వచ్చే వారం ఇద్దరు కుర్ర హీరోలు తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయమవుతున్న ‘అహింస’ తో పాటు , బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కిన ‘నేను స్టూడెంట్ సర్’ కూడా థియేటర్స్ లోకి రాబోతుంది. అయితే ఈ ఇద్దరిలో ఒకరు రాణా తమ్ముడు కాగా , మరొకరు బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు అనే విషయం తెలిసిందే. ఇలా హీరోల తమ్ముళ్ళు ఒకే రోజు డిఫరెంట్ మూవీస్ తో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నారు.
అభిరామ్ ‘అహింస’ తో పాటు ‘నేను స్టూడెంట్ సర్’ కూడా ఇప్పటికే ఒక డేట్ అనుకొని మళ్ళీ వాయిదా పడిన సినిమానే. ఇప్పుడు సరైన టైమ్ చూసుకొని ఈ రెండు సినిమాలను రిలీజ్ చేస్తున్నారు నిర్మాతలు. వచ్చే శుక్రవారం అంటే జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణాలో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో కుర్ర హీరోలకి ఇది మంచి డేట్ అని చెప్పవచ్చు.
కంటెంట్ తో అలరించి, హిట్ టాక్ తెచ్చుకుంటే సెలవు రోజు కనుక నైజాంలో మ్యాట్నీ నుండే కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. తేజ దర్శకత్వంలో అభిరామ్ నటించిన ‘అహింస’ కంటే రాకేశ్ అనే కొత్త దర్శకుడు తీసిన ‘నేను స్టూడెంట్ సర్’ అనే సినిమా కంటెంట్ పరంగా ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది. కాకపోతే మొదటి రోజు మార్నింగ్ షోకి ఆడియన్స్ ను రప్పించే స్టామినా ఈ ఇద్దరు కుర్ర హీరోలకి లేదు, టాక్ మీదే రిజల్ట్ ఆధారపడి ఉంది.
This post was last modified on May 26, 2023 6:47 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…