ఇంకో వారం రోజుల్లోనే భారీ అంచనాల మధ్య బాక్సాఫీస్ బరిలో దిగబోతోంది ‘ఆదిపురుష్’ సినిమా. రిలీజ్ దగ్గర పడే కొద్దీ ఈ సినిమాకు హైప్ పెరుగుతోంది. మొన్నటి ప్రి రిలీజ్ ఈవెంట్, కొత్త ట్రైలర్ సినిమా పట్ల పాజిటివిటీని ఇంకా పెంచాయి. బేసిగ్గా ప్రభాస్ అంటేనే నో నాన్సెన్స్, అందరికీ డార్లింగ్ అనే పేరుంది. వేరే స్టార్ హీరోల్లాగా అతడి పట్ల నెగెటివిటీ కనిపించదు.
సోషల్ మీడియాలో అతణ్ని టార్గెట్ చేసేవాళ్లు తక్కువ. వేరే హీరోలు కూడా అతడితో చాలా సన్నిహితంగా ఉంటారు. ఆయా హీరోల అభిమానులు కూడా పట్ల తనపై సానుకూల భావనతో ఉంటారు. ‘ఆదిపురుష్’ విషయంలో ఈ పాజిటివిటీని ఇంకా పెంచే ప్రయత్నం జరుగుతోంది. ప్రభాస్ కోసం కొందరు హీరోలు ‘ఆదిపురుష్’ టికెట్లను పెద్ద ఎత్తున కొని పేద పిల్లలకు పంచే ప్రయత్నంలో ఉండటం విశేషం.
ఇప్పటికే ‘ఆదిపురుష్’ తెలుగు వెర్షన్ రిలీజ్లో భాగస్వామి అయిన నిర్మాత అభిషేక్ అగర్వాల్.. పది వేలకు పైగా ‘ఆదిపురుష్’ టికెట్లను స్కూల్ పిల్లలకు పంచడానికి సిద్ధమయ్యాడు. కాగా ఇప్పుడు బాలీవుడ్ నుంచి రణబీర్ కపూర్, టాలీవుడ్ నుంచి రామ్ చరణ్.. ప్రభాస్ కోసం రంగంలోకి దిగుతుండటం విశేషం.
వీళ్లిద్దరూ పది వేల చొప్పున ‘ఆదిపురుష్’ టికెట్లు కొనబోతున్నారట. ఇరువురూ పేద, అనాథ పిల్లలకు ఆ టికెట్లను పంచబోతున్నారు. ఈ బాటలో మరి కొందరు హీరోలు నడిచినా ఆశ్చర్యం లేదు. దీని వల్ల ఆయా హీరోల అభిమానులు ‘ఆదిపురుష్’ను ఓన్ చేసుకుంటారు. మరోవైపు పిల్లలు అందరూ తప్పక చూడాల్సిన సినిమా అనే భావనా పెరుగుతుంది. ఇది చాలా మంచి ప్రమోషనల్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. ఈ కోణంలో చూస్తే ప్రభాస్కు ఈ హీరోలు చేస్తున్న సాయం చాలా పెద్దదే.
మొన్నటిదాకా తమిళ సినీ పరిశ్రమలోనే కాక దేశంలోని ఇతర భాషాల్లోనూ ఓ స్టార్ హీరోగా ఎదిగిన జోసెఫ్ విజయ్… ఉన్నట్టుండి…
ఏపీలో విగ్రహాల ధ్వంసం వ్యవహారం విపక్ష వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పాలి. నంద్యాలలో ఆదివారం ఉదయం వైఎస్ విగ్రహం ధ్వంసం ఘటనలో…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ తగిలింది. తెలంగాణలో జనసేన బలోపేతం దిశగా…
తెలుగు మూవీ లవర్స్ చిరకాల వాంఛ ఐమాక్స్ గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ…
దక్షిణాదిన క్యారెక్టర్, విలన్ పాత్రలకు మాంచి డిమాండ్ ఉన్న నటుల్లో విజయ్ సేతుపతి ఒకడు. సుకుమార్ అంతటి పెద్ద దర్శకుడు…
అదేంటి పెద్ది వస్తుంటే ఇంకెవరు పోటీకి దిగుతారనే డౌట్ వస్తోందా. టాలీవుడ్ ప్రొడ్యూసర్లు అంత సాహసం చేయరు కానీ ఇతర…