నారప్ప దర్శకుడికి కొత్త బాధ్యత

నిర్మాత కొడుకులే కాదు , లక్షణాలుంటే ఆ కుటుంబంలో ఎవరైనా హీరో అవ్వొచ్చని తాజాగా దిల్ రాజు కుటుంబం నుండి హీరోగా వచ్చిన ఆశిష్ నిరూపించాడు. ఇప్పుడు మరో నిర్మాత కుటుంబం నుండి కొత్త హీరో రాబోతున్నాడు. ‘అఖండ’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి కుటుంబం నుండి ఆయన బావ మరిది సాయి హీరోగా పరిచయం అవుతున్నాడు.

రెండేళ్ళుగా సాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలని ప్లాన్ చేస్తున్న మిరియాల రవీందర్ రెడ్డి ఫైనల్ గా ఆ బాధ్యతను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకి అప్పగించాడు. కుటుంబ కథా చిత్రాలతో ఫ్యామిలీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ అడ్డాల సాయిను హీరోగా పరిచయం చేస్తూ ఓ న్యూ ఏజ్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టిన అడ్డాల నటుడు , నిర్మాత నాగబాబు కొడుకు వరుణ్ తేజను ‘ముకుందా’ తో హీరోగా పరిచయం చేసిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత మహేష్ , వెంకటేశ వంటి స్టార్స్ ను డైరెక్ట్ చేశాడు. ‘నారప్ప’ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న శ్రీకాంత్ అడ్డాల ఇప్పుడు ఈ యూత్ సినిమాతో రాబోతున్నాడు. మరి మిర్యాల రవీందర్ రెడ్డి పెట్టిన బాధ్యత ను శ్రీకాంత్ అడ్డాల ఎలా నిర్వర్తిస్తాడో ? డెబ్యూ హీరో సాయికి ఏ రేంజ్ హిట్ ఇస్తాడో చూడాలి. ఇప్పటికే సినిమా షూటింగ్ సగం పైనే పూర్తయింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ జూన్ 2 న రిలీజ్ చేయనున్నారు.