నిన్న విడుదలైన హాలీవుడ్ మూవీ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ పదో భాగం ఫాస్ట్ ఎక్స్ మీద అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇండియాలో రెండు నెలల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ పెట్టడం చూస్తే క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మొదటి రోజు దేశవ్యాప్తంగా సుమారు 70 వేలకు పైగా మల్టీప్లెక్సు టికెట్లు అమ్ముడుపోవడాన్ని బట్టి ఆడియన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో స్పష్టమవుతోంది.
పైగా త్రీడి వెర్షన్ కావడంతో అభిమానులు మంచి ఎగ్జైట్ మెంట్ తో ఉన్నారు. అయితే రివ్యూలు రిపోర్ట్స్ అంత ఆశాజనకంగా లేకపోవడం అసలు ట్విస్టు. కుటుంబంతో కలిసి ప్రశాంతంగా బ్రతుకుతున్న డొమినిక్ టోరెట్టో(విన్ డీజిల్)కు ఏజెన్సీ నుంచి మెసేజ్ వస్తుంది. ఒక మిషన్ కు హాజరు కమ్మని ఆదేశాలు జారీ చేస్తుంది. అయితే తను వెళ్లకుండా రోమన్(టైరీస్ గిబ్సన్)బృందాన్ని దానికోసం పంపిస్తాడు. కానీ ఇది శత్రువులు తనను లక్ష్యంగా చేసుకున్న ట్రాప్ అని అర్థమవుతుంది.
దీంతో టీమ్ తో పాటు ఫ్యామిలీను కాపాడుకునే బాధ్యత డొమినిక్ మీద పడుతుంది. అదెలా చేశాడనేదే కథ. ఆద్యంతం యాక్షన్ విజువల్స్ తో నింపేసిన దర్శకుడు లూయిస్ లెటెరియర్ గ్రావిటీ సైతం ఆశ్చర్యపోయేలా నమ్మశక్యం కానీ ఫైట్లు ఛేజులతో నింపేశాడు. ఇంతకు ముందు భాగాలు ఫాలో అయినవాళ్లకు మాత్రమే ఫాస్ట్ ఎక్స్ లో అసలు ట్విస్టులు అర్థమవుతాయి.
లైన్ చిన్నదే. విలన్ హీరో మీద పన్నిన రివెంజ్ డ్రామా అంతే. సాగతీత, అవసరం లేని సీన్లు, హోరెత్తించే బిజిఎం ఇబ్బంది పెడతాయి. ఈ సిరీస్ వీరాభిమానులకు ఓ మోస్తరుగా నచ్చవచ్చేమో కానీ రెగ్యులర్ ఆడియన్స్ కి మాత్రం చివరి నలభై నిముషాలు మినహాయించి అధిక శాతం బోర్ కొట్టేస్తుంది. టెక్నికల్ గా ఫాస్ట్ ఎక్స్ ఒక అద్భుతం. కానీ సినిమాటిక్ గా మాత్రం జస్ట్ యావరేజ్ మూవీ. ఆక్వామెన్ హీరో జాసన్ మోమోయ్ విలనిజం ఇందులో ప్రత్యేక ఆకర్షణ.
This post was last modified on May 19, 2023 10:23 am
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…