ఇంకో ఆరే రోజుల్లో ఆదిపురుష్ విడుదల కాబోతోంది. ఈ రోజు నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టబోతున్నారు. రికార్డు స్థాయి ఓపెనింగ్స్ గురించి ఇప్పటికే విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. వంద కోట్లా లేక అంతకు మించి వస్తుందా అనేది ట్రేడ్ ఊహలకు అందటం లేదు. తెలుగు కంటే ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది. ముఖ్యంగా జై శ్రీరామ్ నినాదం మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లాంటి స్టేట్స్ ని జ్వరంలా పట్టేసుకుంది. మూడు గంటల నిడివి ఉన్న ఆదిపురుష్ కి మొదటిరోజు వీలైనన్ని ఎక్కువ షోలు వేసుకునేలా థియేటర్ల యాజమాన్యాలు ప్లాన్ చేసుకుంటున్నాయి
ఇలాంటి విజువల్ గ్రాండియర్ ని ఐమ్యాక్స్ తెరమీద చూస్తే దాని కిక్కు వేరుగా ఉంటుంది. కానీ టి సిరీస్ సంస్థ ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. కారణం ఆ స్క్రీన్లన్నీ హాలీవుడ్ మూవీ ఫ్లాష్ కోసం ఎప్పుడో బ్లాక్ చేశారట. ఐమాక్స్ నిబంధనల ప్రకారం ఒకే సమయంలో రెండు సినిమాలు ఆ ఫార్మాట్ లో వేయడానికి సాధ్యపడదు. నిజానికి ఆదిపురుష్ ముందు అనుకున్న తేదీ 2023 సంక్రాంతి. దానికి అనుగుణంగానే అప్పటి పోస్టర్లలో ఐమాక్స్ లోగోతో పాటు ప్రమోషన్లు చేశారు కానీ ఊహించని విధంగా పోస్ట్ పోన్ కావడంతో ఐమాక్స్ స్క్రీన్లు చేజారిపోయాయి
తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ కి పెద్దగా ఫరక్ పడదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఒక్క ఐమాక్స్ స్క్రీన్ లేదు. హైదరాబాద్ ప్రసాద్ లో ఉన్నది, సూళ్లూరుపేటలో యువి వాళ్ళు స్థాపించింది పెద్ద తెరలే కానీ వాటికి ఐమ్యాక్స్ ప్రొజెక్షన్ ఉండదు. బెంగళూరు, ముంబై, చెన్నై, కోచి లాంటి నగరాల్లో మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. అక్కడ ది ఫ్లాష్ స్క్రీనింగ్ ఉంటుంది. సరే అది పోతే పోయింది కానీ సినిమా కనక బాగుంటే హ్యాపీగా త్రీడిలో ఎంజాయ్ చేయడానికి బోలెడన్ని ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. 16న రఘురాముడి ఆగమనం కోసం అందరూ వెయిటింగ్ మరి
This post was last modified on June 11, 2023 12:51 pm
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…
ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…
ఏప్రిల్ 30 'పెద్ది' తప్పుకున్నాక అందరి దృష్టి ఆ స్లాట్ మీద పడింది. ఇది ముందే ఊహించిన 'గాయపడ్డ సింహం'…
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్.. తాను జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (వర్కింగ్ టైటిల్)…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. వాస్తవానికి ఇప్పటికే చాలా బిల్లులు పెండింగులో ఉండగా..…