Movie News

నాని మీద దృశ్యం దర్శకుడి కన్ను

దసరా బ్లాక్ బస్టర్ తర్వాత మంచి ఊపుమీదున్న న్యాచురల్ స్టార్ నాని డెబ్యూ దర్శకుడు శౌర్యవ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. తండ్రి కూతుళ్ళ పాప సెంటిమెంట్ తో రూపొందుతున్న ఈ ఎమోషనల్ డ్రామాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ విడుదలకు ప్లాన్ చేసుకున్నారు. ఇది అయ్యాక నాని ఎవరితో చేస్తాడనే క్లారిటీ ఇంకా రాలేదు. లేటెస్ట్ లీక్ ప్రకారం మలయాళం దృశ్యం సృష్టించిన జీతూ జోసెఫ్ తనకో లైన్ వినిపించినట్టు ఇన్ సైడ్ టాక్. ఇటీవలే ఒక రౌండ్ డిస్కషన్ అయ్యిందని ఏం చేయాలో కంక్లూజన్ కు మాత్రం రాలేదట.

జీతూ జోసెఫ్ ప్రస్తుతం మోహన్ లాల్ తో రామ్ అనే రెండు భాగాల భారీ చిత్రం తీస్తున్నారు. ఇది కూడా థ్రిల్లరే. ఈ కాంబినేషన్ లో రూపొంది డైరెక్టర్ ఓటిటిలో రిలీజైన 12త్ మ్యాన్ ఆశించిన ఫలితం అందుకోలేదు. అందుకే దృశ్యం మేజిక్ మరోసారి రిపీట్ చేసే కసితో ఉన్నారు. ఇదిలా ఉండగా నానికి చెప్పిన స్టోరీ జీతూ జోసెఫ్ గత చిత్రం కూమన్ రీమేక్ గా మరో ప్రచారం వినిపిస్తోంది. ఇది గత నవంబర్ థియేటర్లలో రిలీజై మంచి సక్సెస్ అందుకుంది. పోలీస్ స్టేషన్ బ్యాక్ డ్రాప్ లో మంచి క్రైమ్ సస్పెన్స్ గా పేరు తెచ్చుకుంది. ఇదే నానికి చెప్పి ఉండొచ్చట.

ఇదంతా అనఫీషియల్ న్యూస్ కాబట్టి కన్ఫర్మేషన్ వచ్చే దాకా ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే రామ్ ఫినిష్ చేశాక జీతూ జోసెఫ్ దృశ్యం 3 ప్లాన్ లో ఉన్నారు. ఒకేసారి మోహన్ లాల్, వెంకటేష్, అజయ్ దేవగన్, రవిచంద్రన్ లతో నాలుగు భాషల్లో ఏకకాలంలో తీసి ఒకేసారి రిలీజ్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. హై బడ్జెట్ కాదు కాబట్టి ఇదేమంత కష్టం కాదు కానీ డేట్లు కోఆర్డినేట్ చేసుకుని తెరకెక్కించడం కొంచెం కష్టమే. ఒకవేళ లేట్ అయ్యే పక్షంలో నానితో ఓ చిత్రం తెరకెక్కించాలని జీతూ ఆలోచన. నిజమైతే న్యాచుల్ స్టార్ కో క్రేజీ ప్రాజెక్ట్ దొరికినట్టే 

This post was last modified on May 27, 2023 4:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

6 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

8 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

8 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

9 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

9 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

11 hours ago