స్వామీజీలు, సన్యాసులు అనగానే సినిమాలకు దూరంగా ఉంటారు. ఆయా ఫంక్షన్లకు కూడా కడు దూరంపాటిస్తారు. అయితే.. ఆధునిక పరిస్థితిలో స్వాములు, సన్యాసులకు సినిమాలు-రాజకీయాలతో అనిభావ సంబంధం ఏర్పడిపోయింది. నటులు వెళ్లి వారిని కలవడం.. నటులను వీరు కొనియాడడం, రాజకీయ నేతలు మిలాఖత్ కావడం.. నేతలకు వీరు దిశానిర్దేశం చేయడం వంటివి ఇప్పుడు సర్వసాధారణంగా మారాయి.
ఈ క్రమంలోనే తాజాగా ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామి తిరుపతిలో నిర్వహించిన ప్రభాస్ మూవీ ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తళుక్కుమన్నారు. దీంతో టీవీల ముందు కూర్చున్నవారు నోరెళ్ల బెట్టారు. సినిమా పంక్షన్లో సాములోరేంటా? అని వారిలో వారే ప్రశ్నించుకున్నారు. ఇక, ఈ సందర్భంగా మైకందుకున్న చినజీయర్ సాములోరు.. ప్రభాస్ను ఓ రేంజ్లో ఎత్తేశారు.
చినజీయర్ అనుగ్రహ భాషణం.. ఇదీ!
‘ప్రియ భగవత్ బంధువుల్లారా.. సినిమా రంగంలో చరిత్ర సృష్టించిన మహనీయులు ఉండే ఇలాంటి కార్యక్రమాల్లో మాలాంటి వాళ్లు పాల్గొనడం ఇదే మొదటిసారి. దానికి కారణం.. నిజమైన ‘బాహుబలి’ రాముడు అని నిరూపించడానికే ఈ సినిమా వచ్చింది. ప్రతిఒక్కరి గుండెల్లో రాముడు ఉన్నాడు. అలా ప్రభాస్ తనలోని రాముడిని తెరపైకి తీసుకొస్తున్నారు. మానవ జాతికి మార్గాన్ని చూపిస్తున్న మహనీయుడు శ్రీరాముడే. ఆయన గురించి ఎవరు ఏం చెప్పినా, ఈ మట్టిపైన నడిచి పావనం చేసిన ఆదర్శ పురుషుడు’’ అని చెప్పారు.
‘‘మనలోని రాముడిని తెచ్చే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నమే ప్రభాస్ ఇప్పుడు చేస్తున్నారు. ఇంతకంటే లోకానికి మహోపకారం ఉండదు. అలాంటి మంచి పనిచేసే మహనీయులకు ఆ వెంకటేశ్వరస్వామి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నా. ఇలాంటి సినిమాను అందిస్తున్న ఓం రౌత్కు అభినందనలు. అలాగే చిత్ర బృందం మొత్తానికి నా దీవెనలతో పాటు, ప్రేక్షకులైన మీ దీవెనలు కూడా కావాలి’’ అని చినజీయర్ స్వామి అన్నారు.
This post was last modified on June 7, 2023 10:47 am
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…