అల వైకుంఠపురములో.. టాలీవుడ్ చరిత్రలోనే ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లలో ఈ సినిమా ఒకటి. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన ఈ చిత్రం ఓ మోస్తరు అంచనాలతోనే విడుదలై బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. చూడ్డానికి మామూలు సినిమాగా అనిపిస్తూనే.. చాలా ప్లెజెంట్గా సాగుతూ.. ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతుందీ చిత్రం.
సినిమాలో వినోదానికి తోడు అదిరిపోయే పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. టీంలో ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చారు. ప్రేక్షకులు కూడా అందుకు తగ్గ ఫలితాన్నే అందించారు. ఈ సినిమాకు పని చేసిన మెయిన్ కాస్ట్ అండ్ క్రూ కలిసి మళ్లీ ఓ చిత్రం చేయబోతున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ ఓ సినిమాను నిర్మించబోతున్నట్లు సమాచారం. త్రివిక్రమ్తో బన్నీ మరో సినిమా చేస్తాడని ముందు నుంచే సంకేతాలు వస్తున్నాయి.
ఇటీవలే వీళ్లిద్దరూ ఒక కథ విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. బన్నీ, త్రివిక్రమ్ కలిసి గతంలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చేసినప్పటికీ.. వీరి కలయిక అనగానే ఇప్పుడు ‘అల..’నే గుర్తుకు వస్తోంది. దీంతో ప్రేక్షకులు సరిగ్గా అలాంటి సినిమానే కోరుకుంటారు.
ఈ నేపథ్యంలోనే గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు మరోసారి చేతులు కలుపుతున్నాయి. ఆటోమేటిగ్గా తమనే ఈ చిత్రానికి సంగీతం కూడా అందిస్తాడని భావించవచ్చు. మరి కథానాయికగా పూజా హెగ్డేనే కొనసాగుతుందా లేదా అన్నదే చూడాలి. త్రివిక్రమ్ వరుసగా మూడు చిత్రాల్లో ఆమెకు అవకాశం ఇచ్చాడు. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు రూపొందిస్తున్న చిత్రంలో పూజానే కథానాయిక అన్నది తెలిసిందే. ‘పుష్ప-2’ పూర్తి చేసిన వెంటనే త్రివిక్రమ్ సినిమాను బన్నీ పట్టాలెక్కిస్తాడు.
This post was last modified on May 25, 2023 6:44 am
కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…