పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్లలో బిజీయెస్ట్ హీరో. ఆయన నటిస్తున్న నాలుగు సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయిప్పుడు. కెరీర్లో ఎన్నడూ పవన్ ఇలా ఒకేసారి నాలుగు సినిమాల షూటింగ్ల్లో పాల్గొనడం ఎవ్వరూ చూడలేదు. అది కూడా రాజకీయాల్లోనూ బిజీగా మారిన సమయంలో సినిమాల కోసం ఇంత కష్టపడటం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఆల్రెడీ ‘బ్రో’ సినిమాకు సంబంధించి తన వర్క్ మొత్తం ఎప్పుడో పూర్తి చేశాడు పవర్ స్టార్.
ఆ సినిమా వచ్చే నెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీని తర్వాత రిలీజయ్యే పవన్ సినిమా ఏదనే విషయంలో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఎప్పట్నుంచో చిత్రీకరణ వాయిదా పడుతూ వస్తున్న ‘హరిహర వీరమల్లు’ను పవన్ ఇప్పట్లో పూర్తి చేస్తాడనే సంకేతాలు ఏమీ కనిపించడం లేదు. అసలు ఆ సినిమా షూట్ స్టేటస్ ఏంటనే విషయంలో కూడా ఎవరికీ క్లారిటీ లేదు. ఈ ఏడాదైతే ‘హరిహర వీరమల్లు’ రిలీజయ్యే సంకేతాలు ప్రస్తుతానికి కనిపించడం లేదు.
ఇక లేటుగా మొదలైనప్పటికీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘ఓజీ’ షూటింగ్ పరంగా ఒకదాంతో ఒకటి పోటీ పడుతున్నాయి. ఐతే మొదట్లో ‘ఉస్తాద్..’ టీమే ఊపులో కనిపించింది. చకచకా రెండు షెడ్యూళ్లు పూర్తి చేసి టీజర్ కూడా రిలీజ్ చేయగలిగింది. కానీ ఆ తర్వాత పవన్ ‘ఓజీ’కే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం మొదలుపెట్టాడు. చకచకా ఈ చిత్రం ఇప్పటికే మూడు షెడ్యూళ్లు పూర్తి చేసుకుంది.
తర్వాతి డేట్లు ‘ఉస్తాద్..’కే అని అందరూ అనుకుంటుంటే.. పవన్ మళ్లీ ట్విస్ట్ ఇచ్చాడు. ‘ఓజీ’కి కొత్తగా మళ్లీ డేట్లు కేటాయించాడు. ఒకవైపు ఒక భారీ సెట్ రెడీ చేసుకుంటూ పవన్ కోసం వెయిటింగ్లో ఉన్న ‘ఉస్తాద్..’ టీంకు నిరాశ తప్పలేదు. ‘ఓజీ’కి పవన్ ఇస్తున్న ప్రయారిటీ చూస్తుంటే.. ‘బ్రో’ తర్వాత అదే రిలీజవుతుందేమో.. ఈ ఏడాదే ఆ సినిమా కూడా ప్రేక్షకులను పలకరిస్తుందేమో అనిపిస్తోంది.
This post was last modified on June 9, 2023 2:19 pm
సినీ రంగంలో ఎప్పుడు ఎవరి రాత మారుతుందో తెలియదు. నటులుగా చిన్న చిన్న పాత్రలు చేసిన వాళ్లు.. రైటర్లుగా, అసిస్టెంట్…
పదేళ్ల ముందు ‘దంగల్’ మూవీతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్. ఇప్పటికీ ఇండియాస్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా పెద్ద సినిమాకు ముందస్తు బిజినెస్ జరగడం చాలా కష్టమైపోయింది. ముఖ్యంగా ఒక్క టీజర్ తోనే మొత్తం…
టాలీవుడ్ టాప్ హీరోల్లో అత్యధిక డిమాండ్ ఉన్నది ఎవరికయ్యా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. తెలుగులోనే కాదు హిందీలోనూ…
ఇరాన్ యుద్ధ పరిణామాలు టీవీలో, సోషల్ మీడియాలో చూస్తూ తెలుసుకుంటున్న మన దేశ జనాలకు మెల్లగా దాని ప్రభావం నేరుగా…
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కేసును రెండేళ్ల నుంచి కార్తీక దీపం సీరియల్ మాదిరి లాగుతున్నారని బీఆర్ఎస్ నేతలు…