సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శక ధీరుడు రాజమౌళి.. ఈ కాంబినేషన్ కోసం ఎన్నో ఏళ్లుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇదిగో అదిగో అంటూనే ఏల్లకు ఏళ్లు గడిచిపోయాయి. ఇక ఈ కాంబినేషన్ ఉండదులే అనే నిరాశలో ఉన్న సమయంలో రాజమౌళి సూపర్ స్టార్ అభిమానులకు జోష్ ఇచ్చే కబురు చెప్పాడు.
‘ఆర్ఆర్ఆర్’ అయ్యాక తన తర్వాతి సినిమా మహేష్ బాబుతోనే అని తేల్చేశారు. ఇక అప్పట్నుంచి వీళ్ల కలయికలో ఎలాంటి సినిమా వస్తుందనే చర్చ మొదలైపోయింది.
ఇంతకుముందు తాను మహేష్ బాబుతో సినిమా చేస్తే జేమ్స్ బాండ్ తరహా మూవీ చేస్తానంటూ జక్కన్న సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో అలాంటి సినిమా అయితే ఎలా ఉంటుందనే డిస్కషన్లలో మునిగిపోయారు ఫ్యాన్స్. కొందరేమో రాజమౌళి స్టయిల్లో చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా చేస్తే మహేష్ను డిఫరెంటుగా చూడొచ్చంటున్నారు. ఇంకొందరు కౌబాయ్ టైపు సినిమా చేస్తే ఎలా ఉంటుందని చర్చిస్తున్నారు.
ఇంతకీ రాజమౌళి ఆలోచన ఎలా ఉందన్నది ఎవ్వరికీ తెలియదు. ఐతే ఓ ఇంటర్వ్యూలో ఈ విషయమై కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు జక్కన్న. మహేష్తో తన సినిమా గురించి ఇప్పుడే ఊహాగానాలు అవసరం లేదని.. ఇంకా తాము ఏమీ అనుకోలేదని జక్కన్న తేల్చేశాడు. మహేష్తో జేమ్స్ బాండ్ తరహా సినిమా చేస్తారని ప్రచారం సాగుతోంది..
నిజమేనా అని అడిగితే.. ‘‘ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. మహేష్ ఇమేజ్, ఆయన బాడీ లాంగ్వేజ్తో పాటు నా అభిరుచికి తగ్గట్లుగా ఉంటుందా సినిమా. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాతే తదుపరి సినిమా మొదలుపెట్టాలి. మహేష్తో కూడా ఇంకా కథ గురించి చర్చించలేదు’’ అని రాజమౌళి స్పష్టం చేశాడు.
కాబట్టి ‘ఆర్ఆర్ఆర్’ అయ్యే వరకు రాజమౌళి-మహేష్ సినిమా గురించి ఊహాగానాలు ఆపేస్తే బెటరేమో. సీనియర్ నిర్మాత కె.ఎల్.నారాయణ బేనర్లో రాజమౌళి ఈ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.
This post was last modified on April 24, 2020 2:04 pm
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…
వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…
చాట్జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…
నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…