‘అ!’ అనే వెరైటీ సినిమాతో దర్శకుడిగా పరిచయమై ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆ సినిమా కమర్షియల్గా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోయినా.. అతడికి అవకాశాలకేమీ లోటు లేదు. రెండో సినిమా ‘జాంబి రెడ్డి’ డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మంచి వసూళ్లే రాబట్ట ిహిట్ సినిమాగా నిలిచింది. దీంతో ప్రశాంత్ ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. ఈసారి ‘హనుమాన్’ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా టీజర్ చూసి చాలామంది షాకయ్యారు. లిమిటెడ్ బడ్జెట్లోనే అతను చూపించిన విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీ చర్చనీయాంశంగా మారింది. తెలుగులో అరుదుగా తెరకెక్కే సూపర్ హీరో జానర్ సినిమా కావడంతో దీని కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయడానికి సిద్ధమవుతున్న ప్రశాంత్ వర్మ.. తన సంస్థ నుంచి ఇంకో ఎనిమిది సూపర్ హీరో సినిమాలు రాబోతున్నట్లు వెల్లడించడం విశేషం.
‘‘నాకు చిన్నప్పట్నుంచి సూపర్ హీరోలంటే చాలా ఇష్టం. స్పైడర్ మ్యాన్ సినిమా చూసి నేను కూడా అలా అవ్వాలని ప్రయత్నించా. సాలె పురుగును పట్టుకుని తిరిగా. ఇంటర్నేషనల్ లెవెల్లో సూపర్ హీరో అనేది చాలా పెద్ద కమర్షియల్ జానర్. తెలుగులో అలా మనం ఎందుకు చేయకూడదనే ‘హనుమాన్’ను మొదలుపెట్టా. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి.
ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ కోసమే పది కోట్లు ఖర్చు పెడుతున్నాం. జులై తొలి వారంలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం. రాబోయే పదేళ్లలో ఒక పెద్ద ఫ్రాంఛైజీ క్రియేట్ చేయడంపై మా టీం దృష్టిపెట్టింది. దాదాపు ఎనిమిది సూపర్ హీరో సినిమాలు తీసుకొస్తాం. వీటి కోసమే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్శ్ నెలకొల్పాం. సుమారు వందమందితో హాలీవుడ్ స్టూడియోలా దీన్ని నడపాలని అనుకుంటున్నాం’’ అని ప్రశాంత్ వివరించాడు.
This post was last modified on May 29, 2023 3:17 pm
హీరోల కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ కోసం కూడా కొంతమంది సినిమాలకు వస్తారు. కానీ…
“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…
గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…
జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…
వివాహ నమోదు నిబంధనల్లో మార్పులు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. పెళ్లి నమోదు చేసుకునే జంటలు…