‘బాహుబలి’తో ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఎన్ని రెట్లు పెరిగిందో తెలిసిందే. ‘బాహుబలి’ మెగా సక్సెస్లో రాజమౌళిదే మేజర్ క్రెడిట్ అయినప్పటికీ.. ప్రభాస్ పాత్రను తక్కువ చేయలేం. ఒక చిన్న సినిమా తీసిన దర్శకుడు తీసిన ‘సాహో’ మైండ్ బ్లోయింగ్ ఓపెనింగ్స్ రాబట్టిందంటే అది ప్రభాస్ క్రేజ్ వల్లే. కాకపోతే సినిమా అంచనాలను అందుకోలేకపోవడంతో అంతిమంగా బాక్సాఫీస్ ఫెయిల్యూర్గా మిగిలింది.
కానీ ‘సాహో’కు వచ్చిన హైప్, ఓపెనింగ్స్ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉంటారు సినీ ప్రియులు. ‘బాహుబలి’ తర్వాత ఈ సినిమాతోనూ తొలి రోజే వంద కోట్ల మైలురాయిని అందుకున్నాడు ప్రభాస్. ఐతే ‘రాధేశ్యామ్’కు ఈ మ్యాజిక్ రిపీట్ కాలేదు. దానికి ఆశించినంత హైప్ రాలేదు. పైగా నెగెటివిటీనే కనిపించింది. దీంతో ‘సాహో’ వసూళ్లలో తొలి రోజు సగం కూడా రాబట్టలేకపోయింది ‘రాధేశ్యామ్’.
కానీ ప్రభాస్ కొత్త సినిమా ‘ఆదిపురుష్’కు వచ్చేసరికి లెక్కలు మారిపోతున్నాయి. ముందు ఈ సినిమాపై నెగెటివిటీ ఉన్నప్పటికీ.. రిలీజ్ దగ్గరికి వచ్చేసరికి అంతా సానుకూలతే కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ సినిమా కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వేసవిలో ఏ భాషలోనూ భారీ సినిమాల సందడి లేకపోవడం, బాక్సాఫీస్ డల్ అయిపోవడం ‘ఆదిపురుష్’కు కలిసొస్తోంది.
దీంతో సినిమాకు ఓపెనింగ్స్ ఒక రేంజిలో ఉంటాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. భాషా భేదం లేకుండా దేశమంతా ‘ఆదిపురుష్’ ప్రభంజనం సృష్టించేలా ఉంది. కాబట్టి ప్రభాస్ మళ్లీ డే-1 వంద కోట్ల వసూళ్లు మైలురాయిని అందుకోవడం గ్యారెంటీ అని ట్రేడ్ పండిట్లు అంటున్నారు. అదే జరిగితే ప్రభాస్ ఇండియన్ బాక్సాఫీస్లో తిరుగులేని సూపర్ స్టార్గా మారుతాడనడంలో సందేహం లేదు. ఈ చిత్రం జూన్ 16న, శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on June 9, 2023 11:29 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…