దసరా బ్లాక్ బస్టర్ తర్వాత మంచి ఊపుమీదున్న న్యాచురల్ స్టార్ నాని డెబ్యూ దర్శకుడు శౌర్యవ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. తండ్రి కూతుళ్ళ పాప సెంటిమెంట్ తో రూపొందుతున్న ఈ ఎమోషనల్ డ్రామాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ విడుదలకు ప్లాన్ చేసుకున్నారు. ఇది అయ్యాక నాని ఎవరితో చేస్తాడనే క్లారిటీ ఇంకా రాలేదు. లేటెస్ట్ లీక్ ప్రకారం మలయాళం దృశ్యం సృష్టించిన జీతూ జోసెఫ్ తనకో లైన్ వినిపించినట్టు ఇన్ సైడ్ టాక్. ఇటీవలే ఒక రౌండ్ డిస్కషన్ అయ్యిందని ఏం చేయాలో కంక్లూజన్ కు మాత్రం రాలేదట.
జీతూ జోసెఫ్ ప్రస్తుతం మోహన్ లాల్ తో రామ్ అనే రెండు భాగాల భారీ చిత్రం తీస్తున్నారు. ఇది కూడా థ్రిల్లరే. ఈ కాంబినేషన్ లో రూపొంది డైరెక్టర్ ఓటిటిలో రిలీజైన 12త్ మ్యాన్ ఆశించిన ఫలితం అందుకోలేదు. అందుకే దృశ్యం మేజిక్ మరోసారి రిపీట్ చేసే కసితో ఉన్నారు. ఇదిలా ఉండగా నానికి చెప్పిన స్టోరీ జీతూ జోసెఫ్ గత చిత్రం కూమన్ రీమేక్ గా మరో ప్రచారం వినిపిస్తోంది. ఇది గత నవంబర్ థియేటర్లలో రిలీజై మంచి సక్సెస్ అందుకుంది. పోలీస్ స్టేషన్ బ్యాక్ డ్రాప్ లో మంచి క్రైమ్ సస్పెన్స్ గా పేరు తెచ్చుకుంది. ఇదే నానికి చెప్పి ఉండొచ్చట.
ఇదంతా అనఫీషియల్ న్యూస్ కాబట్టి కన్ఫర్మేషన్ వచ్చే దాకా ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే రామ్ ఫినిష్ చేశాక జీతూ జోసెఫ్ దృశ్యం 3 ప్లాన్ లో ఉన్నారు. ఒకేసారి మోహన్ లాల్, వెంకటేష్, అజయ్ దేవగన్, రవిచంద్రన్ లతో నాలుగు భాషల్లో ఏకకాలంలో తీసి ఒకేసారి రిలీజ్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. హై బడ్జెట్ కాదు కాబట్టి ఇదేమంత కష్టం కాదు కానీ డేట్లు కోఆర్డినేట్ చేసుకుని తెరకెక్కించడం కొంచెం కష్టమే. ఒకవేళ లేట్ అయ్యే పక్షంలో నానితో ఓ చిత్రం తెరకెక్కించాలని జీతూ ఆలోచన. నిజమైతే న్యాచుల్ స్టార్ కో క్రేజీ ప్రాజెక్ట్ దొరికినట్టే
This post was last modified on May 27, 2023 4:45 pm
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ…
చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…