చైతుతో విడాకుల వ్యవహారం ముగిశాక కెరీర్ ని ఇంకా సీరియస్ గా ప్లాన్ చేసుకుంటున్న సమంతాకు ఇటీవలే శాకుంతలం ఇచ్చిన షాక్ మామూలుది కాదు. సాక్ష్యాత్తు నిర్మాత దిల్ రాజే తన పాతికేళ్ల కెరీర్ లో ఇంత పెద్ద డిజాస్టర్ లేదని ఇంటర్వ్యూ స్టేట్ మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సరే ఇలాంటివి అందరికీ సహజమే కాబట్టి ఆ ఫలితాన్ని సామ్ లైట్ తీసుకుని విదేశాలకు వెళ్లిపోయింది. తాజాగా సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ కోసం సైబీరియాలో ఉన్న సమంతా అక్కడ ఓ పబ్బులో హుషారుగా పుష్పలో ఊ అంటావా ఉహు అంటావా పాటకు డాన్సు చేస్తున్న వీడియో ట్విట్టర్, ఇన్స్ టాలో బాగా వైరల్ అయ్యింది
ఇక్కడే తన యాంటీ ఫ్యాన్స్ యాక్టివ్ అయిపోయారు. యశోద, శాకుంతలం ప్రమోషన్లలో పదే పదే జబ్బు గురించి ప్రస్తావించి సానుభూతి కార్డు ప్లే చేసిన సామ్ హఠాత్తుగా ఫారిన్ వెళ్ళగానే హుషారుగా చలాకీగా మారిపోవడం వెనుక రహస్యం ఏమిటో చెప్పాలని ట్రోల్స్ మొదలుపెట్టారు. తన సినిమాలను జనాలు థియేటర్లకు వచ్చి చూడాలనే ఉద్దేశంతో ప్రతిసారి సింపతీ కార్డు ప్లే చేయడం వర్కౌట్ కాదని ఈ సందర్భంగా చురకలు వేస్తున్నారు. నిజానికి సమంత రికవర్ అయ్యింది. కానీ శాకుంతలం టైంలో మాత్రం నీరసంగా, కళ్ళజోడు పెట్టుకుని చాలా ఇబ్బందిగా కనిపించింది
రోజుల వ్యవధిలోనే సిటాడెల్ చిత్రీకరణలో అలాంటి సమస్యేమీ లేకుండా ఫుల్ ఛార్జ్ అయిపోయింది. అయినా సామ్ ఎలాగూ సెప్టెంబర్ లో విడుదల కాబోయే విజయ్ దేవరకొండ ఖుషి ప్రమోషన్ల కోసం తిరిగి హైదరాబాద్ రావాల్సిందే. అప్పుడైనా ఖచ్చితంగా ఈ విషయానికి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతాయి. పైన చెప్పిన యాంటీ అభిమానులకు సమాధానాలు వస్తాయని సామ్ సపోర్టర్స్ మద్దతుగా నిలుస్తున్నారు. సిటాడెల్ హాలీవుడ్ వెర్షన్ ఫెయిలైన నేపథ్యంలో ఇండియన్ రీమేక్ ని రాజ్ అండ్ డికె ఎలా తీసుంటారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. చూడాలి మరి ఏం చేస్తుందో
This post was last modified on June 11, 2023 2:48 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…