స్వామీజీలు, సన్యాసులు అనగానే సినిమాలకు దూరంగా ఉంటారు. ఆయా ఫంక్షన్లకు కూడా కడు దూరంపాటిస్తారు. అయితే.. ఆధునిక పరిస్థితిలో స్వాములు, సన్యాసులకు సినిమాలు-రాజకీయాలతో అనిభావ సంబంధం ఏర్పడిపోయింది. నటులు వెళ్లి వారిని కలవడం.. నటులను వీరు కొనియాడడం, రాజకీయ నేతలు మిలాఖత్ కావడం.. నేతలకు వీరు దిశానిర్దేశం చేయడం వంటివి ఇప్పుడు సర్వసాధారణంగా మారాయి.
ఈ క్రమంలోనే తాజాగా ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామి తిరుపతిలో నిర్వహించిన ప్రభాస్ మూవీ ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తళుక్కుమన్నారు. దీంతో టీవీల ముందు కూర్చున్నవారు నోరెళ్ల బెట్టారు. సినిమా పంక్షన్లో సాములోరేంటా? అని వారిలో వారే ప్రశ్నించుకున్నారు. ఇక, ఈ సందర్భంగా మైకందుకున్న చినజీయర్ సాములోరు.. ప్రభాస్ను ఓ రేంజ్లో ఎత్తేశారు.
చినజీయర్ అనుగ్రహ భాషణం.. ఇదీ!
‘ప్రియ భగవత్ బంధువుల్లారా.. సినిమా రంగంలో చరిత్ర సృష్టించిన మహనీయులు ఉండే ఇలాంటి కార్యక్రమాల్లో మాలాంటి వాళ్లు పాల్గొనడం ఇదే మొదటిసారి. దానికి కారణం.. నిజమైన ‘బాహుబలి’ రాముడు అని నిరూపించడానికే ఈ సినిమా వచ్చింది. ప్రతిఒక్కరి గుండెల్లో రాముడు ఉన్నాడు. అలా ప్రభాస్ తనలోని రాముడిని తెరపైకి తీసుకొస్తున్నారు. మానవ జాతికి మార్గాన్ని చూపిస్తున్న మహనీయుడు శ్రీరాముడే. ఆయన గురించి ఎవరు ఏం చెప్పినా, ఈ మట్టిపైన నడిచి పావనం చేసిన ఆదర్శ పురుషుడు’’ అని చెప్పారు.
‘‘మనలోని రాముడిని తెచ్చే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నమే ప్రభాస్ ఇప్పుడు చేస్తున్నారు. ఇంతకంటే లోకానికి మహోపకారం ఉండదు. అలాంటి మంచి పనిచేసే మహనీయులకు ఆ వెంకటేశ్వరస్వామి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నా. ఇలాంటి సినిమాను అందిస్తున్న ఓం రౌత్కు అభినందనలు. అలాగే చిత్ర బృందం మొత్తానికి నా దీవెనలతో పాటు, ప్రేక్షకులైన మీ దీవెనలు కూడా కావాలి’’ అని చినజీయర్ స్వామి అన్నారు.
This post was last modified on June 7, 2023 10:47 am
పదేళ్ల ముందు ‘దంగల్’ మూవీతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్. ఇప్పటికీ ఇండియాస్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా పెద్ద సినిమాకు ముందస్తు బిజినెస్ జరగడం చాలా కష్టమైపోయింది. ముఖ్యంగా ఒక్క టీజర్ తోనే మొత్తం…
టాలీవుడ్ టాప్ హీరోల్లో అత్యధిక డిమాండ్ ఉన్నది ఎవరికయ్యా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. తెలుగులోనే కాదు హిందీలోనూ…
ఇరాన్ యుద్ధ పరిణామాలు టీవీలో, సోషల్ మీడియాలో చూస్తూ తెలుసుకుంటున్న మన దేశ జనాలకు మెల్లగా దాని ప్రభావం నేరుగా…
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కేసును రెండేళ్ల నుంచి కార్తీక దీపం సీరియల్ మాదిరి లాగుతున్నారని బీఆర్ఎస్ నేతలు…
అదేంటో సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్ పదే పదే నోరు జారే తప్పులు చేస్తూనే ఉన్నారు. రాబిన్ హుడ్ టైంలో ఆస్ట్రేలియా…