Movie News

అన్ని డబ్బులిచ్చి పీఎస్ 2 చూస్తారా

చెప్పా పెట్టకుండా పొన్నియిన్ సెల్వన్ 2 అమెజాన్ ప్రైమ్ లో నిన్న అర్ధరాత్రి నుంచి  స్ట్రీమింగ్ మొదలయిపోయింది. అయితే ఎప్పటిలాగే ఇప్పుడూ ట్విస్టు ఇచ్చారు. మెంబెర్ షిప్ ఉన్నా సరే ఈ సినిమా చూడాలంటే అక్షరాలా 399 రూపాయలు చెల్లించాలి. కాకపోతే వంద రూపాయలు క్యాష్ బ్యాక్ రూపంలో వెనక్కు ఇస్తారు. అకౌంట్ లేకపోతే పూర్తిగా కట్టాలి. అది కూడా షో మొదలుపెట్టిన నలభై ఎనిమిది గంటల్లో  పూర్తి చేయకపోతే లింక్ పని చేయదు. ఇంత ఖరీదు ఎందుకయ్యా అంటే రిలీజై కేవలం నెల రోజులే  అయ్యింది కాబట్టి ఆ ప్రత్యేక సౌలభ్యం కోసం ఈ ధరన్న మాట

అన్ని భాషల్లోనూ పీఎస్ 2 అందుబాటులో ఉంచారు. తమిళం సంగతేమో కానీ తెలుగులో మాత్రం సెకండ్ పార్ట్ ఫ్లాప్ గానే మిగిలింది. అంచనాను అందుకోలేక బ్రేక్ ఈవెన్ కి దూరంగా నిలిచిపోయింది. ఒకరకంగా చెప్పాలంటే పొన్నియిన్ సెల్వన్ 1కే మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు థియేటర్ రన్ ముగింపుకొచ్చిన తరుణంలో ఇప్పుడీ ఓటిటి రిలీజ్ వల్ల వచ్చిన లాభం కానీ నష్టం కానీ ఏమీ లేదు. కాకపోతే ఏ యాభై వంద కాకుండా ఇలా నాలుగేసి వందలంటే మాత్రం అన్యాయమే అంటున్నారు ఫ్యాన్స్. పైరసీ జడలు విరబోసుకున్న టైంలో ఇలా చేయడం వర్కౌట్ కాదు

నిజానికి అమెజాన్ ప్రైమ్ ఈ పే పర్ వ్యూ మోడల్ ని భారతీయ కస్టమర్లకు అలవాటు చేసేందుకు విపరీతంగా ప్రయత్నిస్తోంది. హిందీ సినిమాలను సైతం ఇదే తరహాలో డబ్బులిచ్చి చూడమని ఎర్లీ ప్రీమియర్ల పేరుతో టెంప్ట్ చేస్తోంది. ఇటీవలే అజయ్ దేవగన్ భోళా ఇలాగే వస్తే పెద్దగా స్పందన లేకపోవడంతో నిన్నటి నుంచి జనరల్ స్ట్రీమింగ్ కి వదిలేశారు. అయిదారు నెలల క్రితం వచ్చిన హాలీవుడ్ మూవీస్ కి మాత్రం ప్రైమ్ ఇదే ధోరణి కొనసాగిస్తోంది. రాబోయే రోజుల్లో ప్రీమియమ్ కంటెంట్ కోసం ఖచ్చితంగా డబ్బులిచ్చే చూడాల్సిన పరిస్థితి తలెత్తడం ఖాయమే అనిపిస్తుంది  

This post was last modified on May 26, 2023 10:05 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

2 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

2 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

2 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

4 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

5 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

5 hours ago