వచ్చే వారం ఇద్దరు కుర్ర హీరోలు తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయమవుతున్న ‘అహింస’ తో పాటు , బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కిన ‘నేను స్టూడెంట్ సర్’ కూడా థియేటర్స్ లోకి రాబోతుంది. అయితే ఈ ఇద్దరిలో ఒకరు రాణా తమ్ముడు కాగా , మరొకరు బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు అనే విషయం తెలిసిందే. ఇలా హీరోల తమ్ముళ్ళు ఒకే రోజు డిఫరెంట్ మూవీస్ తో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నారు.
అభిరామ్ ‘అహింస’ తో పాటు ‘నేను స్టూడెంట్ సర్’ కూడా ఇప్పటికే ఒక డేట్ అనుకొని మళ్ళీ వాయిదా పడిన సినిమానే. ఇప్పుడు సరైన టైమ్ చూసుకొని ఈ రెండు సినిమాలను రిలీజ్ చేస్తున్నారు నిర్మాతలు. వచ్చే శుక్రవారం అంటే జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణాలో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో కుర్ర హీరోలకి ఇది మంచి డేట్ అని చెప్పవచ్చు.
కంటెంట్ తో అలరించి, హిట్ టాక్ తెచ్చుకుంటే సెలవు రోజు కనుక నైజాంలో మ్యాట్నీ నుండే కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. తేజ దర్శకత్వంలో అభిరామ్ నటించిన ‘అహింస’ కంటే రాకేశ్ అనే కొత్త దర్శకుడు తీసిన ‘నేను స్టూడెంట్ సర్’ అనే సినిమా కంటెంట్ పరంగా ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది. కాకపోతే మొదటి రోజు మార్నింగ్ షోకి ఆడియన్స్ ను రప్పించే స్టామినా ఈ ఇద్దరు కుర్ర హీరోలకి లేదు, టాక్ మీదే రిజల్ట్ ఆధారపడి ఉంది.
This post was last modified on May 26, 2023 6:47 pm
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళ భాషలో మాట్లాడి అక్కడి ప్రజలను ఆకట్టుకున్నారు. కోయంబత్తూరులో…
ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ కు ఒక అలవాటు ఉంది.. అదే 'స్లో స్టార్ట్ అండ్ డెడ్లీ ఫినిష్'. ఈ…
నాని ప్యారడైజ్ మీద అంచనాల గురించి ప్రత్యేకంగా మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఆగస్ట్ 21 విడుదల కోసం అభిమానులే కాదు మూవీ…
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ తో 40 ఏళ్ల బంధాన్ని వీడి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరిన సీనియర్…
ఒక డిజాస్టర్ పడితే చాలు దర్శకుడి ట్రాక్ రికార్డు గతంలో ఎంత ఉందనేది నిర్మాతలు పట్టించుకోరు. అందులోనూ వెటరన్ డైరెక్టర్స్…
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఏపీ సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్ గా…