నిన్న రిలీజైన కొత్త సినిమాల్లో అందరి చూపు మేం ఫేమస్, 2018ల మీద ఉండటంతో మిగిలిన వాటి మీద ఆడియన్స్ దృష్టి అంతగా పోలేదు. వాటిలో మెన్ టూ కూడా ఉంది. మైత్రి మూవీ మేకర్స్ సమర్పకుల్లో ఒకరిగా ఉండటం వల్ల థియేట్రికల్ గా ఇంత పోటీలోనో స్క్రీన్లు దొరికాయి. అయితే సరైన రీతిలో ప్రమోషన్లు చేయకపోవడంతో ఓపెనింగ్స్ రాలేదు. దాని తోడు ట్రైలర్ సైతం ఏదో స్పెషల్ కంటెంట్ ఉందనే అభిప్రాయం కలిగించలేదు. శ్రీకాంత్ జి రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ ని ఎవరూ పట్టించుకోలేదు సరే కానీ ఇంతకీ సినిమా ఎలా ఉంది
ఇది ప్రధానంగా నలుగురు మగాళ్ల చుట్టూ తిరిగే కథ. స్టాగ్స్ ఓన్లీ అనే పబ్ లో ఆదిత్య(నరేష్ అగస్త్య), సంజు(కౌశిక్ ఘంటసాల), మున్నా(మౌర్య సిద్ధవరం) రెగ్యులర్ గా కలుసుకుంటూ తమ జీవితంలో అమ్మాయిల వల్ల కలిగిన కష్టాలను పంచుకుంటూ ఉంటారు. ఇక్కడ రాహుల్(వైవా హర్ష) పరిచయమవుతాడు. ఆఫీస్ లో ఫిమేల్ హరాస్మెంట్ బాధితుడు. ఇలా సాగిపోతున్న వీళ్ళ జీవితంలో హఠాత్తుగా ఒక కుదుపు వస్తుంది. అదేంటి తమ సమస్యలను వీళ్లెలా పరిష్కరించుకుని లవర్స్ కి భార్యలకు బుద్ది చెప్పుకున్నారనేది అసలు సినిమాలో చూడాలి.
ఎఫ్2, సేవ్ ది టైగర్స్ తరహా నేపధ్యమే తీసుకున్న శ్రీకాంత్ జి రెడ్డి దాన్ని ఆసక్తికరంగా మలచడంలో ఫెయిలయ్యాడు. ఎక్కడా కూడా ఇంటరెస్టింగ్ అనిపించే సన్నివేశాలు, హాయిగా నవ్వుకునే కామెడీ ఏదీ లేకుండా కేవలం సీన్ల మీద ఆధారపడి అసలు కథను సరిగా రాసుకోలేదు. థియేటర్ కు వచ్చేంత కంటెంట్ కానీ క్యాస్టింగ్ ఇందులో లేదు. అలాంటప్పుడు ఫన్ మీద దృష్టి పెట్టి ఆడియన్స్ ని ఎంగేజ్ చేయగలిగితే కనీసం టార్గెట్ మగ భాధితులకైనా రీచ్ అయ్యేది. ఆ అవకాశాన్ని చేతులారా వృథా చేసుకున్నారు. ఓటిటిలోనే కష్టమనిపించే మెన్ టూకి సారీ చెప్పడం తప్ప ఏం చేయలేం
This post was last modified on May 27, 2023 7:45 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…