తగినంత సమయం లేకపోవడంతో ప్రమోషన్ల హడావిడి లేకుండా సైలెంట్ గా వచ్చిన మలయాళం బ్లాక్ బస్టర్ 2018 తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు సాధిస్తోంది. పోటీగా ఉన్న మేం ఫేమస్ పబ్లిసిటీ విషయంలో ఎన్నో అడుగులు ముందంజలో ఉండగా కంటెంట్ పరంగా 2018కే పబ్లిక్ సపోర్ట్ దక్కడంతో వసూళ్లు స్టడీగా పెరుగుతున్నాయి. రెండు రోజులకు మూడు కోట్లకు దగ్గరగా వెళ్లిన వసూళ్లు సోమవారానికి అయిదు కోట్లను టచ్ చేయడం ఖాయమే. అయితే కాంతార టైపులో స్లో పాయిజన్ లాగా భారీగా జనాన్ని థియేటర్లకు తీసుకొస్తుందని నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు
వాస్తవ పరిస్థితి చూస్తే నగరాలూ పట్టణాల సంగతి పక్కనపెడితే బిసి సెంటర్స్ లో 2018 అంత దూకుడుగా లేదు. రివ్యూలు టాక్ లు చాలా పాజిటివ్ గా ఉన్నా సగటు మాస్ కోరుకునే ఎంటర్ టైన్మెంట్, కమర్షియల్ అంశాలు లేకపోవడంతో చిన్న కేంద్రాల్లో పికప్ చాలా స్లోగా ఉంది. కాంతారకు ఇలా జరగలేదు. రెండో రోజే అనూహ్యంగా స్క్రీన్లను పెంచుకుంటూ పోయింది. ప్రేక్షకులు అమాంతం థియేటర్లకు వెళ్లిపోయారు. ఫలితంగా ఎవరూ ఊహించని విధంగా యాభై కోట్ల గ్రాస్ ని దాటేసి ఔరా అనిపించింది. గాడ్ ఫాదర్ లాంటి పోటీని తట్టుకుని మరీ గెలిచింది
2018 విషయంలో మాత్రం అంత స్పీడ్ లేదన్నది వాస్తవం. సూపర్ హిట్ అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు కానీ కాంతారను తాకడమో లేదా దాటడమో జరిగే పనిలా లేదు. సోమవారం నుంచి డ్రాప్ ఎంత శాతంలో ఉండబోతోందనేది కీలకంగా మారనుంది. హైదరాబాద్ లాంటి కేంద్రాల్లో మాత్రం హౌస్ ఫుల్స్ బాగానే నమోదవుతున్నాయి. మొదటి రోజు కోటి, రెండో రోజు కోటి డెబ్భై లక్షలు, మూడో రోజు మరో రెండు కోట్ల పైచిలుకు వచ్చేస్తుంది. కానీ కాంతారాను ఏ కోణంలో చూసినా క్రాస్ చేయడం జరగని పనే. దీని సంగతి ఎలా ఉన్నా 2018 బెస్ట్ డబ్బింగ్ మూవీస్ లో ఒకటిగా నిలిచిపోనుంది
This post was last modified on May 28, 2023 7:24 pm
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…