Movie News

తెలుగు దర్శకుడు.. 8 సూపర్ హీరో సినిమాలు

‘అ!’ అనే వెరైటీ సినిమాతో దర్శకుడిగా పరిచయమై ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆ సినిమా కమర్షియల్‌గా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోయినా.. అతడికి అవకాశాలకేమీ లోటు లేదు. రెండో సినిమా ‘జాంబి రెడ్డి’ డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మంచి వసూళ్లే రాబట్ట ిహిట్ సినిమాగా నిలిచింది. దీంతో ప్రశాంత్ ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. ఈసారి ‘హనుమాన్’ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా టీజర్ చూసి చాలామంది షాకయ్యారు. లిమిటెడ్ బడ్జెట్లోనే అతను చూపించిన విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీ చర్చనీయాంశంగా మారింది. తెలుగులో అరుదుగా తెరకెక్కే సూపర్ హీరో జానర్ సినిమా కావడంతో దీని కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయడానికి సిద్ధమవుతున్న ప్రశాంత్ వర్మ.. తన సంస్థ నుంచి ఇంకో ఎనిమిది సూపర్ హీరో సినిమాలు రాబోతున్నట్లు వెల్లడించడం విశేషం.

‘‘నాకు చిన్నప్పట్నుంచి సూపర్ హీరోలంటే చాలా ఇష్టం. స్పైడర్ మ్యాన్ సినిమా చూసి నేను కూడా అలా అవ్వాలని ప్రయత్నించా. సాలె పురుగును పట్టుకుని తిరిగా. ఇంటర్నేషనల్ లెవెల్లో సూపర్ హీరో అనేది చాలా పెద్ద కమర్షియల్ జానర్. తెలుగులో అలా మనం ఎందుకు చేయకూడదనే ‘హనుమాన్’ను మొదలుపెట్టా. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి.

ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ కోసమే పది కోట్లు ఖర్చు పెడుతున్నాం. జులై తొలి వారంలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం. రాబోయే పదేళ్లలో ఒక పెద్ద ఫ్రాంఛైజీ క్రియేట్ చేయడంపై మా టీం దృష్టిపెట్టింది. దాదాపు ఎనిమిది సూపర్ హీరో సినిమాలు తీసుకొస్తాం. వీటి కోసమే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్శ్ నెలకొల్పాం. సుమారు వందమందితో హాలీవుడ్ స్టూడియోలా దీన్ని నడపాలని అనుకుంటున్నాం’’ అని ప్రశాంత్ వివరించాడు.

This post was last modified on May 29, 2023 3:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

2 hours ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

5 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

6 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

8 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

8 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

9 hours ago