టాలీవుడ్ యువ కథానాయకుడు నిఖిల్ నెమ్మదిగా పాన్ ఇండియా స్థాయికి ఎదిగిపోతున్నాడు. ఆల్రెడీ ‘కార్తికేయ-2’తో అతడి పేరు జాతీయ స్థాయిలో మార్మోగింది. త్వరలోనే విడుదలయ్యే ‘స్పై’ మూవీ కూడా అతడికి దేశవ్యాప్తంగా క్రేజ్ను పెంచేలా కనిపిస్తోంది. ఇప్పుడు అతను ‘ది ఇండియా హౌస్’ అంటూ మరో పక్కా పాన్ ఇండియా మూవీతో రాబోతున్నాడు.
ఇది స్వాతంత్ర్య సమర యోధుడు వీర్ సావర్కర్ జీవితంతో ముడిపడ్డ కథ అని దీని టీజర్ చూస్తే అర్థమవుతోంది. స్వాతంత్ర్యానంతరం కొన్ని దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ.. ఎప్పుడూ గాంధీ, నెహ్రూలనే గొప్ప స్వాతంత్ర్య సమర యోధులుగా చూపిస్తూ.. వల్లభాయ్ పటేల్, వీర్ సావర్కార్ లాంటి వాళ్లకు చరిత్రలో సరైన ప్రాధాన్యం దక్కుండా చేసిందనే వాదన చేస్తున్న బీజేపీ.. వీరికి వీర లెవెల్లో ఎలివేషన్ ఇస్తోంది ఈ మధ్య. ఈ క్రమంలోనే వీర్ సావర్కర్ మీద వరుసగా సినిమాలు తెరకెక్కుతున్నాయి.
నిఖిల్ ‘ది ఇండియా హౌస్’ను అనౌన్స్ చేసిన సమయంలోనే వీర్ సావర్కర్ జీవిత కథతో మరో సినిమాను అనౌన్స్ చేశారు. హిందీలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పేరు.. ‘స్వాతంత్ర్య వీర్ సావర్కర్’. ఇందులో లీడ్ రోల్ చేస్తున్నది బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా. విశేషం ఏంటంటే.. ఈ సినిమాకు అతనే స్వయంగా దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. సావర్కర్ పాత్ర కోసం అతను బాడీ పెంచి సూపర్ ఫిట్గా తయారయ్యాడు. సావర్కర్ను గొప్ప యోధుడిగా చూపించేలా సినిమాను డిజైన్ చేశారని సావర్కర్ 140వ జయంతి సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ చూస్తే అర్థమవుతుంది.
టీజర్ కూడా రిలీజైందంటే సినిమా షూట్ చాలా వరకు పూర్తయినట్లే. ఈ ఏడాది చివర్లోనే ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఐతే ఇప్పుడే చిత్రీకరణ మొదలుపెట్టుకుంటున్న ‘ది ఇండియా హౌస్’కు ఈ చిత్రం వల్ల ఇబ్బంది తప్పకపోవచ్చు. రణదీప్ చేస్తున్నది బయోపిక్ కాగా.. నిఖిల్ సినిమా సావర్కర్ జీవితంలో ఒక పార్ట్ ఆధారంగా తెరకెక్కనుంది. ఎలా అయినా సరే.. సావర్కర్ మీద ఒక సినిమా వచ్చాక నిఖిల్ సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఉంటుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
This post was last modified on May 29, 2023 3:13 pm
చిన్న సినిమా వెనుక అగ్ర నిర్మాతలు, హీరోలు ఉండటం వాటికి చాలా పెద్ద బలమవుతుంది. బలగంలో ఎంత గొప్ప కంటెంట్…
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…