స్వామీజీలు, సన్యాసులు అనగానే సినిమాలకు దూరంగా ఉంటారు. ఆయా ఫంక్షన్లకు కూడా కడు దూరంపాటిస్తారు. అయితే.. ఆధునిక పరిస్థితిలో స్వాములు, సన్యాసులకు సినిమాలు-రాజకీయాలతో అనిభావ సంబంధం ఏర్పడిపోయింది. నటులు వెళ్లి వారిని కలవడం.. నటులను వీరు కొనియాడడం, రాజకీయ నేతలు మిలాఖత్ కావడం.. నేతలకు వీరు దిశానిర్దేశం చేయడం వంటివి ఇప్పుడు సర్వసాధారణంగా మారాయి.
ఈ క్రమంలోనే తాజాగా ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామి తిరుపతిలో నిర్వహించిన ప్రభాస్ మూవీ ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తళుక్కుమన్నారు. దీంతో టీవీల ముందు కూర్చున్నవారు నోరెళ్ల బెట్టారు. సినిమా పంక్షన్లో సాములోరేంటా? అని వారిలో వారే ప్రశ్నించుకున్నారు. ఇక, ఈ సందర్భంగా మైకందుకున్న చినజీయర్ సాములోరు.. ప్రభాస్ను ఓ రేంజ్లో ఎత్తేశారు.
చినజీయర్ అనుగ్రహ భాషణం.. ఇదీ!
‘ప్రియ భగవత్ బంధువుల్లారా.. సినిమా రంగంలో చరిత్ర సృష్టించిన మహనీయులు ఉండే ఇలాంటి కార్యక్రమాల్లో మాలాంటి వాళ్లు పాల్గొనడం ఇదే మొదటిసారి. దానికి కారణం.. నిజమైన ‘బాహుబలి’ రాముడు అని నిరూపించడానికే ఈ సినిమా వచ్చింది. ప్రతిఒక్కరి గుండెల్లో రాముడు ఉన్నాడు. అలా ప్రభాస్ తనలోని రాముడిని తెరపైకి తీసుకొస్తున్నారు. మానవ జాతికి మార్గాన్ని చూపిస్తున్న మహనీయుడు శ్రీరాముడే. ఆయన గురించి ఎవరు ఏం చెప్పినా, ఈ మట్టిపైన నడిచి పావనం చేసిన ఆదర్శ పురుషుడు’’ అని చెప్పారు.
‘‘మనలోని రాముడిని తెచ్చే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నమే ప్రభాస్ ఇప్పుడు చేస్తున్నారు. ఇంతకంటే లోకానికి మహోపకారం ఉండదు. అలాంటి మంచి పనిచేసే మహనీయులకు ఆ వెంకటేశ్వరస్వామి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నా. ఇలాంటి సినిమాను అందిస్తున్న ఓం రౌత్కు అభినందనలు. అలాగే చిత్ర బృందం మొత్తానికి నా దీవెనలతో పాటు, ప్రేక్షకులైన మీ దీవెనలు కూడా కావాలి’’ అని చినజీయర్ స్వామి అన్నారు.
This post was last modified on June 7, 2023 10:47 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…