టాలీవుడ్లో రాజమౌళిది ఎవ్వరూ అందుకోలేని సెపరేట్ లీగ్ అయితే.. ఆ తర్వాతి లీగ్లో త్రివిక్రమ్, సుకుమార్ లాంటి దర్శకులు ఉంటారు. ఇంతకుముందు ఈ లీగ్లో ఉన్న వి.వి.వినాయక్, పూరి జగన్నాథ్.. దారుణమైన ఫెయిల్యూర్లతో అందులోంచి తప్పుకోవాల్సి వచ్చింది. వీళ్లతో టాప్ హీరోలు ఇప్పుడు సినిమాలు చేసే పరిస్థితి లేదు. కొరటాల శివ చాలా తక్కువ సమయంలోనే ఈ లీగ్లో చోటు సంపాదించాడు. సురేందర్ రెడ్డి సైతం ఈ లీగ్లోనే ఉన్నాడు కానీ.. ‘ఏజెంట్’ మూవీతో అతను కూడా వైదొలిగే పరిస్థితి కనిపిస్తోంది.
ఇక అనిల్ రావిపూడి ఎప్పట్నుంచో ఈ టాప్ లీగ్లోకి రావాలని ప్రయత్నిస్తున్నాడు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకడవుతాడని అనిల్ మీద అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ఫుల్ సినిమాగా నిలబడ్డప్పటికీ.. ఒక అగ్ర కథానాయకుడిని సరిగా డీల్ చేయలేకపోయాడని.. అభిమానుల అంచనాలను అందుకోలేకపోయాడని అభిప్రాయాలు వినిపించాయి.
ఐతే నందమూరి బాలకృష్ణతో ఇప్పుడు అనిల్ చేస్తున్న ‘భగవంత్ కేసరి’ టీజర్ చూశాక అతను పైన చెప్పుకున్న టాప్ లీగ్ డైరెక్టర్లలో ఒకడైపోతాడన్న అంచనాలు కలుగుతున్నాయి. అనిల్ అంటే ఇప్పటికీ కామెడీ డైరెక్టర్ అనే ముద్రే ఉంది కానీ.. ‘భగవంత్ కేసరి’లో మాత్రం అతను అసలైన మాస్ చూపించాడు. టీజర్లో ఒక చోటు చూపించినట్లు ‘హైలీ ఇన్ఫ్లేమబుల్’ అన్న మాటకు తగ్గట్లే టీజర్ పేలింది.
బాలయ్యది ది బెస్ట్గా, ఊర మాస్గా చూపిస్తూనే.. అన్ని వర్గాల ప్రేక్షకుల్లోనూ సినిమా పట్ల ఆసక్తి రేకెత్తించగలిగాడు అనిల్. ఎలాంటి స్టార్ను అయినా అనిల్ డీల్ చేయగలడు అనిపించేలా ఈ టీజర్ ఉంది. బాలయ్య అభిమానులైతే టీజర్ చూశాక మామూలు ఉత్సాహంలో లేరు. అసలే అఖండ, వీరసింహారెడ్డి పెద్ద హిట్లవడంతో బాలయ్య ఊపు మామూలుగా లేదు. ఇలాంటి ఊపులో సరైన మాస్ మూవీ పడితే బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయం. కాబట్టి దసరాకు అనిల్ మాస్ విందు మరో స్థాయిలో ఉండబోతుందన్నమాటే.
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…