కెరీర్ ఆరంభం నుంచి ఎక్కువగా కొత్త నటీనటులతోనే పని చేస్తున్నాడు సీనియర్ దర్శకుడు తేజ. ఇప్పుడు కూడా తన కొత్త చిత్రం అహింసతో అభిరామ్, గీతికలను వెండితెరకు పరిచయం చేస్తున్నాడు. కొత్త వాళ్లతో సినిమాలు చేయడానికి.. వాళ్లు ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు అందుబాటులో ఉండటం.. అలాగే తాను ఏం చెబితే అది చేయడం ఒక ముఖ్య కారణం.
దీనికి తోడు పారితోషకాల పరంగా కూడా ఇబ్బంది ఉండదు. కొత్త ఆర్టిస్టులను ఎలా కావాలంటే అలా మౌల్డ్ చేసుకుంటాడని తేజకు పేరుంది. ఈ క్రమంలో వాళ్లను తేజ పెట్టే కష్టం గురించి కూడా ఇండస్ట్రీ జనాలు చర్చించుకుంటూ ఉంటారు. కోపం వస్తే.. చెప్పినట్లు చేయకపోతే తేజ హీరో హీరోయిన్లపై చెయ్యి కూడా చేసుకుంటాడని అంటారు. ఇదే విషయాన్ని అహింస ప్రెస్ మీట్లో ఓ విలేకరి ప్రస్తావిస్తే.. నేను కొట్టడం మీరు చూశారా అంటూ ఎదురు ప్రశ్నించాడు తేజ.
ఐతే అభిరామ్ను తాను టార్చర్ పెట్టిన మాట మాత్రం వాస్తవం అని అంగీకరించాడు. ఆ టార్చర్ ఎలాంటిదో తేజ స్వయంగా వెల్లడించాడు. రామానాయుడు స్టూడియో కింద నుంచి కొండపై వరకు రోజూ సైకిల్ తొక్కమని అభిరామ్కు చెప్పా. నేను చేయలేను అనకుండా ప్రాక్టీస్ చేశాడు.తర్వాత సినిమాలో ఆ సీన్ లేదని తీసేశా. హీరోయిన్ని భుజంపై ఎత్తుకుని, మరో భుజానికి తుపాకులు తగిలించుకుని పరుగెత్తమన్నా. ఆ షాట్ తీస్తుండగా అభిజారి పడి కాలు దెబ్బ తింది.
నాలుగు నెలలు షూట్ ఆపేశాం. గాయం మానాక 50 కిలోల బరువు ఎత్తుకుని కొండ చుట్టూ పరుగెత్తమన్నా. రోజూ పరుగెత్తి వీడియో పెట్టేవాడు. ఇంతకన్నా టార్చర్ ఎవరు పెడతారు? నేను చెప్పినవన్నీ చేయాల్సిన అవసరం అభిరామ్కు లేదు. పెద్ద ఫ్యామిలీ, ప్రొడక్షన్ హౌస్ ఉన్నా నిజాయితీ ఉంది కాబట్టే అభిరామ్ కష్టపడ్డాడు. అందుకే తనతో సినిమా తీశా అని తేజ తెలిపాడు.
This post was last modified on May 31, 2023 1:21 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…