కెరీర్ ఆరంభం నుంచి ఎక్కువగా కొత్త నటీనటులతోనే పని చేస్తున్నాడు సీనియర్ దర్శకుడు తేజ. ఇప్పుడు కూడా తన కొత్త చిత్రం అహింసతో అభిరామ్, గీతికలను వెండితెరకు పరిచయం చేస్తున్నాడు. కొత్త వాళ్లతో సినిమాలు చేయడానికి.. వాళ్లు ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు అందుబాటులో ఉండటం.. అలాగే తాను ఏం చెబితే అది చేయడం ఒక ముఖ్య కారణం.
దీనికి తోడు పారితోషకాల పరంగా కూడా ఇబ్బంది ఉండదు. కొత్త ఆర్టిస్టులను ఎలా కావాలంటే అలా మౌల్డ్ చేసుకుంటాడని తేజకు పేరుంది. ఈ క్రమంలో వాళ్లను తేజ పెట్టే కష్టం గురించి కూడా ఇండస్ట్రీ జనాలు చర్చించుకుంటూ ఉంటారు. కోపం వస్తే.. చెప్పినట్లు చేయకపోతే తేజ హీరో హీరోయిన్లపై చెయ్యి కూడా చేసుకుంటాడని అంటారు. ఇదే విషయాన్ని అహింస ప్రెస్ మీట్లో ఓ విలేకరి ప్రస్తావిస్తే.. నేను కొట్టడం మీరు చూశారా అంటూ ఎదురు ప్రశ్నించాడు తేజ.
ఐతే అభిరామ్ను తాను టార్చర్ పెట్టిన మాట మాత్రం వాస్తవం అని అంగీకరించాడు. ఆ టార్చర్ ఎలాంటిదో తేజ స్వయంగా వెల్లడించాడు. రామానాయుడు స్టూడియో కింద నుంచి కొండపై వరకు రోజూ సైకిల్ తొక్కమని అభిరామ్కు చెప్పా. నేను చేయలేను అనకుండా ప్రాక్టీస్ చేశాడు.తర్వాత సినిమాలో ఆ సీన్ లేదని తీసేశా. హీరోయిన్ని భుజంపై ఎత్తుకుని, మరో భుజానికి తుపాకులు తగిలించుకుని పరుగెత్తమన్నా. ఆ షాట్ తీస్తుండగా అభిజారి పడి కాలు దెబ్బ తింది.
నాలుగు నెలలు షూట్ ఆపేశాం. గాయం మానాక 50 కిలోల బరువు ఎత్తుకుని కొండ చుట్టూ పరుగెత్తమన్నా. రోజూ పరుగెత్తి వీడియో పెట్టేవాడు. ఇంతకన్నా టార్చర్ ఎవరు పెడతారు? నేను చెప్పినవన్నీ చేయాల్సిన అవసరం అభిరామ్కు లేదు. పెద్ద ఫ్యామిలీ, ప్రొడక్షన్ హౌస్ ఉన్నా నిజాయితీ ఉంది కాబట్టే అభిరామ్ కష్టపడ్డాడు. అందుకే తనతో సినిమా తీశా అని తేజ తెలిపాడు.
This post was last modified on May 31, 2023 1:21 pm
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…
వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…