ఇంకో వారం రోజుల్లోనే భారీ అంచనాల మధ్య బాక్సాఫీస్ బరిలో దిగబోతోంది ‘ఆదిపురుష్’ సినిమా. రిలీజ్ దగ్గర పడే కొద్దీ ఈ సినిమాకు హైప్ పెరుగుతోంది. మొన్నటి ప్రి రిలీజ్ ఈవెంట్, కొత్త ట్రైలర్ సినిమా పట్ల పాజిటివిటీని ఇంకా పెంచాయి. బేసిగ్గా ప్రభాస్ అంటేనే నో నాన్సెన్స్, అందరికీ డార్లింగ్ అనే పేరుంది. వేరే స్టార్ హీరోల్లాగా అతడి పట్ల నెగెటివిటీ కనిపించదు.
సోషల్ మీడియాలో అతణ్ని టార్గెట్ చేసేవాళ్లు తక్కువ. వేరే హీరోలు కూడా అతడితో చాలా సన్నిహితంగా ఉంటారు. ఆయా హీరోల అభిమానులు కూడా పట్ల తనపై సానుకూల భావనతో ఉంటారు. ‘ఆదిపురుష్’ విషయంలో ఈ పాజిటివిటీని ఇంకా పెంచే ప్రయత్నం జరుగుతోంది. ప్రభాస్ కోసం కొందరు హీరోలు ‘ఆదిపురుష్’ టికెట్లను పెద్ద ఎత్తున కొని పేద పిల్లలకు పంచే ప్రయత్నంలో ఉండటం విశేషం.
ఇప్పటికే ‘ఆదిపురుష్’ తెలుగు వెర్షన్ రిలీజ్లో భాగస్వామి అయిన నిర్మాత అభిషేక్ అగర్వాల్.. పది వేలకు పైగా ‘ఆదిపురుష్’ టికెట్లను స్కూల్ పిల్లలకు పంచడానికి సిద్ధమయ్యాడు. కాగా ఇప్పుడు బాలీవుడ్ నుంచి రణబీర్ కపూర్, టాలీవుడ్ నుంచి రామ్ చరణ్.. ప్రభాస్ కోసం రంగంలోకి దిగుతుండటం విశేషం.
వీళ్లిద్దరూ పది వేల చొప్పున ‘ఆదిపురుష్’ టికెట్లు కొనబోతున్నారట. ఇరువురూ పేద, అనాథ పిల్లలకు ఆ టికెట్లను పంచబోతున్నారు. ఈ బాటలో మరి కొందరు హీరోలు నడిచినా ఆశ్చర్యం లేదు. దీని వల్ల ఆయా హీరోల అభిమానులు ‘ఆదిపురుష్’ను ఓన్ చేసుకుంటారు. మరోవైపు పిల్లలు అందరూ తప్పక చూడాల్సిన సినిమా అనే భావనా పెరుగుతుంది. ఇది చాలా మంచి ప్రమోషనల్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. ఈ కోణంలో చూస్తే ప్రభాస్కు ఈ హీరోలు చేస్తున్న సాయం చాలా పెద్దదే.
This post was last modified on June 9, 2023 5:03 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…