తక్కువ బడ్జెట్ తో రూపొంది, టాక్ మిక్స్డ్ గా ఉన్నా జరిగిన బిజినెస్ కు తగ్గట్టు బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల్లోకి వెళ్ళిపోయిన మేం ఫేమస్ మీద మొదటి మూడు నాలుగు రోజులు సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. ముఖ్యంగా దీన్ని యావరేజ్ అన్నా బాలేదన్నా నిర్మాతలు ఏ మాత్రం ఒప్పుకోలేకపోవడం పంచాయితీ పేరుతో చేసిన ప్రెస్ మీట్ లోనూ బయట పడింది. ట్విట్టర్ నెగటివిటీకి అవసరానికి మించి రియాక్ట్ అవ్వడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఫైనల్ గా మేం ఫేమస్ ని సక్సెస్ ఫుల్ మూవీగా చెప్పుకోవచ్చు కానీ బ్లాక్ బస్టరనో ఫ్లాపనో స్టాంప్ వేయలేం.
ఛాయ్ బిస్కెట్ టీమ్ మాత్రం ప్రమోషన్ల విషయంలో స్పీడ్ కొనసాగిస్తోంది. ముఖ్యంగా ఈ వారం తెలంగాణలోని ఎంపిక చేసిన నగరాల్లో రోజు సాయంత్రాలు ఫ్రీ షోలు వేసి టీమ్ తో సహా వెళ్ళిపోయి యూత్ ని కలుస్తోంది. ఉచిత ప్రదర్శనలు కాబట్టి సహజంగానే ఇవి కిక్కిరిసిపోతున్నాయి. యాభై అయిదు థియేటర్లకు పైగా స్టూడెంట్ ఐడి కార్డు ఉన్న వాళ్లకు తొంభై తొమ్మిది రూపాయలకే టికెట్ స్కీం పెట్టినా అది మరీ ఆశించిన అద్భుతాలు చేయలేకపోయింది. ఒకటో తేదీతో మొదలుపెట్టి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలో రోజుకు ఒక చోట చొప్పున ఫ్రీ షోలు జరిగాయి.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం లాభాలు వచ్చినా మేం ఫేమస్ కి ఇంకా ఓటిటి, శాటిలైట్ డీల్స్ అవ్వలేదు. ఒకవేళ జాతిరత్నాలు తరహాలో పాతిక ముప్పై కోట్లు వసూలు చేసే రేంజ్ లో ఆడివుంటే ఇప్పుడీ హక్కులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడేది. కానీ ఆలా జరగలేదు. ఈ వీకెండ్ లోపు ఆరేడు కోట్లను దాటాకపోవచ్చు. ఫైనల్ రన్ అయ్యేలోపు పది కోట్లను టచ్ చేస్తే గొప్ప అచీవ్ మెంట్ అవుతుంది. కొత్తగా వచ్చిన రిలీజులకు సోసో టాక్ రావడం మేం ఫేమస్ కి కలిసి రావొచ్చు. అది ఎంత శాతం అనేది సోమవారం ఉదయానికి బయటికి వచ్చే వీకెండ్ ఫిగర్లను బట్టి తేలిపోతుంది. అందుకే పబ్లిసిటీ స్పీడ్ పెంచేశారు
This post was last modified on June 3, 2023 11:53 pm
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…
కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…
2022 లెజెండ్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన తమిళ వ్యాపారవేత్త శరవణన్ ని మూవీ లవర్స్ అంత ఈజీగా మర్చిపోలేరు.…
తమిళ మలయాళ టైటిల్స్ ని ఒరిజినల్ పేర్లతో పెట్టడం సినిమాల ఓపెనింగ్స్, బజ్ మీద ఎంత ప్రభావం చూపిస్తోందో నిర్మాతలు…
ఏపీకి ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించే కూటమి సర్కారు తీసుకున్న చర్యలు విపక్ష వైసీపీని ఓ రేంజిలో కలవరపాటుకు గురి చేశాయని చెప్పక తప్పదు.…
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ కొత్త సినిమా సంబరాల ఏటిగట్టు ఇప్పటికీ విడుదల తేదీ ఖరారు…