పేరుకు మలయాళ నటుడే కానీ.. దుల్కర్ సల్మాన్ను మన వాళ్లు పరభాషా నటుడిగా అస్సలు చూడరు. ఆ మాటకొస్తే తమిళులు కూడా అలా ఫీల్ కారు. ‘ఓకే బంగారం’ చిత్రంతో అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అతను అరంగేట్రంలోనే కట్టి పడేశారు. ఆ తర్వాత ‘మహానటి’తో మరింతగా మెప్పించాడు. ఇక ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లోకి ఎంతగా చొచ్చుకుపోయాడో అందరికీ తెలిసిందే.
ఈ సినిమా సూపర్ సక్సెస్ తర్వాత బోలెడన్ని అవకాశాలు వచ్చినా దుల్కర్ తొందరపడట్లేదు. ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్నాడు. ఇటీవలే వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ హీరోగా ఒక సినిమాను అనౌన్స్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇప్పుడు తెలుగులో దుల్కర్ మరో సినిమాను ఓకే చేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి రానా దగ్గుబాటి నిర్మాత అనే వార్త ఆసక్తి రేకెత్తిస్తోంది.
తన ‘స్పిరిట్ మీడియా’ బేనర్ మీద యంగ్ టాలెంట్ను ప్రోత్సహిస్తూ సినిమాలు నిర్మిస్తూ వస్తున్నాడు రానా దగ్గుబాటి. ఇదే బేనర్లో దుల్కర్ హీరోగా ఓ సినిమాను నిర్మించడానికి అతను రంగం సిద్ధం చేస్తున్నాడట. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో కొంత కాలంగా పని చేస్తున్న ఒక యంగ్ టెక్నీషియన్ను రానా ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం చేయనున్నాడట.
తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపు దిద్దుకోనున్నట్లు సమాచారం. ఆటోమేటిగ్గా అది మలయాళంలోకి అనువాదం అవుతుంది. ప్రస్తుతం దుల్కర్ ‘కింగ్ ఆఫ్ కోథా’ అనే సినిమాలో నటిస్తున్నాడు. త్వరలోనే వెంకీ అట్లూరి సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్తాడు. ఆ తర్వాత రానా ప్రొడక్షన్లో సినిమా ఉంటుంది. త్వరలోనే ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో సముద్రఖని ముఖ్య పాత్ర పోషించనున్నాడట.
This post was last modified on June 2, 2023 8:09 am
భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.…
నేచురల్ స్టార్ నాని కేవలం నటుడిగానే కాకుండా 'వాల్ పోస్టర్ సినిమా' బ్యానర్పై నిర్మాతగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన…
టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో క్రిష్ ఎన్నడూ రొటీన్ సినిమా…
మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…
స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…
ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…