సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శక ధీరుడు రాజమౌళి.. ఈ కాంబినేషన్ కోసం ఎన్నో ఏళ్లుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇదిగో అదిగో అంటూనే ఏల్లకు ఏళ్లు గడిచిపోయాయి. ఇక ఈ కాంబినేషన్ ఉండదులే అనే నిరాశలో ఉన్న సమయంలో రాజమౌళి సూపర్ స్టార్ అభిమానులకు జోష్ ఇచ్చే కబురు చెప్పాడు.
‘ఆర్ఆర్ఆర్’ అయ్యాక తన తర్వాతి సినిమా మహేష్ బాబుతోనే అని తేల్చేశారు. ఇక అప్పట్నుంచి వీళ్ల కలయికలో ఎలాంటి సినిమా వస్తుందనే చర్చ మొదలైపోయింది.
ఇంతకుముందు తాను మహేష్ బాబుతో సినిమా చేస్తే జేమ్స్ బాండ్ తరహా మూవీ చేస్తానంటూ జక్కన్న సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో అలాంటి సినిమా అయితే ఎలా ఉంటుందనే డిస్కషన్లలో మునిగిపోయారు ఫ్యాన్స్. కొందరేమో రాజమౌళి స్టయిల్లో చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా చేస్తే మహేష్ను డిఫరెంటుగా చూడొచ్చంటున్నారు. ఇంకొందరు కౌబాయ్ టైపు సినిమా చేస్తే ఎలా ఉంటుందని చర్చిస్తున్నారు.
ఇంతకీ రాజమౌళి ఆలోచన ఎలా ఉందన్నది ఎవ్వరికీ తెలియదు. ఐతే ఓ ఇంటర్వ్యూలో ఈ విషయమై కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు జక్కన్న. మహేష్తో తన సినిమా గురించి ఇప్పుడే ఊహాగానాలు అవసరం లేదని.. ఇంకా తాము ఏమీ అనుకోలేదని జక్కన్న తేల్చేశాడు. మహేష్తో జేమ్స్ బాండ్ తరహా సినిమా చేస్తారని ప్రచారం సాగుతోంది..
నిజమేనా అని అడిగితే.. ‘‘ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. మహేష్ ఇమేజ్, ఆయన బాడీ లాంగ్వేజ్తో పాటు నా అభిరుచికి తగ్గట్లుగా ఉంటుందా సినిమా. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాతే తదుపరి సినిమా మొదలుపెట్టాలి. మహేష్తో కూడా ఇంకా కథ గురించి చర్చించలేదు’’ అని రాజమౌళి స్పష్టం చేశాడు.
కాబట్టి ‘ఆర్ఆర్ఆర్’ అయ్యే వరకు రాజమౌళి-మహేష్ సినిమా గురించి ఊహాగానాలు ఆపేస్తే బెటరేమో. సీనియర్ నిర్మాత కె.ఎల్.నారాయణ బేనర్లో రాజమౌళి ఈ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.
ఈ ఏడాది వేసవికి సరైన గమ్యస్థానంగా శ్రీనగర్ నిలిచింది. పెద్దగా ప్రచారం జరగనప్పటికి.. ఈసారి వేసవిలో చల్లదనాన్ని అస్వాదించేందుకు శ్రీనగర్…
నేటి యువత ప్రభుత్వాలపై తమ ఆగ్రహాన్ని పలు రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. "మాకు కార్పొరేటర్ అయినా ఒకటే, సీఎం అయినా…
ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…
గత రెండు మాసాలకు పైగా ఇంధన, గ్యాస్ సమస్యలతో ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నాయి. చమురు ధరలు పెరిగిపోవడమే…
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బీజేపీని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…