‘అ!’ అనే వెరైటీ సినిమాతో దర్శకుడిగా పరిచయమై ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆ సినిమా కమర్షియల్గా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోయినా.. అతడికి అవకాశాలకేమీ లోటు లేదు. రెండో సినిమా ‘జాంబి రెడ్డి’ డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మంచి వసూళ్లే రాబట్ట ిహిట్ సినిమాగా నిలిచింది. దీంతో ప్రశాంత్ ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. ఈసారి ‘హనుమాన్’ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా టీజర్ చూసి చాలామంది షాకయ్యారు. లిమిటెడ్ బడ్జెట్లోనే అతను చూపించిన విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీ చర్చనీయాంశంగా మారింది. తెలుగులో అరుదుగా తెరకెక్కే సూపర్ హీరో జానర్ సినిమా కావడంతో దీని కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయడానికి సిద్ధమవుతున్న ప్రశాంత్ వర్మ.. తన సంస్థ నుంచి ఇంకో ఎనిమిది సూపర్ హీరో సినిమాలు రాబోతున్నట్లు వెల్లడించడం విశేషం.
‘‘నాకు చిన్నప్పట్నుంచి సూపర్ హీరోలంటే చాలా ఇష్టం. స్పైడర్ మ్యాన్ సినిమా చూసి నేను కూడా అలా అవ్వాలని ప్రయత్నించా. సాలె పురుగును పట్టుకుని తిరిగా. ఇంటర్నేషనల్ లెవెల్లో సూపర్ హీరో అనేది చాలా పెద్ద కమర్షియల్ జానర్. తెలుగులో అలా మనం ఎందుకు చేయకూడదనే ‘హనుమాన్’ను మొదలుపెట్టా. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి.
ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ కోసమే పది కోట్లు ఖర్చు పెడుతున్నాం. జులై తొలి వారంలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం. రాబోయే పదేళ్లలో ఒక పెద్ద ఫ్రాంఛైజీ క్రియేట్ చేయడంపై మా టీం దృష్టిపెట్టింది. దాదాపు ఎనిమిది సూపర్ హీరో సినిమాలు తీసుకొస్తాం. వీటి కోసమే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్శ్ నెలకొల్పాం. సుమారు వందమందితో హాలీవుడ్ స్టూడియోలా దీన్ని నడపాలని అనుకుంటున్నాం’’ అని ప్రశాంత్ వివరించాడు.
This post was last modified on May 29, 2023 3:17 pm
చిన్న సినిమా వెనుక అగ్ర నిర్మాతలు, హీరోలు ఉండటం వాటికి చాలా పెద్ద బలమవుతుంది. బలగంలో ఎంత గొప్ప కంటెంట్…
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…