ఈ రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియా అంతటా మహేష్ పేరు మార్మోగిపోతోంది. తండ్రి వారసత్వాన్నందుకుని నటనలోకి వచ్చిన మహేష్.. తండ్రిలాగే సూపర్ స్టార్ అనిపించుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. పెద్ద మాస్ హీరోగా ఎదగడమే కాదు.. నటుడిగానూ చాలా తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించాడు. అవార్డులు కొల్లగొట్టాడు.
‘ఒక్కడు’తో మొదలుపెట్టి తరచుగా రికార్డుల మోత మోగిస్తూ సాగిసోతున్నాడు మన సూపర్ స్టార్. చివరగా సంక్రాంతికి విడుదలైన మహేష్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ యావరేజ్ కంటెంట్తోనే కలెక్షన్ల మోత మోగించింది. ఇప్పుడిక ‘సర్కారు వారి పాట’తో సందడికి సిద్ధమవుతున్నాడు మహేష్. పుట్టిన రోజు సందర్భంగా రిలీజైన దీని మోషన్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.
ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో టాలీవుడ్ టాప్ సెలబ్రెటీలందరూ మహేష్ మీద తమ అభిమానాన్ని చూపిస్తూ శుభాకాంక్షలు చెబుతున్నారు. అందరిలోకి మెగాస్టార్ చిరంజీవి విష్ ప్రత్యేకం. మహేష్ను తన బిడ్డలా భావిస్తానంటూ ‘సరిలేరు..’ ఆడియో వేడుకలో ఎంత ప్రేమగా మాట్లాడాడో తెలిసిందే. తన ట్వీట్లో కూడా మహేష్ మీద ప్రేమను దాచుకోలేదాయన. ‘‘అందం, అభినయం భగవంతుడు మీకిచ్చిన వరం. మరెన్నో మరిచిపోలేని పాత్రలు చేయాలనీ, మీ కలలన్నీ నెరవేరాలని కోరుకుంటూ, హ్యాపీ బర్త్ డే మహేష్. ఈ ఏడాదంతా నీకు గొప్పగా సాగాలి’’ అని చిరు ట్వీట్ వేశాడు.
మహేష్ను మీరు అని గౌరవిస్తూ చిరు ఇలా ట్వీట్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్.. మహేష్ను అన్నా అని సంబోధిస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. ఇక మహేష్ ఫ్యాన్స్ అయితే.. ట్విట్టర్ రికార్డుల అంతు చూడటమే లక్ష్యంగా ‘హ్యాపీ బర్త్ డే మహేష్ బాబు’ హ్యాష్ ట్యాగ్తో ట్వీట్ల మోత మోగిస్తున్నారు.
This post was last modified on August 10, 2020 11:43 am
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…