Movie News

ఇండియా హౌస్ … అప్పుడే వివాదాలు

రామ్ చరణ్ సమర్పణలో వి మెగా బ్యానర్ తో కలిసి అభిషేక్ అగర్వాల్ నిర్మించబోయే ది ఇండియా హౌస్ ప్రకటన రావడం ఆలస్యం వివాదాలు మొదలైపోయాయి. ఇందుకు కారణాలు లేకపోలేదు. పలు కోణాల్లో విశ్లేషిస్తే మ్యాటర్ అర్థమైపోతుంది. టీజర్ లో వీర్ సావర్కర్ పుట్టినరోజు సందర్భంగా అని ఒక చిన్న లైన్ వదిలారు. ఇప్పటికే మే 28న భారతదేశపు కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడం పట్ల కాంగ్రెస్ తో సహా చాలా పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎందరో స్వతంత్ర సమరయోధులు ఉండగా సావర్కర్ నే ఎందుకు హైలైట్ చేస్తున్నారనేది అపోజిషన్ అభ్యంతరం

నిజానికి సావర్కర్ ఆషామాషీ వ్యక్తి కాదు. బ్రిటిషర్ల మీద ఎన్నో పోరాటాలు చేసి జైలుకు వెళ్లిన చరిత్ర ఉంది. వాళ్లకు వ్యతిరేకంగా పుస్తకం రాసినందుకు కారాగారంలో చాలా కాలం మగ్గాల్సి వచ్చింది. అయితే ఇండిపెండెన్స్ వచ్చాక ఆయన పూర్తిగా హిందూ భావజాలం నిండిపోయిన వ్యక్తిగా మారిపోయారు. గాంధీని హత్య చేసిన నాధూరాం గాడ్సేకి గతంలో పేపర్ నడపడానికి ఆశ్రయం కల్పించి ఆ దుర్ఘటన సమయానికి ఇద్దరి మధ్య స్నేహం ఉండేదని కొందరు ఆరోపిస్తున్నారు.ఇంకా బోలెడు విషయాలు ఉన్నాయి కానీ అవన్నీ చెప్పుకుంటూ పోతే పెద్ద బుక్కే అవుతుంది

ఇండియా హౌస్ వేదికగా పలు వ్యూహాలు ఇక్కడే రచించబడ్డాయని చెప్పుకుంటారు. ఇప్పుడు నిఖిల్ సినిమాలో పాయింట్ కూడా ఇదే. కాకపోతే ఏ అంశాన్ని టచ్ చేశారన్నది చెప్పలేదు కానీ సావర్కర్ కు సంబంధించినదే అయ్యుంటుంది కాబట్టి పుట్టినరోజు శుభాకాంక్షలు  చెప్పారనేది మరో వెర్షన్. కేవలం ఫస్ట్ లుక్ కే ఈ ప్యాన్ ఇండియా మూవీ ఇంత సెన్సేషన్ గా మారితే ఇక రిలీజ్ నాటికి ఎలాంటి మలుపలు  తిరుగుతుందో. యూనిట్ వర్గాలు మాత్రం ప్రస్తుతం స్పందించడం లేదు. అసలు రెగ్యులర్ షూటింగ్ మొదలుకాకుండా ఆశించడం భావ్యం కూడా కాదు 

This post was last modified on May 28, 2023 7:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంక్రాంతి ఎఫెక్ట్: హైదరాబాద్ నిల్లు… విజయవాడ ఫుల్లు

సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…

51 minutes ago

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

1 hour ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

2 hours ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

2 hours ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

3 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

3 hours ago