ఇంకో వారం రోజుల్లోనే భారీ అంచనాల మధ్య బాక్సాఫీస్ బరిలో దిగబోతోంది ‘ఆదిపురుష్’ సినిమా. రిలీజ్ దగ్గర పడే కొద్దీ ఈ సినిమాకు హైప్ పెరుగుతోంది. మొన్నటి ప్రి రిలీజ్ ఈవెంట్, కొత్త ట్రైలర్ సినిమా పట్ల పాజిటివిటీని ఇంకా పెంచాయి. బేసిగ్గా ప్రభాస్ అంటేనే నో నాన్సెన్స్, అందరికీ డార్లింగ్ అనే పేరుంది. వేరే స్టార్ హీరోల్లాగా అతడి పట్ల నెగెటివిటీ కనిపించదు.
సోషల్ మీడియాలో అతణ్ని టార్గెట్ చేసేవాళ్లు తక్కువ. వేరే హీరోలు కూడా అతడితో చాలా సన్నిహితంగా ఉంటారు. ఆయా హీరోల అభిమానులు కూడా పట్ల తనపై సానుకూల భావనతో ఉంటారు. ‘ఆదిపురుష్’ విషయంలో ఈ పాజిటివిటీని ఇంకా పెంచే ప్రయత్నం జరుగుతోంది. ప్రభాస్ కోసం కొందరు హీరోలు ‘ఆదిపురుష్’ టికెట్లను పెద్ద ఎత్తున కొని పేద పిల్లలకు పంచే ప్రయత్నంలో ఉండటం విశేషం.
ఇప్పటికే ‘ఆదిపురుష్’ తెలుగు వెర్షన్ రిలీజ్లో భాగస్వామి అయిన నిర్మాత అభిషేక్ అగర్వాల్.. పది వేలకు పైగా ‘ఆదిపురుష్’ టికెట్లను స్కూల్ పిల్లలకు పంచడానికి సిద్ధమయ్యాడు. కాగా ఇప్పుడు బాలీవుడ్ నుంచి రణబీర్ కపూర్, టాలీవుడ్ నుంచి రామ్ చరణ్.. ప్రభాస్ కోసం రంగంలోకి దిగుతుండటం విశేషం.
వీళ్లిద్దరూ పది వేల చొప్పున ‘ఆదిపురుష్’ టికెట్లు కొనబోతున్నారట. ఇరువురూ పేద, అనాథ పిల్లలకు ఆ టికెట్లను పంచబోతున్నారు. ఈ బాటలో మరి కొందరు హీరోలు నడిచినా ఆశ్చర్యం లేదు. దీని వల్ల ఆయా హీరోల అభిమానులు ‘ఆదిపురుష్’ను ఓన్ చేసుకుంటారు. మరోవైపు పిల్లలు అందరూ తప్పక చూడాల్సిన సినిమా అనే భావనా పెరుగుతుంది. ఇది చాలా మంచి ప్రమోషనల్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. ఈ కోణంలో చూస్తే ప్రభాస్కు ఈ హీరోలు చేస్తున్న సాయం చాలా పెద్దదే.
This post was last modified on June 9, 2023 5:03 pm
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…