ఇప్పుడు పెద్ద హీరోల పుట్టిన రోజులు వచ్చాయంటే సోషల్ మీడియాలో హంగామా అంతా ఇంతా కాదు. మామూలుగానే సోషల్ మీడియా హడావుడి బాగా ఎక్కువైపోగా.. కరోనా కారణంగా బయట యాక్టివిటీస్ అన్నీ ఆగిపోవడంతో అక్కడ సందడి ఇంకా పెరిగిపోతోంది. తమ హీరోల బర్త్ డేలకు కొన్ని రోజుల ముందే కౌంట్ డౌన్ పెట్టి అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు.
హీరోల పీఆర్ టీమ్స్ కూడా సోషల్ మీడియా ట్రెండ్స్ మీద ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నాయి. పుట్టిన రోజుకు కొన్ని రోజుల ముందే కామన్ డిస్ ప్లే పిక్ డిజైన్ చేసి అఫీషియల్గా సెలబ్రెటీలతో రిలీజ్ చేయించడం.. అభిమానులు ఆ పిక్కే పుట్టిన రోజు వరకు డీపీగా పెట్టుకోవడం మామూలే.
ఐతే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజుకు ఇంతకుమించి ఏదైనా చేయాలని ఆయన పీఆర్ టీం ఫిక్సయింది. ఇందుకోసం ఓ కొత్త ట్రెండ్కు శ్రీకారం చుడుతోంది. ఇప్పటిదాకా కామన్ డిస్ ప్లే పిక్స్ రిలీజ్ చేయడం చూశాం. కానీ చిరు పుట్టిన రోజును పురస్కరించుకుని కామన్ మోషన్ పోస్టర్ లాంచ్ చేయబోతున్నారు.
చిరు పుట్టిన రోజుకు వారం ముందు.. అంటే ఆగస్టు 15న ఇది రిలీజవుతుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా వివిధ సినీ పరిశ్రమల్లోని 65 మంది ఫిలిం సెలబ్రెటీలను లైన్లో పెడుతున్నారు. వారితో ఒకేసారి ఈ కామన్ మోషన్ పోస్టర్ లాంచ్ చేయిస్తారు. ఆ తర్వాత వారం రోజుల కౌంట్ డౌన్లో మరిన్ని సోషల్ మీడియా ట్రెండ్స్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ఈసారి మెగాస్టార్ పుట్టిన రోజుకు సోషల్ మీడియాలో సందడి ఓ రేంజిలో ఉండేలా ఉంది.
This post was last modified on August 10, 2020 6:41 am
ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…
నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…
తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నందన్ది ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…
అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అందరూ హిట్ మెషీన్ అంటారు. దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత అపజయం లేకుండా కెరీర్ను సాగిస్తున్న…
అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…