ఇంకో ఇరవై నాలుగు గంటల కన్నా తక్కువ వ్యవధిలో విడుదల కాబోతున్న మళ్ళీ పెళ్లిని ఆపాలంటూ నరేష్ భార్య రమ్య రఘుపతి కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో కేసు వేయడం హఠాత్ పరిణామం. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఎలాంటి జడ్జ్ మెంట్ ఇస్తుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే చివరి నిమిషంలో జరిగే ఇలాంటి వాటికి సానుకూల తీర్పు రావడం చాలా తక్కువ. ఒకవేళ ఆవిడ రిలీజ్ డేట్ ప్రకటించినప్పుడో లేదా ట్రైలర్ వచ్చినప్పుడో ఈ పని చేసి ఉంటే తగినంత సమయం ఉండేది కాబట్టి పాజిటివ్ గా ఆశించవచ్చు. ఇప్పుడు కష్టమేనని చెప్పాలి.
ఇదంతా నిర్మాత కం నరేష్ ఊహించలేక కాదు. అందుకే ముందు నుంచి ఇది తన నిజ జీవిత కథని చెప్పకుండా జాగ్రత్తగా మాట్లాడుతూ వచ్చారు. మీడియా నొక్కి అడిగినా సరే ఇది కల్పితం అన్నట్టుగానే దర్శకుడు ఎంఎం రాజు అన్నారు కానీ జరిగిందే చూపిస్తున్నామని చెప్పలేదు. అయితే ట్రైలర్ చూసిన ఎవరికైనా అది దేని గురించో చాలా సులభంగా గుర్తించేలా క్లూస్ ఇచ్చారు. పైగా కృష్ణ గారితో సహా అందరి ప్రస్తావన అందులో ఉంది. కాకపోతే మారుపేర్లు ఉంటాయి అంతే. గత రెండు వారాలుగా నరేష్ పవిత్ర లోకేష్ దీని కోసం నాన్ స్టాప్ గా విస్తృత ప్రమోషన్లు చేశారు
ఇంత చేసినా బుకింగ్స్ ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. నేరుగా థియేటర్ కు వచ్చి చూసేవాళ్ల మీద దీని భవితవ్యం ఆధారపడి ఉంది. నరేష్ పవిత్రల బంధం గురించి ఆన్ లైన్ లో ఎంత ఆసక్తి చూపించినా అదే రిలేషన్ కి టికెట్లు కొని మరీ చూసేంత స్థాయిలో హైప్ లేదన్నది వాస్తవం. ఇది గుర్తించే నరేష్ వీలైనంత బజ్ తెచ్చేందుకు ఎంత చేయాలో అంతా చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవిత్రని హగ్ చేసుకుని ముద్దు పెట్టుకున్నారు. తన లవ్ స్టోరీని పదే పదే చెప్పుకున్నారు. మరి ఈ కేసు ఏమైనా ఝలక్ ఇస్తుందో ఏమైనా సాఫీగా విడుదలకు మార్గం సుగమం చేస్తుందో చూడాలి
This post was last modified on May 25, 2023 3:04 pm
తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. 2023లో జరిగిన మూడో ఎన్నికలో ఆ…
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయ తెరంగేట్రం ఆదిలోనే కష్టనష్టాలను చవిచూసింది. ఎన్నికలకు కాస్తంత ముందుగా కరూర్ లో…
ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…
అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…