చెప్పా పెట్టకుండా పొన్నియిన్ సెల్వన్ 2 అమెజాన్ ప్రైమ్ లో నిన్న అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ మొదలయిపోయింది. అయితే ఎప్పటిలాగే ఇప్పుడూ ట్విస్టు ఇచ్చారు. మెంబెర్ షిప్ ఉన్నా సరే ఈ సినిమా చూడాలంటే అక్షరాలా 399 రూపాయలు చెల్లించాలి. కాకపోతే వంద రూపాయలు క్యాష్ బ్యాక్ రూపంలో వెనక్కు ఇస్తారు. అకౌంట్ లేకపోతే పూర్తిగా కట్టాలి. అది కూడా షో మొదలుపెట్టిన నలభై ఎనిమిది గంటల్లో పూర్తి చేయకపోతే లింక్ పని చేయదు. ఇంత ఖరీదు ఎందుకయ్యా అంటే రిలీజై కేవలం నెల రోజులే అయ్యింది కాబట్టి ఆ ప్రత్యేక సౌలభ్యం కోసం ఈ ధరన్న మాట
అన్ని భాషల్లోనూ పీఎస్ 2 అందుబాటులో ఉంచారు. తమిళం సంగతేమో కానీ తెలుగులో మాత్రం సెకండ్ పార్ట్ ఫ్లాప్ గానే మిగిలింది. అంచనాను అందుకోలేక బ్రేక్ ఈవెన్ కి దూరంగా నిలిచిపోయింది. ఒకరకంగా చెప్పాలంటే పొన్నియిన్ సెల్వన్ 1కే మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు థియేటర్ రన్ ముగింపుకొచ్చిన తరుణంలో ఇప్పుడీ ఓటిటి రిలీజ్ వల్ల వచ్చిన లాభం కానీ నష్టం కానీ ఏమీ లేదు. కాకపోతే ఏ యాభై వంద కాకుండా ఇలా నాలుగేసి వందలంటే మాత్రం అన్యాయమే అంటున్నారు ఫ్యాన్స్. పైరసీ జడలు విరబోసుకున్న టైంలో ఇలా చేయడం వర్కౌట్ కాదు
నిజానికి అమెజాన్ ప్రైమ్ ఈ పే పర్ వ్యూ మోడల్ ని భారతీయ కస్టమర్లకు అలవాటు చేసేందుకు విపరీతంగా ప్రయత్నిస్తోంది. హిందీ సినిమాలను సైతం ఇదే తరహాలో డబ్బులిచ్చి చూడమని ఎర్లీ ప్రీమియర్ల పేరుతో టెంప్ట్ చేస్తోంది. ఇటీవలే అజయ్ దేవగన్ భోళా ఇలాగే వస్తే పెద్దగా స్పందన లేకపోవడంతో నిన్నటి నుంచి జనరల్ స్ట్రీమింగ్ కి వదిలేశారు. అయిదారు నెలల క్రితం వచ్చిన హాలీవుడ్ మూవీస్ కి మాత్రం ప్రైమ్ ఇదే ధోరణి కొనసాగిస్తోంది. రాబోయే రోజుల్లో ప్రీమియమ్ కంటెంట్ కోసం ఖచ్చితంగా డబ్బులిచ్చే చూడాల్సిన పరిస్థితి తలెత్తడం ఖాయమే అనిపిస్తుంది
ది రాజా సాబ్ తర్వాత దాన్ని మర్చిపోయే సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. వాళ్ళు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో ఇప్పటిదాకా బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకులు తెలుగువాళ్లే. ఆర్య తీసిన సుకుమార్,…
రష్యా నుంచి ముడి చమురు (ఆయిల్) కొనుగోలు చేస్తున్న దేశాలకు అమెరికా గట్టి షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది. రష్యా…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి చెందిన సంగతి తెలిసిందే. గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో సతమతం…
ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…
మహారాష్ట్రలో భారీ పాల కల్తీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ధారాశివ్ జిల్లా భూమ్ తాలూకాలో పోలీసులు, ఆహార భద్రత-ఔషధ పరిపాలన…