ట్రెండ్ పేరుతో రీ రిలీజులను అభిమానులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో వీటి కలెక్షన్ల మీద జరుగుతున్న పంచాయితీ సోషల్ మీడియా వేదికగా తీవ్ర రూపం దాలుస్తోంది. శనివారం జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా పునఃవిడుదలైన సింహాద్రి మొదటి రోజే అయిదు కోట్ల గ్రాస్ వసూలు చేసిందన్న వార్త యాంటీ ఫ్యాన్స్ కు టార్గెట్ అయిపోయింది. ఖుషి, పోకిరి రికార్డులను బ్రేక్ చేసిందని పలు ట్వీట్లు హల్చల్ చేయగా అదేమీ లేదంటూ మహేష్ పవన్ అభిమానులు వాటికి కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. పరస్పరం కవ్వించుకుంటూ రెచ్చగొట్టుకునే దాకా వెళ్లారు.
నిజానికి ఈ పాత చిత్రాల రీరిలీజుల సంబరం రెండు మూడు రోజులకు పరిమితం అంతే. ఇప్పటిదాకా ఈ క్యాటగిరీలో వచ్చిన అన్ని సినిమాలు యూట్యూబ్ లో ఫ్రీగా దొరుతున్నవే. అయినా సరే థియేటర్ ఎక్స్ పీరియన్స్ కోసం ఆడియన్స్ వీటిని చూస్తుండటంతో డిస్ట్రిబ్యూటర్లు వరసగా దింపుతున్నారు. తారక్ బర్త్ డే కలిసి రావడంతో పాటు రాజమౌళి కాంబో కాబట్టి సింహాద్రికి గ్రాండ్ సెలెబ్రేషన్లు చేశారు. సీడెడ్ తో సహా పలు కీలక కేంద్రాల్లో నిజంగానే రికార్డులు నమోదయ్యాయి. కొత్త మూవీస్ అయితే నిర్మాత అధికారికంగా ప్రకటిస్తాడు కానీ వీటికా అవకాశం లేదు.
రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా ప్రెస్టీజియస్ గా తీసుకుని గుడుంబా శంకర్, అతడు లాంటి వాటికి రెట్టింపు రచ్చ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారట. అయినా వీటి వల్ల లక్షల రూపాయల ఖర్చు పెట్టుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటో ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలి. ఇప్పటికే ఈ ట్రెండ్ మొదలై ఏడెనిమిది నెలలు దాటేసింది. ఎక్కడో ఒక చోట బ్రేక్ వేయకపోతే ట్విట్టర్ లో ఇన్స్ టాలో ఈ గొడవలు ఇంకో రూపం దాల్చే ప్రమాదం లేకపోలేదు. అత్యుత్సాహం వల్ల కొన్ని థియేటర్లలో ఆస్తి నష్టం జరిగింది. ఇకనైనా రీరిలీజులను కేవలం అనుభూతి చెందేందుకు మాత్రమే వాడుకుంటే మంచిది.
This post was last modified on May 22, 2023 6:49 am
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…