తక్కువ బడ్జెట్ తో రూపొంది, టాక్ మిక్స్డ్ గా ఉన్నా జరిగిన బిజినెస్ కు తగ్గట్టు బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల్లోకి వెళ్ళిపోయిన మేం ఫేమస్ మీద మొదటి మూడు నాలుగు రోజులు సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. ముఖ్యంగా దీన్ని యావరేజ్ అన్నా బాలేదన్నా నిర్మాతలు ఏ మాత్రం ఒప్పుకోలేకపోవడం పంచాయితీ పేరుతో చేసిన ప్రెస్ మీట్ లోనూ బయట పడింది. ట్విట్టర్ నెగటివిటీకి అవసరానికి మించి రియాక్ట్ అవ్వడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఫైనల్ గా మేం ఫేమస్ ని సక్సెస్ ఫుల్ మూవీగా చెప్పుకోవచ్చు కానీ బ్లాక్ బస్టరనో ఫ్లాపనో స్టాంప్ వేయలేం.
ఛాయ్ బిస్కెట్ టీమ్ మాత్రం ప్రమోషన్ల విషయంలో స్పీడ్ కొనసాగిస్తోంది. ముఖ్యంగా ఈ వారం తెలంగాణలోని ఎంపిక చేసిన నగరాల్లో రోజు సాయంత్రాలు ఫ్రీ షోలు వేసి టీమ్ తో సహా వెళ్ళిపోయి యూత్ ని కలుస్తోంది. ఉచిత ప్రదర్శనలు కాబట్టి సహజంగానే ఇవి కిక్కిరిసిపోతున్నాయి. యాభై అయిదు థియేటర్లకు పైగా స్టూడెంట్ ఐడి కార్డు ఉన్న వాళ్లకు తొంభై తొమ్మిది రూపాయలకే టికెట్ స్కీం పెట్టినా అది మరీ ఆశించిన అద్భుతాలు చేయలేకపోయింది. ఒకటో తేదీతో మొదలుపెట్టి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలో రోజుకు ఒక చోట చొప్పున ఫ్రీ షోలు జరిగాయి.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం లాభాలు వచ్చినా మేం ఫేమస్ కి ఇంకా ఓటిటి, శాటిలైట్ డీల్స్ అవ్వలేదు. ఒకవేళ జాతిరత్నాలు తరహాలో పాతిక ముప్పై కోట్లు వసూలు చేసే రేంజ్ లో ఆడివుంటే ఇప్పుడీ హక్కులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడేది. కానీ ఆలా జరగలేదు. ఈ వీకెండ్ లోపు ఆరేడు కోట్లను దాటాకపోవచ్చు. ఫైనల్ రన్ అయ్యేలోపు పది కోట్లను టచ్ చేస్తే గొప్ప అచీవ్ మెంట్ అవుతుంది. కొత్తగా వచ్చిన రిలీజులకు సోసో టాక్ రావడం మేం ఫేమస్ కి కలిసి రావొచ్చు. అది ఎంత శాతం అనేది సోమవారం ఉదయానికి బయటికి వచ్చే వీకెండ్ ఫిగర్లను బట్టి తేలిపోతుంది. అందుకే పబ్లిసిటీ స్పీడ్ పెంచేశారు
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…