Movie News

మణిరత్నం ఇళయరాజా ఇద్దరూ ఇద్దరే

సెలబ్రిటీల పుట్టినరోజులు అభిమానులు జరుపుకోవడం పెద్ద విశేషం కాదు కానీ ఇద్దరు లెజెండ్స్ అనబడే దిగ్గజాలకు ఒకే రోజు బర్త్ డే కావడం అది కూడా ఆ కలయిక సౌత్ సినిమా గర్వపడే ఎన్నో క్లాసిక్స్ ఇవ్వడం మాత్రం అరుదైన  విషయమే. అది మణిరత్నం – ఇళయరాజాలకు మాత్రమే కుదిరింది. జూన్ 2 వీళ్ళ జన్మదినం. ఈ కాంబో 1983లో అనిల్ కపూర్ పల్లవి అనుపల్లవితో మొదలైంది. తర్వాత మలయాళంలో ఒకటి తమిళంలో రెండుతో కంటిన్యూ అయ్యింది కానీ అసలైన బ్లాక్ బస్టర్ దక్కింది మాత్రం 1986లో వచ్చిన మ్యూజికల్ క్లాసిక్ మౌన రాగంతోనే .

ఆ మరుసటి సంవత్సరమే కమల్ హాసన్ నాయకుడు రూపంలో ఆవిష్కరించిన ఆల్ టైం క్లాసిక్ చరిత్రలో నిలిచిపోయింది. కార్తీ ప్రభుల మల్టీ స్టారర్ ఘర్షణ మరో మేలిమలుపు. ఇక నాగార్జున గీతాంజలి గురించి చెప్పుకుంటూ పొతే రోజులు సరిపోవు. ఆ తరంలో పుట్టని ఇప్పటి యూత్ కి సైతం హృదయాలను కదిలించే సంగీతం అందులో వినిపిస్తుంది. స్టార్ క్యాస్టింగ్ లేకుండా అంజలితో చేసిన  మేజిక్ ఇంకా చెక్కుచెదరలేదు. ఇలా నిర్విరామంగా కొనసాగుతున్న వీళ్ళ జైత్రయాత్ర 1991 దళపతితో ముగింపుకొచ్చింది. రజనీకాంత్ మమ్ముట్టిల స్నేహంతో పోటీ పడుతూ ఛార్ట్ బస్టరైన మ్యూజిక్ ఇది.

కారణాలు ఏవైనా మణిరత్నం రోజాతో ఏఅర్ రెహమాన్ దోస్తీ పట్టాక రాజాతో సినిమాలు సాధ్యం కాలేదు.  కానీ అప్పటిదాకా ఎనిమిదేళ్ల ప్రయాణంలో మణి రాజాల కాంబినేషన్ లో వచ్చిన ప్రతి పాట ఆణిముత్యంలా నిలిచిపోయింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని సైతం పదే పదే వినేలా చేసిన ఘనత వీళ్ళకే చెందుతుంది. మళ్ళీ ఎప్పటికైనా కలవకపోతారాని ఫ్యాన్స్ ఎదురు చూశారు కానీ పొన్నియిన్ సెల్వన్ దాకా రెహమాన్ తప్ప మరో ఆలోచన చేయని మణిరత్నం తిరిగి ఇళయరాజాతో చేతులు కలవడం స్వప్నమే. రాజాగారు వెయ్యి సినిమాలు చేసినా మణికి ఇచ్చిన ఆల్బమ్స్ కి ప్రత్యేక స్థానం ఉంటుంది  

This post was last modified on June 2, 2023 4:38 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

10 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

10 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

12 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

12 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

12 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

14 hours ago