జల్సా ఫ్లాష్ బ్యాక్ లో ప్రకాష్ రాజ్ సరదాగా అన్న మాటని నక్సలైట్ గా ఉన్న పవన్ కళ్యాణ్ సీరియస్ గా తీసుకుని ఆటపట్టించే సీన్ థియేటర్లో బాగా పేలింది. దీని మీద సోషల్ మీడియా మీమ్స్ ఇప్పటికీ తిరుగుతూ ఉంటాయి. ఈ ప్రస్తావన రావడానికి కారణం ఉంది. నిన్న రాత్రి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. కొణిదెల అల్లు కుటుంబాల నుంచి అందరూ హాజరయ్యారు. బయటవాళ్లకు ఇన్విటేషన్ లేదు. ఎలాగూ పెళ్లి తర్వాత రిసెప్షన్ లాంటి వేడుకలు ఉంటాయి కాబట్టి దీన్ని నాగబాబు ఇంటికి పరిమితం చేశారు.
కొంచెం ఫ్లాష్ బ్యాక్ కి వెళదాం. 2021లో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ మీద చావు కబురు చల్లగా సినిమా వచ్చింది. కార్తికేయ హీరో కాగా లావణ్య త్రిపాఠి హీరోయిన్. దాని ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సమర్పకుడి హోదాలో వచ్చిన అల్లు అరవింద్ ఆ అమ్మాయి గురించి మాట్లాడుతూ ఎక్కడో ఉత్తరాది రాష్ట్రం నుంచి వచ్చింది ఇక్కడే ఓ తెలుగు కుర్రాడిని పెళ్లి చేసుకుని హైదరాబాద్ లో సెటిలైపోవచ్చు కదాని సరదాగా నవ్వుతూ అన్నారు. దానికి లావణ్య రియాక్షనూ ఫన్నీగానే ఉంది. కట్ చేస్తే మూడేళ్లు తిరక్కుండానే ఎవరో ఎందుకని మెగా ప్రిన్స్ కి భార్యగా కొణిదెల ఫామిలీలోకి ఎంట్రీ ఇచ్చింది
ఆ వీడియోని ఫ్యాన్స్ ఇప్పుడు బయటికి తీసి జల్సాతో ముడిపెడుతున్నారు. కొన్ని ఏదో యథాలాపంగా అన్నా సరే ఇలా కనెక్ట్ అయిపోతూ ఉంటాయి. మిస్టర్ తో మొదలైన ఈ జంట పరిచయం అంతరిక్షంలోనూ కొనసాగింది. ఆ సినిమాలు ఫ్లాప్ అయినా రియల్ లవ్ మాత్రం సూపర్ హిట్ అయ్యింది. పైన చెప్పిన చావు కబురు చల్లగా కూడా పోయింది. వివాహం తాలూకు వేదిక తేదీ ఇతర వివరాలు త్వరలో వెల్లడించబోతున్నారు. వేడుకకు సంబంధించిన ఫోటోలు ట్విట్టర్ ఇన్స్ టాలో తిరగేస్తున్నాయి. అల్లు వారి కామెడీ మాట ఫైనల్ గా ఇలా నిజమయ్యిందన్న మాట
This post was last modified on June 10, 2023 1:20 pm
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…
ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు పెద్ద వివాదానికి…