‘అ!’ అనే వెరైటీ సినిమాతో దర్శకుడిగా పరిచయమై ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆ సినిమా కమర్షియల్గా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోయినా.. అతడికి అవకాశాలకేమీ లోటు లేదు. రెండో సినిమా ‘జాంబి రెడ్డి’ డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మంచి వసూళ్లే రాబట్ట ిహిట్ సినిమాగా నిలిచింది. దీంతో ప్రశాంత్ ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. ఈసారి ‘హనుమాన్’ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా టీజర్ చూసి చాలామంది షాకయ్యారు. లిమిటెడ్ బడ్జెట్లోనే అతను చూపించిన విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీ చర్చనీయాంశంగా మారింది. తెలుగులో అరుదుగా తెరకెక్కే సూపర్ హీరో జానర్ సినిమా కావడంతో దీని కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయడానికి సిద్ధమవుతున్న ప్రశాంత్ వర్మ.. తన సంస్థ నుంచి ఇంకో ఎనిమిది సూపర్ హీరో సినిమాలు రాబోతున్నట్లు వెల్లడించడం విశేషం.
‘‘నాకు చిన్నప్పట్నుంచి సూపర్ హీరోలంటే చాలా ఇష్టం. స్పైడర్ మ్యాన్ సినిమా చూసి నేను కూడా అలా అవ్వాలని ప్రయత్నించా. సాలె పురుగును పట్టుకుని తిరిగా. ఇంటర్నేషనల్ లెవెల్లో సూపర్ హీరో అనేది చాలా పెద్ద కమర్షియల్ జానర్. తెలుగులో అలా మనం ఎందుకు చేయకూడదనే ‘హనుమాన్’ను మొదలుపెట్టా. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి.
ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ కోసమే పది కోట్లు ఖర్చు పెడుతున్నాం. జులై తొలి వారంలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం. రాబోయే పదేళ్లలో ఒక పెద్ద ఫ్రాంఛైజీ క్రియేట్ చేయడంపై మా టీం దృష్టిపెట్టింది. దాదాపు ఎనిమిది సూపర్ హీరో సినిమాలు తీసుకొస్తాం. వీటి కోసమే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్శ్ నెలకొల్పాం. సుమారు వందమందితో హాలీవుడ్ స్టూడియోలా దీన్ని నడపాలని అనుకుంటున్నాం’’ అని ప్రశాంత్ వివరించాడు.
This post was last modified on May 29, 2023 3:17 pm
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే…
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…