తెలుగు సినిమా అంటే కొన్ని అనధికారిక నియమ నిబంధనలుంటాయి. హీరో అందగాడై ఉండాలి. తెల్లగా.. లేదా కనీసం ఛామన ఛాయతో ఉండాలి. ఒడ్డూ పొడవూ బాగుండాలి. బాడీ షేప్ అదీ ఓ రేంజిలో ఉండాలి. ఇలా ఉంటేనే హీరో. ఇండస్ట్రీనే కాదు.. ప్రేక్షకులు కూడా హీరో ఇలా ఉంటేనే ఆమోదిస్తారు. కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా సర్జరీలు అవీ చేసి అయినా ఒక రూపు తెచ్చే ప్రయత్నం చేస్తారు. అంతే తప్ప లుక్స్ విషయంలో తేడా ఉంటే మాత్రం హీరోగా అంగీకరించే పరిస్థితే ఉండదు. అలా కనిపించే వాళ్లను కామెడీ రోల్స్కు పరిమితం చేసి పడేస్తారు.
మన హీరోల పాత్రలు మామూలుగానే లార్జన్ దన్ లైఫ్ తరహాలో ఉంటాయి కాబట్టి.. హీరోల లుక్స్ విషయంలోనూ ఇలాగే ఆలోచిస్తారు. పాత్రలు సామాన్యంగా ఉంటే.. హీరోల లుక్స్ సాధారణంగా ఉన్నా కూడా చెల్లుబాటు అవుతుంది. కానీ ఇలాంటి ‘సాధారణమైన’ కథల పట్ల మన వాళ్లకు ఆసక్తి తక్కువ. కానీ తమిళంలో అలా కాదు. అక్కడి కథల్లాగే హీరోలు కూడా అత్యంత సామాన్యంగా ఉంటారు. మనవాళ్లు కమెడియన్గా కూడా అంగీకరించని యోగి బాబు లాంటి వాణ్ని హీరోగా పెట్టి పెట్టి వరుసగా అక్కడ సినిమాలు తీస్తున్నారంటే ఆశ్చర్యపోవాల్సిందే.
ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో తెలుగు సినిమా ఎంతో మారింది. ఇమేజ్ ఉన్న వాడే హీరో అనుకోకుండా.. లుక్స్ గురించి కూడా ఆలోచించకుండా కంటెంట్ ఉంటే సినిమాను ఆదరించే రోజులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మన ఫిలిం మేకర్స్ ఆలోచనలు కూడా మారుతున్నాయి. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పరిచయమై కామెడీ రోల్స్ చేస్తూ పత్తా చాటుకుంటున్న యువ నటుడు సుహాస్ హీరోగా తెరకెక్కిన కొత్త చిత్రం ‘కలర్ ఫొటో’ టీజర్ ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. సుహాస్ చేసిన కొన్ని పాత్రలతోనే మంచి నటుడిగా గుర్తింపు సంపాదించాడు. తన లుక్స్ ప్రకారం చూస్తే హీరోగా పెట్టి సినిమా తీయడం ఆశ్చర్యమే.
కొన్నేళ్ల ముందు టాలీవుడ్లో ఇలాంటి సినిమాను ఊహించే వాళ్లం కాదు. కానీ అతడి మిత్రుడు సందీప్ రాజ్, ‘హృదయ కాలేయం’ దర్శక నిర్మాత సాయి రాజేష్ కలిసి సాహసం చేశారు. హీరో లుక్స్కు అనుగుణంగానే అతడి పాత్రనూ తీర్చిదిద్దారు. అతడి పాత్రతో పాటు టీజర్ జనాలను ఆకట్టుకుంటోంది. టీజర్ చూస్తే సినిమా హిట్టవడం గ్యారెంటీ అనిపిస్తోంది. మామూలుగా కమెడియన్లు హీరోలంటే అది కామెడీ సినిమాలాగే ఉంటుంది. కానీ ఇది సీరియస్ లవ్ స్టోరీ. ఫీల్తో పాటు ఇంటెన్సిటీ కనిపిస్తోంది. ఇది కనుక అంచనాలకు తగ్గట్లు ఉండి ప్రేక్షకాదరణ పొందితే ట్రెండ్ సెట్టర్ అయ్యే అవకాశముంది. ఇలాంటి ‘సాధారణ’ హీరోలు, కథలు మరిన్ని తెర మీద చూడొచ్చన్నమాటే.
This post was last modified on August 6, 2020 11:57 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…