వచ్చే వారం ఇద్దరు కుర్ర హీరోలు తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయమవుతున్న ‘అహింస’ తో పాటు , బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కిన ‘నేను స్టూడెంట్ సర్’ కూడా థియేటర్స్ లోకి రాబోతుంది. అయితే ఈ ఇద్దరిలో ఒకరు రాణా తమ్ముడు కాగా , మరొకరు బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు అనే విషయం తెలిసిందే. ఇలా హీరోల తమ్ముళ్ళు ఒకే రోజు డిఫరెంట్ మూవీస్ తో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నారు.
అభిరామ్ ‘అహింస’ తో పాటు ‘నేను స్టూడెంట్ సర్’ కూడా ఇప్పటికే ఒక డేట్ అనుకొని మళ్ళీ వాయిదా పడిన సినిమానే. ఇప్పుడు సరైన టైమ్ చూసుకొని ఈ రెండు సినిమాలను రిలీజ్ చేస్తున్నారు నిర్మాతలు. వచ్చే శుక్రవారం అంటే జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణాలో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో కుర్ర హీరోలకి ఇది మంచి డేట్ అని చెప్పవచ్చు.
కంటెంట్ తో అలరించి, హిట్ టాక్ తెచ్చుకుంటే సెలవు రోజు కనుక నైజాంలో మ్యాట్నీ నుండే కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. తేజ దర్శకత్వంలో అభిరామ్ నటించిన ‘అహింస’ కంటే రాకేశ్ అనే కొత్త దర్శకుడు తీసిన ‘నేను స్టూడెంట్ సర్’ అనే సినిమా కంటెంట్ పరంగా ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది. కాకపోతే మొదటి రోజు మార్నింగ్ షోకి ఆడియన్స్ ను రప్పించే స్టామినా ఈ ఇద్దరు కుర్ర హీరోలకి లేదు, టాక్ మీదే రిజల్ట్ ఆధారపడి ఉంది.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…