అల వైకుంఠపురములో.. టాలీవుడ్ చరిత్రలోనే ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లలో ఈ సినిమా ఒకటి. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన ఈ చిత్రం ఓ మోస్తరు అంచనాలతోనే విడుదలై బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. చూడ్డానికి మామూలు సినిమాగా అనిపిస్తూనే.. చాలా ప్లెజెంట్గా సాగుతూ.. ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతుందీ చిత్రం.
సినిమాలో వినోదానికి తోడు అదిరిపోయే పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. టీంలో ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చారు. ప్రేక్షకులు కూడా అందుకు తగ్గ ఫలితాన్నే అందించారు. ఈ సినిమాకు పని చేసిన మెయిన్ కాస్ట్ అండ్ క్రూ కలిసి మళ్లీ ఓ చిత్రం చేయబోతున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ ఓ సినిమాను నిర్మించబోతున్నట్లు సమాచారం. త్రివిక్రమ్తో బన్నీ మరో సినిమా చేస్తాడని ముందు నుంచే సంకేతాలు వస్తున్నాయి.
ఇటీవలే వీళ్లిద్దరూ ఒక కథ విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. బన్నీ, త్రివిక్రమ్ కలిసి గతంలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చేసినప్పటికీ.. వీరి కలయిక అనగానే ఇప్పుడు ‘అల..’నే గుర్తుకు వస్తోంది. దీంతో ప్రేక్షకులు సరిగ్గా అలాంటి సినిమానే కోరుకుంటారు.
ఈ నేపథ్యంలోనే గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు మరోసారి చేతులు కలుపుతున్నాయి. ఆటోమేటిగ్గా తమనే ఈ చిత్రానికి సంగీతం కూడా అందిస్తాడని భావించవచ్చు. మరి కథానాయికగా పూజా హెగ్డేనే కొనసాగుతుందా లేదా అన్నదే చూడాలి. త్రివిక్రమ్ వరుసగా మూడు చిత్రాల్లో ఆమెకు అవకాశం ఇచ్చాడు. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు రూపొందిస్తున్న చిత్రంలో పూజానే కథానాయిక అన్నది తెలిసిందే. ‘పుష్ప-2’ పూర్తి చేసిన వెంటనే త్రివిక్రమ్ సినిమాను బన్నీ పట్టాలెక్కిస్తాడు.
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…