కొన్ని రీమేక్ విశేషాలు మహా విచిత్రంగా ఉంటాయి. 2016లో వచ్చిన విజయ్ తేరి ముచ్చట్లు చూస్తే అదే అనిపిస్తుంది. ఇది ఆ టైంలోనే తెలుగులో పోలీసోడుగా డబ్బింగ్ జరుపుకుని దిల్ రాజు ద్వారా రిలీజై పెద్దగా ఆడలేదు . ప్రైమ్ లో శాటిలైట్ ఛానల్ లో వచ్చాక చాలా మంది చూశారు. అయినా ఈ కథ విపరీతంగా నచ్చిన పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఒరిజినల్ వెర్షన్ తో వీలైనంత పోలికలు రాకుండా దర్శకుడు హరీష్ శంకర్ దీన్ని తీర్చిదిద్దుతున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఇటీవలే వచ్చిన చిన్న టీజర్ భారీ స్పందన దక్కించుకుంది. ఇప్పుడీ తేరినే హిందీలో వరుణ్ ధావన్ తో చేయబోతున్నారు. ఆట్లీనే దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ జవాన్ ని పూర్తి చేసే పనిలో ఉన్న ఆట్లీ అది పూర్తి కాగానే బాలీవుడ్ తేరిని మొదలుపెడతాడట. ఇందుకుగాను భారీ రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్టు ముంబై మీడియా న్యూస్.
అయినా మళ్ళీ అదే కథని ఎందుకు తీయాలనే సందేహం వస్తోంది కదూ. అంత పెద్ద స్టార్ పవన్ చేయడానికి సిద్ధపడినప్పుడు వరుణ్ లాంటి మీడియం హీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఎందుకు వెనుకాడతారు. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అసలు ఈ తేరినే ఓ పాత మూవీకి ఫ్రీ మేక్. 1990లో విజయ్ కాంత్ క్షత్రియుడు వచ్చింది.
ఫ్లాష్ బ్యాక్ లో భార్య రేవతిని విలన్ చంపేస్తే పోలీస్ ఉద్యోగం వదిలేసి అజ్ఞాతంలో గడుపుతున్న హీరో దగ్గరకు భానుప్రియ వస్తుంది. జైల్లో ఉన్న ప్రతినాయకుడు బయటికి వచ్చి మళ్ళీ విజయ్ కాంత్ ని రెచ్చగొడతాడు. దీనికి కథను అందించింది మణిరత్నం. ఆట్లీ ఈ మెయిన్ పాయింట్ ని తీసుకునే తేరి రాసుకున్నాడు. కట్ చేస్తే ఇప్పుడది అన్ని భాషల్లోనూ రీమేక్ చేసే స్థాయికి చేరుకుంది. హిందీలో మార్పులు చేయడం కన్నా కలర్ జిరాక్స్ వైపే ఆట్లీ మొగ్గు చూపిస్తున్నాడని వినికిడి.
This post was last modified on May 16, 2023 4:31 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…