Movie News

సాములోరు.. ప్ర‌భాస్‌ను ఓ రేంజ్‌లో ఎత్తేశారుగా!

స్వామీజీలు, స‌న్యాసులు అన‌గానే సినిమాల‌కు దూరంగా ఉంటారు. ఆయా ఫంక్ష‌న్ల‌కు కూడా క‌డు దూరంపాటిస్తారు. అయితే.. ఆధునిక ప‌రిస్థితిలో స్వాములు, స‌న్యాసుల‌కు సినిమాలు-రాజ‌కీయాల‌తో అనిభావ సంబంధం ఏర్ప‌డిపోయింది. న‌టులు వెళ్లి వారిని క‌ల‌వ‌డం.. న‌టుల‌ను వీరు కొనియాడ‌డం, రాజ‌కీయ నేత‌లు మిలాఖ‌త్ కావ‌డం.. నేత‌ల‌కు వీరు దిశానిర్దేశం చేయ‌డం వంటివి ఇప్పుడు స‌ర్వ‌సాధార‌ణంగా మారాయి.

ఈ క్ర‌మంలోనే తాజాగా ఆధ్యాత్మికవేత్త చినజీయర్‌ స్వామి తిరుప‌తిలో నిర్వ‌హించిన ప్ర‌భాస్ మూవీ ‘ఆదిపురుష్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో త‌ళుక్కుమ‌న్నారు. దీంతో టీవీల ముందు కూర్చున్న‌వారు నోరెళ్ల బెట్టారు. సినిమా పంక్ష‌న్‌లో సాములోరేంటా? అని వారిలో వారే ప్ర‌శ్నించుకున్నారు. ఇక‌, ఈ సంద‌ర్భంగా మైకందుకున్న చిన‌జీయ‌ర్ సాములోరు.. ప్ర‌భాస్‌ను ఓ రేంజ్‌లో ఎత్తేశారు.

చిన‌జీయ‌ర్ అనుగ్ర‌హ భాష‌ణం.. ఇదీ!

‘ప్రియ భగవత్‌ బంధువుల్లారా.. సినిమా రంగంలో చరిత్ర సృష్టించిన మహనీయులు ఉండే ఇలాంటి కార్యక్రమాల్లో మాలాంటి వాళ్లు పాల్గొనడం ఇదే మొదటిసారి. దానికి కారణం.. నిజమైన ‘బాహుబలి’ రాముడు అని నిరూపించడానికే ఈ సినిమా వచ్చింది. ప్రతిఒక్కరి గుండెల్లో రాముడు ఉన్నాడు. అలా ప్రభాస్‌ తనలోని రాముడిని తెరపైకి తీసుకొస్తున్నారు. మానవ జాతికి మార్గాన్ని చూపిస్తున్న మహనీయుడు శ్రీరాముడే. ఆయన గురించి ఎవరు ఏం చెప్పినా, ఈ మట్టిపైన నడిచి పావనం చేసిన ఆదర్శ పురుషుడు’’ అని చెప్పారు.

‘‘మనలోని రాముడిని తెచ్చే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నమే ప్రభాస్‌ ఇప్పుడు చేస్తున్నారు. ఇంతకంటే లోకానికి మహోపకారం ఉండదు. అలాంటి మంచి పనిచేసే మహనీయులకు ఆ వెంకటేశ్వరస్వామి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నా. ఇలాంటి సినిమాను అందిస్తున్న ఓం రౌత్‌కు అభినందనలు. అలాగే చిత్ర బృందం మొత్తానికి నా దీవెనలతో పాటు, ప్రేక్షకులైన మీ దీవెనలు కూడా కావాలి’’ అని చినజీయర్‌ స్వామి అన్నారు.

Satya

Recent Posts

బాక్సాఫీస్‌కు మంచి రోజులొచ్చాయి

2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…

38 minutes ago

థియేట‌ర్లు, షోలు పెంచుకుంటున్న బంగారం

ఈ రోజుల్లో చిన్న‌, మిడ్ రేంజ్ సినిమాల‌కు రిలీజ్రోజు ఇచ్చిన థియేట‌ర్ల‌ను జ‌నంతో నింప‌డ‌మే క‌ష్టమైపోతోంది. జ‌నం థియేట‌ర్ల‌కు రావ‌డం…

1 hour ago

కూట‌మికి రెండేళ్లు ఓకే… చేయవలసినవి ఇంకా ఉన్నాయి

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం రెండేళ్ల పాల‌న‌ను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్ర‌భుత్వం ఏం చేయాల‌న్నా.. మ‌రో…

3 hours ago

ప్రభాస్ ఫోన్ లో ఆ వాల్ పేపర్ ఎందుకుంది?

ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…

8 hours ago

“మ‌రో వందేళ్ల‌యినా… కాంగ్రెస్ ఇంతే”

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ప‌శ్చిమ‌బెంగాల్‌లో శ‌నివారం సాయంత్రం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న దేశ‌వ్యాప్తంగా అన్న‌దాత‌ల‌కు పీఎం-కిసాన్ నిధుల‌ను…

10 hours ago

‘గొడ్డ‌లి పార్టీ అంత‌కు మించి ఏం చేసింది?’

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. మ‌రోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గ‌త ఐదేళ్ల కాలంలో గొడ్డ‌లి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయ‌డం..…

12 hours ago