబంధించి నిర్మాతలు చేసుకున్న విన్నపాలకు ఇంకా అనుమతులు రావాల్సి ఉంటుంది. తెలంగాణలో పర్మిషన్ లేకుండానే 295 రూపాయలు గరిష్ట ధరని మల్టీప్లెక్సులు పెట్టేసుకోవచ్చు. ఇంకా యాభై అదనంగా ఆశిస్తున్నట్టు ట్రేడ్ టాక్. అదే జరిగితే త్రీడి అద్దాలతో కలిపి రేట్ 380 రూపాయల దాకా చేరుతుంది. ఇక ఏపీలో గరిష్ట ధరనే 177 కాబట్టి అదనంగా ఇంకో యాభై ఓకే అయినా 230 దాటదు. ఇది కొంత నయమే. అంతకన్నా ఎక్కువ సాధ్యం కాకపోవచ్చు. ఇప్పుడు మరీ ఎక్కువ ఇచ్చేస్తే రాబోయే పెద్ద హీరోలందరికీ సరేనని అనాల్సి ఉంటుంది.

జీవోలు రావడం ఆలస్యం వెంటనే అమ్మకాలు ఊపందుకుంటాయి. బెనిఫిట్ షోలకు సంబంధించిన క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం వీలైనంత త్వరగా ఎక్కువ షోలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం మినహాయిస్తే ఇంకో నాలుగు రోజులు మాత్రమే ఉంటుంది కాబట్టి థియేటర్ యాజమాన్యాల మీద విపరీతమైన ఒత్తిడి మొదలవుతోంది. ప్రీమియం మల్టీప్లెక్సుల టికెట్ల కోసం అప్పుడే పెద్ద స్థాయిలో పైరవీలు మొదలయ్యాయట. పాజిటివ్ టాక్ వస్తే మాత్రం కలెక్షన్ల సునామి మాములుగా ఉండదని ట్రెండ్ ని బట్టి బయ్యర్లకు స్పష్టంగా అర్థమైపోయింది  

This post was last modified on June 12, 2023 10:47 am

Share
Show comments
Published by
Tharun

Recent Posts

పూజా హెగ్డే కోరుకున్న బ్రేక్ దొరికింది

మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…

45 mins ago

ఆమంచి .. ఎవరి ‘కొంప’ ముంచేనో ?!

ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…

1 hour ago

అమెరికాలో వెంటాడిన మృత్యువు

తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…

1 hour ago

కోర్టు మెట్లెక్కిన జూనియర్  !

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో  681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…

1 hour ago

ప్రభాస్ ఊరిస్తోంది దేని గురించంటే

ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…

2 hours ago

దిల్ రాజు చేతిలో 18 కమిట్మెంట్లు

ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…

3 hours ago