అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఎన్టీఆర్ 30 టైటిల్ ని అధికారికంగా ప్రకటించారు. గత మూడు రోజుల నుంచి ప్రచారంలో ఉన్నట్టే దేవరను లాక్ చేశారు. తారక్ కు సంబంధించిన లుక్ ని పూర్తిగా రివీల్ చేశారు. సముద్రపు అలలు ఎగసి పడుతుండగా రాళ్ళ గుట్టలపై నిలుచుని చేతిలో బల్లెంతో చుట్టూ తాను తెగనరికిన దుర్మార్గుల శవాలతో జూనియర్ గెటప్ చాలా ఇంటెన్స్ గా ఉంది. రొటీన్ మాస్ టైపులో కాకుండా నల్లని చొక్కా పంచెతో దర్శనం ఇవ్వడం ఎవరూ ఊహించనిది.
అంటే ఇందులో సగటు కమర్షియల్ జానర్ లో ఉండే రెగ్యులర్ ట్రీట్ మెంట్ అయితే కాదన్న మాట. కళ్ళలో సముద్రమంత ఆవేశాన్ని నింపుకున్నట్టు జూనియర్ ఎన్టీఆర్ చూస్తున్న చూపు ఫ్యాన్స్ లో అంచనాలు ఎటో తీసుకెళ్లేలా ఉంది. బ్యాక్ డ్రాప్ గురించి చిన్న క్లూ తప్ప ఎలాంటి సమాచారం బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్న కొరటాల శివ తన మీద ఏ స్థాయిలో ఒత్తిడి ఉందో గుర్తించే ఫస్ట్ లుక్ డిజైన్ ని ఇలా చేయించినట్టు స్పష్టమవుతోంది. ఆర్ఆర్ఆర్ మల్టీస్టారర్ కాబట్టి తారక్ ని సోలోగా స్క్రీన్ మీద చూసుకోవాలని ఫ్యాన్స్ నాలుగేళ్లుగా వెయిట్ చేస్తున్నారు.
అరవింద సమేత వీర రాఘవ వచ్చి చాలా కాలమైన నేపథ్యంలో ఎదురుచూపులు మాములుగా లేవు. దానికి తగ్గట్టే ఉన్న ఈ పోస్టర్ మొత్తానికి హైప్ ని అమాంతం పెంచేసింది. తనకు మాత్రమే సూటయ్యే హై వోల్టేజ్ క్యారెక్టర్ ఏదో కొరటాల శివ బలంగా సెట్ చేశారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీలో తనతో పాటు జాన్వీ కపూర్ హీరోయిన్ గా డెబ్యూ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒక కీలక షెడ్యూల్ లో ఇద్దరూ పాల్గొన్నారు. 2024 ఏప్రిల్ 5 విడుదల కాబోతున్న దేవర ఫైనల్ గా జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజుకు మంచి కానుకే ఇచ్చింది
This post was last modified on May 19, 2023 8:00 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…