కొన్ని రీమేక్ విశేషాలు మహా విచిత్రంగా ఉంటాయి. 2016లో వచ్చిన విజయ్ తేరి ముచ్చట్లు చూస్తే అదే అనిపిస్తుంది. ఇది ఆ టైంలోనే తెలుగులో పోలీసోడుగా డబ్బింగ్ జరుపుకుని దిల్ రాజు ద్వారా రిలీజై పెద్దగా ఆడలేదు . ప్రైమ్ లో శాటిలైట్ ఛానల్ లో వచ్చాక చాలా మంది చూశారు. అయినా ఈ కథ విపరీతంగా నచ్చిన పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఒరిజినల్ వెర్షన్ తో వీలైనంత పోలికలు రాకుండా దర్శకుడు హరీష్ శంకర్ దీన్ని తీర్చిదిద్దుతున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఇటీవలే వచ్చిన చిన్న టీజర్ భారీ స్పందన దక్కించుకుంది. ఇప్పుడీ తేరినే హిందీలో వరుణ్ ధావన్ తో చేయబోతున్నారు. ఆట్లీనే దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ జవాన్ ని పూర్తి చేసే పనిలో ఉన్న ఆట్లీ అది పూర్తి కాగానే బాలీవుడ్ తేరిని మొదలుపెడతాడట. ఇందుకుగాను భారీ రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్టు ముంబై మీడియా న్యూస్.
అయినా మళ్ళీ అదే కథని ఎందుకు తీయాలనే సందేహం వస్తోంది కదూ. అంత పెద్ద స్టార్ పవన్ చేయడానికి సిద్ధపడినప్పుడు వరుణ్ లాంటి మీడియం హీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఎందుకు వెనుకాడతారు. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అసలు ఈ తేరినే ఓ పాత మూవీకి ఫ్రీ మేక్. 1990లో విజయ్ కాంత్ క్షత్రియుడు వచ్చింది.
ఫ్లాష్ బ్యాక్ లో భార్య రేవతిని విలన్ చంపేస్తే పోలీస్ ఉద్యోగం వదిలేసి అజ్ఞాతంలో గడుపుతున్న హీరో దగ్గరకు భానుప్రియ వస్తుంది. జైల్లో ఉన్న ప్రతినాయకుడు బయటికి వచ్చి మళ్ళీ విజయ్ కాంత్ ని రెచ్చగొడతాడు. దీనికి కథను అందించింది మణిరత్నం. ఆట్లీ ఈ మెయిన్ పాయింట్ ని తీసుకునే తేరి రాసుకున్నాడు. కట్ చేస్తే ఇప్పుడది అన్ని భాషల్లోనూ రీమేక్ చేసే స్థాయికి చేరుకుంది. హిందీలో మార్పులు చేయడం కన్నా కలర్ జిరాక్స్ వైపే ఆట్లీ మొగ్గు చూపిస్తున్నాడని వినికిడి.
This post was last modified on May 16, 2023 4:31 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…