ఈ వేసవి టాలీవుడ్ కు సంబంధించి ఒక హిట్టు నాలుగు ఫ్లాపులతో చప్పగా ఉంది కానీ ఇతర భాషల్లో అసలు స్టార్లే లేకుండా వంద కోట్ల సినిమాలు నమోదవుతున్నాయి. అందులో మొదటిది మలయాళంలో వచ్చిన 2018. అయిదేళ్ల క్రితం కేరళను ఊపేసిన వరదల నేపథ్యంలో దర్శకుడు జూడ్ ఆంటోనీ జోసెఫ్ రూపొందించిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ కి మల్లువుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం పదకొండు రోజుల్లో 100 కోట్ల గ్రాస్ సాధించి వామ్మో అనిపించేసింది.
పులి మురుగన్, లూసిఫర్ లకు మాత్రమే సాధ్యమైన ఈ ఫీట్ ని అలవోకగా సాధించి డబుల్ సెంచరీని టార్గెట్ గా పెట్టుకుంది. ఇక వివాదాలే కేంద్రంగా రిలీజైన ది కేరళ స్టోరీ మూడో వారం రాకుండానే 150 కోట్ల దగ్గరగా వెళ్లి మతులు పోగొట్టేసింది. సల్మాన్ ఖాన్ లాంటి బడా హీరోలు రంజాన్ పండగ లాంటి ఛాన్స్ ని వాడుకోలేక చేతులు ఎత్తేస్తే అసలే ఇమేజ్ లేని అదా శర్మ ప్రధాన పాత్రలో రూపొందిన నిజ జీవిత కథకి నార్త్ ఆడియన్స్ జై కొట్టేశారు.
తమిళనాడు, బెంగాల్, కేరళలో బ్యాన్ చేసినప్పటికీ ఈ స్థాయిలో వసూళ్లు రావడం నిజంగా అద్భుతమే. దర్శకుడు సుదిప్తో సేన్ పేరు మారుమ్రోగిపోతోంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కొంత ఆలస్యంగా వచ్చినందు వల్ల స్పందన ఆశించిన స్థాయిలో లేదు. మండిపోయే ఎండల్లోనూ కంటెంట్ బలాన్ని 2018, ది కేరళ స్టోరీ ఋజువు చేశాయి.
ఓపెనింగ్స్ తెచ్చే స్టార్లు లేకపోయినా కేవలం టాక్ తో రికార్డులు బద్దలు కొట్టొచ్చని పాఠం నేర్పించాయి. దురదృష్టవశాత్తు అలాంటి మేజిక్ మూవీ ఏదీ తెలుగులో పడలేదు. దసరా, విరూపాక్ష మినహాయించి సీజన్ మొత్తం డల్లుగా నడిచిపోయింది. ఏజెంట్, శాకుంతలం, కస్టడీలు తెచ్చిన నీరసం అంతా ఇంతా కాదు. సమ్మర్ ఇంకో రెండు నెలలు కొనసాగుతుంది కాబట్టి ఆలోగా కనీసం ఓ మూడు నాలుగు బ్లాక్ బస్టర్లు పడితే థియేటర్లకు మళ్ళీ కళ వస్తుంది. లేదంటే ఈ సెలవులు వృథా అయినట్టే.
This post was last modified on May 16, 2023 7:44 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…