Movie News

అన్ని డబ్బులిచ్చి పీఎస్ 2 చూస్తారా

చెప్పా పెట్టకుండా పొన్నియిన్ సెల్వన్ 2 అమెజాన్ ప్రైమ్ లో నిన్న అర్ధరాత్రి నుంచి  స్ట్రీమింగ్ మొదలయిపోయింది. అయితే ఎప్పటిలాగే ఇప్పుడూ ట్విస్టు ఇచ్చారు. మెంబెర్ షిప్ ఉన్నా సరే ఈ సినిమా చూడాలంటే అక్షరాలా 399 రూపాయలు చెల్లించాలి. కాకపోతే వంద రూపాయలు క్యాష్ బ్యాక్ రూపంలో వెనక్కు ఇస్తారు. అకౌంట్ లేకపోతే పూర్తిగా కట్టాలి. అది కూడా షో మొదలుపెట్టిన నలభై ఎనిమిది గంటల్లో  పూర్తి చేయకపోతే లింక్ పని చేయదు. ఇంత ఖరీదు ఎందుకయ్యా అంటే రిలీజై కేవలం నెల రోజులే  అయ్యింది కాబట్టి ఆ ప్రత్యేక సౌలభ్యం కోసం ఈ ధరన్న మాట

అన్ని భాషల్లోనూ పీఎస్ 2 అందుబాటులో ఉంచారు. తమిళం సంగతేమో కానీ తెలుగులో మాత్రం సెకండ్ పార్ట్ ఫ్లాప్ గానే మిగిలింది. అంచనాను అందుకోలేక బ్రేక్ ఈవెన్ కి దూరంగా నిలిచిపోయింది. ఒకరకంగా చెప్పాలంటే పొన్నియిన్ సెల్వన్ 1కే మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు థియేటర్ రన్ ముగింపుకొచ్చిన తరుణంలో ఇప్పుడీ ఓటిటి రిలీజ్ వల్ల వచ్చిన లాభం కానీ నష్టం కానీ ఏమీ లేదు. కాకపోతే ఏ యాభై వంద కాకుండా ఇలా నాలుగేసి వందలంటే మాత్రం అన్యాయమే అంటున్నారు ఫ్యాన్స్. పైరసీ జడలు విరబోసుకున్న టైంలో ఇలా చేయడం వర్కౌట్ కాదు

నిజానికి అమెజాన్ ప్రైమ్ ఈ పే పర్ వ్యూ మోడల్ ని భారతీయ కస్టమర్లకు అలవాటు చేసేందుకు విపరీతంగా ప్రయత్నిస్తోంది. హిందీ సినిమాలను సైతం ఇదే తరహాలో డబ్బులిచ్చి చూడమని ఎర్లీ ప్రీమియర్ల పేరుతో టెంప్ట్ చేస్తోంది. ఇటీవలే అజయ్ దేవగన్ భోళా ఇలాగే వస్తే పెద్దగా స్పందన లేకపోవడంతో నిన్నటి నుంచి జనరల్ స్ట్రీమింగ్ కి వదిలేశారు. అయిదారు నెలల క్రితం వచ్చిన హాలీవుడ్ మూవీస్ కి మాత్రం ప్రైమ్ ఇదే ధోరణి కొనసాగిస్తోంది. రాబోయే రోజుల్లో ప్రీమియమ్ కంటెంట్ కోసం ఖచ్చితంగా డబ్బులిచ్చే చూడాల్సిన పరిస్థితి తలెత్తడం ఖాయమే అనిపిస్తుంది  

This post was last modified on May 26, 2023 10:05 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

1 hour ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago