టాలీవుడ్లో రాజమౌళిది ఎవ్వరూ అందుకోలేని సెపరేట్ లీగ్ అయితే.. ఆ తర్వాతి లీగ్లో త్రివిక్రమ్, సుకుమార్ లాంటి దర్శకులు ఉంటారు. ఇంతకుముందు ఈ లీగ్లో ఉన్న వి.వి.వినాయక్, పూరి జగన్నాథ్.. దారుణమైన ఫెయిల్యూర్లతో అందులోంచి తప్పుకోవాల్సి వచ్చింది. వీళ్లతో టాప్ హీరోలు ఇప్పుడు సినిమాలు చేసే పరిస్థితి లేదు. కొరటాల శివ చాలా తక్కువ సమయంలోనే ఈ లీగ్లో చోటు సంపాదించాడు. సురేందర్ రెడ్డి సైతం ఈ లీగ్లోనే ఉన్నాడు కానీ.. ‘ఏజెంట్’ మూవీతో అతను కూడా వైదొలిగే పరిస్థితి కనిపిస్తోంది.
ఇక అనిల్ రావిపూడి ఎప్పట్నుంచో ఈ టాప్ లీగ్లోకి రావాలని ప్రయత్నిస్తున్నాడు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకడవుతాడని అనిల్ మీద అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ఫుల్ సినిమాగా నిలబడ్డప్పటికీ.. ఒక అగ్ర కథానాయకుడిని సరిగా డీల్ చేయలేకపోయాడని.. అభిమానుల అంచనాలను అందుకోలేకపోయాడని అభిప్రాయాలు వినిపించాయి.
ఐతే నందమూరి బాలకృష్ణతో ఇప్పుడు అనిల్ చేస్తున్న ‘భగవంత్ కేసరి’ టీజర్ చూశాక అతను పైన చెప్పుకున్న టాప్ లీగ్ డైరెక్టర్లలో ఒకడైపోతాడన్న అంచనాలు కలుగుతున్నాయి. అనిల్ అంటే ఇప్పటికీ కామెడీ డైరెక్టర్ అనే ముద్రే ఉంది కానీ.. ‘భగవంత్ కేసరి’లో మాత్రం అతను అసలైన మాస్ చూపించాడు. టీజర్లో ఒక చోటు చూపించినట్లు ‘హైలీ ఇన్ఫ్లేమబుల్’ అన్న మాటకు తగ్గట్లే టీజర్ పేలింది.
బాలయ్యది ది బెస్ట్గా, ఊర మాస్గా చూపిస్తూనే.. అన్ని వర్గాల ప్రేక్షకుల్లోనూ సినిమా పట్ల ఆసక్తి రేకెత్తించగలిగాడు అనిల్. ఎలాంటి స్టార్ను అయినా అనిల్ డీల్ చేయగలడు అనిపించేలా ఈ టీజర్ ఉంది. బాలయ్య అభిమానులైతే టీజర్ చూశాక మామూలు ఉత్సాహంలో లేరు. అసలే అఖండ, వీరసింహారెడ్డి పెద్ద హిట్లవడంతో బాలయ్య ఊపు మామూలుగా లేదు. ఇలాంటి ఊపులో సరైన మాస్ మూవీ పడితే బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయం. కాబట్టి దసరాకు అనిల్ మాస్ విందు మరో స్థాయిలో ఉండబోతుందన్నమాటే.
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…