రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న గేమ్ చేంజర్ విడుదల డిసెంబర్ లేదా జనవరిలో ఉంటుందని ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ కు నిరాశ తప్పేలా లేదు. జరుగుతున్న పరిణామాలు దాన్నే సూచిస్తున్నాయి. కమల్ హాసన్ ఇండియన్ 2 పొంగల్ ని ఫిక్స్ చేసుకుందని చెన్నై టాక్. తెలుగు డబ్బింగ్ నైజామ్ హక్కులను దిల్ రాజే తీసుకున్నారట. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇండియన్ 2 షూటింగ్ వేగవంతం చేసి ఇంకో రెండు మూడు నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం పూర్తి చేసేలా శంకర్ వేగం పెంచారు. దీనివల్లే రామ్ చరణ్ కు ఎక్కువ సెలవులు దొరికేశాయి.
ఇంతే కాదు త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబోలో రాబోయే ఎస్ఎస్ఎంబి 28 రైట్స్ కూడా రాజుగారికే వచ్చాయట. ఈ లెక్కన ఏ కోణంలో చూసినా గేమ్ చేంజర్ వచ్చే అవకాశం ఎంత మాత్రం లేదు. పైగా ప్రభాస్ ప్రాజెక్ట్ కె రేస్ లో ఉంది. ఇప్పటికే త్రిముఖ పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. మధ్యలో ఇంకో ప్యాన్ ఇండియా మూవీ రావడం అంత సేఫ్ కాదు. పైగా థియేటర్ల సమస్య వస్తుంది. అందుకే వేసవిలో టార్గెట్ చేసుకుని పుష్ప 2 ది రూల్, దేవర డేట్లను చూసుకుని కాంపిటీషన్ వల్ల గేమ్ చేంజర్ కు రిస్క్ రాకుండా దిల్ రాజు ప్లానింగ్ చేస్తున్నట్టు తెలిసింది.
ఈ లెక్కన చిత్రీకరణ ఎప్పుడు పూర్తయినా చరణ్ అభిమానులు ఇంకో ఏడాది పైనే ఎదురు చూడక తప్పదు. ఇంకా పాతిక భాగం టాకీ పార్ట్, రెండు పాటలు బ్యాలన్స్ ఉన్నాయట. హడావిడి పడి అటుఇటు చేసుకోవడం కన్నా నిదానమే ప్రధానం సూత్రం పాటించడమే మంచిది. ఇదయ్యాకే చరణ్ బుచ్చిబాబు సెట్లోకి ఎంటర్ కాగలడు. ఇంత ఆలస్యం ఉన్నందు వల్లే గేమ్ చేంజర్ కు సంబంధించి ఎలాంటి అప్ డేట్ ఇప్పట్లో ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ కి తమన్ సంగీతం మీద ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.
This post was last modified on May 24, 2023 10:47 am
నిన్న కల్ట్ టీజర్ రిలీజయ్యాక దాని మీద పెద్ద చర్చే జరుగుతోంది. ముఖ్యంగా హీరో కం దర్శకుడు విశ్వక్ సేన్…
హీరోల కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ కోసం కూడా కొంతమంది సినిమాలకు వస్తారు. కానీ…
“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…
గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…
జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…