బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మృతి కేసు రోజు రోజుకూ జఠిలమవుతోంది. ముంబయి పోలీసులేమో.. విచారణ ఆరంభ దశలోనే సుశాంత్ది ఆత్మహత్య అని ప్రాథమికంగా నిర్ధారించేశారు. ఆ తర్వాత రెండు నెలల పాటు ఎంతోమందిని విచారించి.. అనేక కోణాల్లో పరిశోధన సాగించి.. చివరికి సుశాంత్ది ఆత్మహత్యగానే ప్రకటించారు.
కానీ సుశాంత్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రం సుశాంత్ మృతి పట్ల అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్ సొంత రాష్ట్రం బీహార్లో సుశాంత్ మద్దతుదారుల డిమాండ్ మేరకు అక్కడి ప్రభుత్వం సీబీఐ విచారణకు డిమాండ్ చేసింది. కేంద్రం అందుకు అంగీకరించింది. సీబీఐ విచారణ మొదలైంది కూడా.
మరోవైపు బీహార్ పోలీసులు కూడా తమ వంతుగా ఈ కేసును విచారించే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే వాళ్లు ముంబయికి వచ్చి విచారణ జరిపే ప్రయత్నం చేస్తుండగా.. ముంబయి పోలీసులకు అది ఎంతమాత్రం నచ్చట్లేదని సమాచారం. వారిని అడ్డుకునే, అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారట.
ఈ కేసులో మొదట్నుంచి ముంబయి పోలీసులపై అనేక అనుమానాలు, ఆరోపణలు వినిపిస్తన్నాయి. వాళ్లు కేసును నీరుగార్చే, సాక్ష్యాల్ని తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో బీహార్ పోలీసులు రంగంలోకి దిగడం వారికి నచ్చట్లేదని.. వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని.. తమ పరిధిలో ఉన్న కేసులో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని బెదిరిస్తున్నారని.. దీంతో బీహార్ పోలీసులు మారు వేషాల్లో తిరుగుతూ విచారణ జరుపుతున్నారని.. సుశాంత్ సన్నిహితులతో పాటు అనేకమందిని కలుస్తున్నారని బాలీవుడ్ మీడియా రిపోర్ట్ చేస్తోంది.
This post was last modified on August 10, 2020 3:34 pm
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…
ఇండస్ట్రీలో వరుసగా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవకాశాలు దక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ కొందరు డైరెక్టర్లు మాత్రం తమ…
ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…
ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…