పేరుకు మలయాళ నటుడే కానీ.. దుల్కర్ సల్మాన్ను మన వాళ్లు పరభాషా నటుడిగా అస్సలు చూడరు. ఆ మాటకొస్తే తమిళులు కూడా అలా ఫీల్ కారు. ‘ఓకే బంగారం’ చిత్రంతో అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అతను అరంగేట్రంలోనే కట్టి పడేశారు. ఆ తర్వాత ‘మహానటి’తో మరింతగా మెప్పించాడు. ఇక ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లోకి ఎంతగా చొచ్చుకుపోయాడో అందరికీ తెలిసిందే.
ఈ సినిమా సూపర్ సక్సెస్ తర్వాత బోలెడన్ని అవకాశాలు వచ్చినా దుల్కర్ తొందరపడట్లేదు. ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్నాడు. ఇటీవలే వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ హీరోగా ఒక సినిమాను అనౌన్స్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇప్పుడు తెలుగులో దుల్కర్ మరో సినిమాను ఓకే చేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి రానా దగ్గుబాటి నిర్మాత అనే వార్త ఆసక్తి రేకెత్తిస్తోంది.
తన ‘స్పిరిట్ మీడియా’ బేనర్ మీద యంగ్ టాలెంట్ను ప్రోత్సహిస్తూ సినిమాలు నిర్మిస్తూ వస్తున్నాడు రానా దగ్గుబాటి. ఇదే బేనర్లో దుల్కర్ హీరోగా ఓ సినిమాను నిర్మించడానికి అతను రంగం సిద్ధం చేస్తున్నాడట. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో కొంత కాలంగా పని చేస్తున్న ఒక యంగ్ టెక్నీషియన్ను రానా ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం చేయనున్నాడట.
తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపు దిద్దుకోనున్నట్లు సమాచారం. ఆటోమేటిగ్గా అది మలయాళంలోకి అనువాదం అవుతుంది. ప్రస్తుతం దుల్కర్ ‘కింగ్ ఆఫ్ కోథా’ అనే సినిమాలో నటిస్తున్నాడు. త్వరలోనే వెంకీ అట్లూరి సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్తాడు. ఆ తర్వాత రానా ప్రొడక్షన్లో సినిమా ఉంటుంది. త్వరలోనే ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో సముద్రఖని ముఖ్య పాత్ర పోషించనున్నాడట.
This post was last modified on June 2, 2023 8:09 am
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…
‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…
ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…
ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టులు గందరగోళంగా మారడంతో కేంద్రం దిగివచ్చింది. ప్రయాణికుల కష్టాలు చూడలేకనో, లేక ఇండిగో లాబీయింగ్కు…
ఎన్నికలు ఏవైనా.. ప్రజలకు 'ఫ్రీ బీస్' ఉండాల్సిందే. అవి స్థానికమా.. అసెంబ్లీనా, పార్లమెంటా? అనే విషయంతో సంబంధం లేకుండా పోయింది.…