సెలబ్రిటీల పుట్టినరోజులు అభిమానులు జరుపుకోవడం పెద్ద విశేషం కాదు కానీ ఇద్దరు లెజెండ్స్ అనబడే దిగ్గజాలకు ఒకే రోజు బర్త్ డే కావడం అది కూడా ఆ కలయిక సౌత్ సినిమా గర్వపడే ఎన్నో క్లాసిక్స్ ఇవ్వడం మాత్రం అరుదైన విషయమే. అది మణిరత్నం – ఇళయరాజాలకు మాత్రమే కుదిరింది. జూన్ 2 వీళ్ళ జన్మదినం. ఈ కాంబో 1983లో అనిల్ కపూర్ పల్లవి అనుపల్లవితో మొదలైంది. తర్వాత మలయాళంలో ఒకటి తమిళంలో రెండుతో కంటిన్యూ అయ్యింది కానీ అసలైన బ్లాక్ బస్టర్ దక్కింది మాత్రం 1986లో వచ్చిన మ్యూజికల్ క్లాసిక్ మౌన రాగంతోనే .
ఆ మరుసటి సంవత్సరమే కమల్ హాసన్ నాయకుడు రూపంలో ఆవిష్కరించిన ఆల్ టైం క్లాసిక్ చరిత్రలో నిలిచిపోయింది. కార్తీ ప్రభుల మల్టీ స్టారర్ ఘర్షణ మరో మేలిమలుపు. ఇక నాగార్జున గీతాంజలి గురించి చెప్పుకుంటూ పొతే రోజులు సరిపోవు. ఆ తరంలో పుట్టని ఇప్పటి యూత్ కి సైతం హృదయాలను కదిలించే సంగీతం అందులో వినిపిస్తుంది. స్టార్ క్యాస్టింగ్ లేకుండా అంజలితో చేసిన మేజిక్ ఇంకా చెక్కుచెదరలేదు. ఇలా నిర్విరామంగా కొనసాగుతున్న వీళ్ళ జైత్రయాత్ర 1991 దళపతితో ముగింపుకొచ్చింది. రజనీకాంత్ మమ్ముట్టిల స్నేహంతో పోటీ పడుతూ ఛార్ట్ బస్టరైన మ్యూజిక్ ఇది.
కారణాలు ఏవైనా మణిరత్నం రోజాతో ఏఅర్ రెహమాన్ దోస్తీ పట్టాక రాజాతో సినిమాలు సాధ్యం కాలేదు. కానీ అప్పటిదాకా ఎనిమిదేళ్ల ప్రయాణంలో మణి రాజాల కాంబినేషన్ లో వచ్చిన ప్రతి పాట ఆణిముత్యంలా నిలిచిపోయింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని సైతం పదే పదే వినేలా చేసిన ఘనత వీళ్ళకే చెందుతుంది. మళ్ళీ ఎప్పటికైనా కలవకపోతారాని ఫ్యాన్స్ ఎదురు చూశారు కానీ పొన్నియిన్ సెల్వన్ దాకా రెహమాన్ తప్ప మరో ఆలోచన చేయని మణిరత్నం తిరిగి ఇళయరాజాతో చేతులు కలవడం స్వప్నమే. రాజాగారు వెయ్యి సినిమాలు చేసినా మణికి ఇచ్చిన ఆల్బమ్స్ కి ప్రత్యేక స్థానం ఉంటుంది
This post was last modified on June 2, 2023 4:38 pm
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జీతాల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా ఆటగాళ్లకు…
జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…
వైసీపీ అధినేత జగన్కు భారీ దెబ్బ తగిలింది. ఇప్పటి వరకు పల్నాడు రాజకీయాల్లో ఏక ఛత్రాధిపత్యంగా చక్రం తిప్పిన పిన్నెల్లి…
ఇండిగో ఎయిర్లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక 'డ్యామేజ్ కంట్రోల్' చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్…
బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ముగిసింది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఎన్నికల…