ఇప్పుడు పెద్ద హీరోల పుట్టిన రోజులు వచ్చాయంటే సోషల్ మీడియాలో హంగామా అంతా ఇంతా కాదు. మామూలుగానే సోషల్ మీడియా హడావుడి బాగా ఎక్కువైపోగా.. కరోనా కారణంగా బయట యాక్టివిటీస్ అన్నీ ఆగిపోవడంతో అక్కడ సందడి ఇంకా పెరిగిపోతోంది. తమ హీరోల బర్త్ డేలకు కొన్ని రోజుల ముందే కౌంట్ డౌన్ పెట్టి అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు.
హీరోల పీఆర్ టీమ్స్ కూడా సోషల్ మీడియా ట్రెండ్స్ మీద ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నాయి. పుట్టిన రోజుకు కొన్ని రోజుల ముందే కామన్ డిస్ ప్లే పిక్ డిజైన్ చేసి అఫీషియల్గా సెలబ్రెటీలతో రిలీజ్ చేయించడం.. అభిమానులు ఆ పిక్కే పుట్టిన రోజు వరకు డీపీగా పెట్టుకోవడం మామూలే.
ఐతే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజుకు ఇంతకుమించి ఏదైనా చేయాలని ఆయన పీఆర్ టీం ఫిక్సయింది. ఇందుకోసం ఓ కొత్త ట్రెండ్కు శ్రీకారం చుడుతోంది. ఇప్పటిదాకా కామన్ డిస్ ప్లే పిక్స్ రిలీజ్ చేయడం చూశాం. కానీ చిరు పుట్టిన రోజును పురస్కరించుకుని కామన్ మోషన్ పోస్టర్ లాంచ్ చేయబోతున్నారు.
చిరు పుట్టిన రోజుకు వారం ముందు.. అంటే ఆగస్టు 15న ఇది రిలీజవుతుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా వివిధ సినీ పరిశ్రమల్లోని 65 మంది ఫిలిం సెలబ్రెటీలను లైన్లో పెడుతున్నారు. వారితో ఒకేసారి ఈ కామన్ మోషన్ పోస్టర్ లాంచ్ చేయిస్తారు. ఆ తర్వాత వారం రోజుల కౌంట్ డౌన్లో మరిన్ని సోషల్ మీడియా ట్రెండ్స్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ఈసారి మెగాస్టార్ పుట్టిన రోజుకు సోషల్ మీడియాలో సందడి ఓ రేంజిలో ఉండేలా ఉంది.
This post was last modified on August 10, 2020 6:41 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…