సెలబ్రిటీల పుట్టినరోజులు అభిమానులు జరుపుకోవడం పెద్ద విశేషం కాదు కానీ ఇద్దరు లెజెండ్స్ అనబడే దిగ్గజాలకు ఒకే రోజు బర్త్ డే కావడం అది కూడా ఆ కలయిక సౌత్ సినిమా గర్వపడే ఎన్నో క్లాసిక్స్ ఇవ్వడం మాత్రం అరుదైన విషయమే. అది మణిరత్నం – ఇళయరాజాలకు మాత్రమే కుదిరింది. జూన్ 2 వీళ్ళ జన్మదినం. ఈ కాంబో 1983లో అనిల్ కపూర్ పల్లవి అనుపల్లవితో మొదలైంది. తర్వాత మలయాళంలో ఒకటి తమిళంలో రెండుతో కంటిన్యూ అయ్యింది కానీ అసలైన బ్లాక్ బస్టర్ దక్కింది మాత్రం 1986లో వచ్చిన మ్యూజికల్ క్లాసిక్ మౌన రాగంతోనే .
ఆ మరుసటి సంవత్సరమే కమల్ హాసన్ నాయకుడు రూపంలో ఆవిష్కరించిన ఆల్ టైం క్లాసిక్ చరిత్రలో నిలిచిపోయింది. కార్తీ ప్రభుల మల్టీ స్టారర్ ఘర్షణ మరో మేలిమలుపు. ఇక నాగార్జున గీతాంజలి గురించి చెప్పుకుంటూ పొతే రోజులు సరిపోవు. ఆ తరంలో పుట్టని ఇప్పటి యూత్ కి సైతం హృదయాలను కదిలించే సంగీతం అందులో వినిపిస్తుంది. స్టార్ క్యాస్టింగ్ లేకుండా అంజలితో చేసిన మేజిక్ ఇంకా చెక్కుచెదరలేదు. ఇలా నిర్విరామంగా కొనసాగుతున్న వీళ్ళ జైత్రయాత్ర 1991 దళపతితో ముగింపుకొచ్చింది. రజనీకాంత్ మమ్ముట్టిల స్నేహంతో పోటీ పడుతూ ఛార్ట్ బస్టరైన మ్యూజిక్ ఇది.
కారణాలు ఏవైనా మణిరత్నం రోజాతో ఏఅర్ రెహమాన్ దోస్తీ పట్టాక రాజాతో సినిమాలు సాధ్యం కాలేదు. కానీ అప్పటిదాకా ఎనిమిదేళ్ల ప్రయాణంలో మణి రాజాల కాంబినేషన్ లో వచ్చిన ప్రతి పాట ఆణిముత్యంలా నిలిచిపోయింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని సైతం పదే పదే వినేలా చేసిన ఘనత వీళ్ళకే చెందుతుంది. మళ్ళీ ఎప్పటికైనా కలవకపోతారాని ఫ్యాన్స్ ఎదురు చూశారు కానీ పొన్నియిన్ సెల్వన్ దాకా రెహమాన్ తప్ప మరో ఆలోచన చేయని మణిరత్నం తిరిగి ఇళయరాజాతో చేతులు కలవడం స్వప్నమే. రాజాగారు వెయ్యి సినిమాలు చేసినా మణికి ఇచ్చిన ఆల్బమ్స్ కి ప్రత్యేక స్థానం ఉంటుంది
This post was last modified on June 2, 2023 4:38 pm
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…