స్వాతిముత్యంతో తెరకు పరిచయమైన బెల్లంకొండ గణేష్ రెండో సినిమా నేను స్టూడెంట్ సర్ జూన్ 2 విడుదలకు రెడీ అవుతోంది. సాయి శ్రీనివాస్ తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఏదో కొత్తగా ట్రై చేసే ఉద్దేశంతో కథలను బాగానే ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. డెబ్యూ మూవీకి కంటెంట్ పరంగా మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేదు. అందుకే ఆశలన్నీ దీని మీదే పెట్టుకున్నాడు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన నేను స్టూడెంట్ సర్ సరైన టైమింగ్ చూసుకుని వస్తోంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
సుబ్బు(బెల్లంకొండ గణేష్) కాలేజీ స్టూడెంట్. పైసా పైసా కూడబెట్టుకుని వాయిదాల పద్ధతిలో కొత్త ఐఫోన్ కొంటాడు. దీని మీద ఎంత ప్రేమంటే తల్లికి ఓ బిడ్డలా పరిచయం చేసి ఓ పేరు పెట్టమని అడుగుతాడు. అంతా బాగుందనుకుంటున్న టైంలో ఆ ఫోన్ లో ఒక వీడియో వల్ల సుబ్బు మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. కోటి రూపాయలకు పైగా డబ్బు సుబ్బు అకౌంట్ లో వచ్చి పడుతుంది. దీంతో హత్యానేరం మీద అతన్ని టార్గెట్ చేస్తాడు పోలీస్ కమీషనర్(సముతిరఖని). అయితే అమాయకుడైన సుబ్బుని కాపాడేందుకు విద్యార్ధి లోకం రంగంలోకి దిగుతుంది.
దర్శకుడు రాఖి ఉప్పలపాటి తీసుకున్న పాయింట్ కొంచెం కొత్తగానే అనిపిస్తోంది. సరైన రీతీలో లాజిక్స్ ని ప్రెజెంట్ చేయగలిగితే మంచి థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ అవుతుంది. విజువల్స్ గట్రా మాస్ కి రీచ్ అయ్యేలా తీసుకున్న శ్రద్ధ కనిపిస్తోంది. మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చారు. అవంతిక దస్సని హీరోయిన్. కాన్సెప్ట్ ఎంత వెరైటీగా ఉన్నా చూపించే విధానం ఏ మాత్రం అటుఇటు అయినా ఫలితం తేడా కొడుతోంది. మరి నేను స్టూడెంట్ సర్ ఈ బలహీనత లేకుండా గట్టెక్కగలిగితే కుర్రాడికి మంచి హిట్ పడుతుంది. జూన్ 2 చిన్న సినిమాల పోటీ మధ్గ్య గణేష్ తన లక్కు పరీక్షించుకోబోతున్నాడు.
This post was last modified on May 22, 2023 6:45 am
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…