Movie News

నాని మీద దృశ్యం దర్శకుడి కన్ను

దసరా బ్లాక్ బస్టర్ తర్వాత మంచి ఊపుమీదున్న న్యాచురల్ స్టార్ నాని డెబ్యూ దర్శకుడు శౌర్యవ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. తండ్రి కూతుళ్ళ పాప సెంటిమెంట్ తో రూపొందుతున్న ఈ ఎమోషనల్ డ్రామాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ విడుదలకు ప్లాన్ చేసుకున్నారు. ఇది అయ్యాక నాని ఎవరితో చేస్తాడనే క్లారిటీ ఇంకా రాలేదు. లేటెస్ట్ లీక్ ప్రకారం మలయాళం దృశ్యం సృష్టించిన జీతూ జోసెఫ్ తనకో లైన్ వినిపించినట్టు ఇన్ సైడ్ టాక్. ఇటీవలే ఒక రౌండ్ డిస్కషన్ అయ్యిందని ఏం చేయాలో కంక్లూజన్ కు మాత్రం రాలేదట.

జీతూ జోసెఫ్ ప్రస్తుతం మోహన్ లాల్ తో రామ్ అనే రెండు భాగాల భారీ చిత్రం తీస్తున్నారు. ఇది కూడా థ్రిల్లరే. ఈ కాంబినేషన్ లో రూపొంది డైరెక్టర్ ఓటిటిలో రిలీజైన 12త్ మ్యాన్ ఆశించిన ఫలితం అందుకోలేదు. అందుకే దృశ్యం మేజిక్ మరోసారి రిపీట్ చేసే కసితో ఉన్నారు. ఇదిలా ఉండగా నానికి చెప్పిన స్టోరీ జీతూ జోసెఫ్ గత చిత్రం కూమన్ రీమేక్ గా మరో ప్రచారం వినిపిస్తోంది. ఇది గత నవంబర్ థియేటర్లలో రిలీజై మంచి సక్సెస్ అందుకుంది. పోలీస్ స్టేషన్ బ్యాక్ డ్రాప్ లో మంచి క్రైమ్ సస్పెన్స్ గా పేరు తెచ్చుకుంది. ఇదే నానికి చెప్పి ఉండొచ్చట.

ఇదంతా అనఫీషియల్ న్యూస్ కాబట్టి కన్ఫర్మేషన్ వచ్చే దాకా ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే రామ్ ఫినిష్ చేశాక జీతూ జోసెఫ్ దృశ్యం 3 ప్లాన్ లో ఉన్నారు. ఒకేసారి మోహన్ లాల్, వెంకటేష్, అజయ్ దేవగన్, రవిచంద్రన్ లతో నాలుగు భాషల్లో ఏకకాలంలో తీసి ఒకేసారి రిలీజ్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. హై బడ్జెట్ కాదు కాబట్టి ఇదేమంత కష్టం కాదు కానీ డేట్లు కోఆర్డినేట్ చేసుకుని తెరకెక్కించడం కొంచెం కష్టమే. ఒకవేళ లేట్ అయ్యే పక్షంలో నానితో ఓ చిత్రం తెరకెక్కించాలని జీతూ ఆలోచన. నిజమైతే న్యాచుల్ స్టార్ కో క్రేజీ ప్రాజెక్ట్ దొరికినట్టే 

Satya

Recent Posts

బాబోయ్.. డిటర్జెంట్‌ పొడితో 2.3 కోట్ల లీటర్ల పాలు తయారు?

 మహారాష్ట్రలో భారీ పాల కల్తీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ధారాశివ్ జిల్లా భూమ్ తాలూకాలో పోలీసులు, ఆహార భద్రత-ఔషధ పరిపాలన…

4 hours ago

ప్రపంచమంతా ఎదురు చూస్తున్న ‘ది ఒడిస్సీ’

ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…

5 hours ago

‘ఎన్టీఆర్ పేరుతో ప్రెస్ నోట్… సంతకం ఎక్కడ?’

ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేప‌డుతున్న సేవా కార్య‌క్ర‌మాల వ్య‌వ‌హారం ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి…

5 hours ago

అనుకూలమైన తీర్పు కోసం జడ్జి కుర్చీపైనే చేతబడి…!

న్యాయస్థానంలో సాక్ష్యాధారాలే కీలకం. మూఢనమ్మకాలతో చట్టాన్ని ప్రభావితం చేయలేరు... అయితే అమాయకత్వమో.. మరి ఏమో కానీ తీర్పు తనకు అనుకూలంగా…

5 hours ago

త్రివిక్రమ్ కోసం బ్రేస్‌లెట్ తాకట్టు

సినీ రంగంలో గొప్ప స్థాయికి చేరుకున్న చాలామంది దర్శకులు ఒకప్పుడు అనామకులే. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అవకాశాల కోసం కాళ్లరిగేలా…

5 hours ago

ఏం పాపం చేశారని… చిన్నారులనూ చిదిమేస్తున్నారు

ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు…

6 hours ago