ఇప్పుడు పెద్ద హీరోల పుట్టిన రోజులు వచ్చాయంటే సోషల్ మీడియాలో హంగామా అంతా ఇంతా కాదు. మామూలుగానే సోషల్ మీడియా హడావుడి బాగా ఎక్కువైపోగా.. కరోనా కారణంగా బయట యాక్టివిటీస్ అన్నీ ఆగిపోవడంతో అక్కడ సందడి ఇంకా పెరిగిపోతోంది. తమ హీరోల బర్త్ డేలకు కొన్ని రోజుల ముందే కౌంట్ డౌన్ పెట్టి అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు.
హీరోల పీఆర్ టీమ్స్ కూడా సోషల్ మీడియా ట్రెండ్స్ మీద ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నాయి. పుట్టిన రోజుకు కొన్ని రోజుల ముందే కామన్ డిస్ ప్లే పిక్ డిజైన్ చేసి అఫీషియల్గా సెలబ్రెటీలతో రిలీజ్ చేయించడం.. అభిమానులు ఆ పిక్కే పుట్టిన రోజు వరకు డీపీగా పెట్టుకోవడం మామూలే.
ఐతే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజుకు ఇంతకుమించి ఏదైనా చేయాలని ఆయన పీఆర్ టీం ఫిక్సయింది. ఇందుకోసం ఓ కొత్త ట్రెండ్కు శ్రీకారం చుడుతోంది. ఇప్పటిదాకా కామన్ డిస్ ప్లే పిక్స్ రిలీజ్ చేయడం చూశాం. కానీ చిరు పుట్టిన రోజును పురస్కరించుకుని కామన్ మోషన్ పోస్టర్ లాంచ్ చేయబోతున్నారు.
చిరు పుట్టిన రోజుకు వారం ముందు.. అంటే ఆగస్టు 15న ఇది రిలీజవుతుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా వివిధ సినీ పరిశ్రమల్లోని 65 మంది ఫిలిం సెలబ్రెటీలను లైన్లో పెడుతున్నారు. వారితో ఒకేసారి ఈ కామన్ మోషన్ పోస్టర్ లాంచ్ చేయిస్తారు. ఆ తర్వాత వారం రోజుల కౌంట్ డౌన్లో మరిన్ని సోషల్ మీడియా ట్రెండ్స్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ఈసారి మెగాస్టార్ పుట్టిన రోజుకు సోషల్ మీడియాలో సందడి ఓ రేంజిలో ఉండేలా ఉంది.
This post was last modified on August 10, 2020 6:41 am
ఎటు చూసినా వైసీపీకి ఛాన్స్ కనిపించడం లేదా? ఏ వర్గం కూడా వైసీపీకి ఆశించిన మేరకు చేరువ అయ్యే అవకాశం…
గత రెండు వారాలుగా ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసేస్తోంది ‘దురంధర్-2’ సినిమా. దేశ విదేశాల్లో ఈ సినిమా ప్రభంజనం మామూలుగా…
గతంలో నెల మారుతున్నా.. ఏడాది మారుతున్నా నిబంధనల్లో మార్పులు పెద్దగా ఉండేవి కావు. ఇటీవల కాలంలో ఆ తీరులో పెను…
ఆపన్న హస్తం అందించడంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తనదైన శైలి స్పీదును చూపిస్తున్నారు. ఆపదలో ఉన్న వారికి ఏదో హామీ…
జనవరి సంక్రాంతి పండక్కు రావాల్సిన జన నాయకుడు వాయిదా పడి మూడు నెలలు గడిచిపోయాయి. ఒక స్టార్ హీరో సినిమా…
ఈ వార్త నిజంగానే షాకింగనే చెప్పాలి. రేపు అంటే బుధవారం నుంచి తెలంగాణవ్యాప్తంగా చికెన్ ముక్క దొరకదట. మరి ముక్క లేనిదే…